Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

వేల కిలోమీటర్లు ఎగురుకుంటూ వచ్చిన అతిథులు..

24 February 2026

హోలికా దహనంలో ఈ కలపను వాడుతున్నారా.. జాగ్రత్త

24 February 2026

PM Modi: సేవా తీర్థలో తొలి కేబినెట్ మీటింగ్.. ప్రధాని మోదీ ఎమోషనల్ ట్వీట్

24 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Pushpa Style Ganja Smuggling In Narsipatnam,స్మగ్లర్‌గా మారిన కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్.. పుష్పనే మించిపోయేలా ప్లాన్.. కోట్లల్లో వ్యవహారం.. – narsipatnam police catch ganja smuggling gang who setting up secret compartments in bolero in anakapalli
ఆంధ్రప్రదేశ్

Pushpa Style Ganja Smuggling In Narsipatnam,స్మగ్లర్‌గా మారిన కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్.. పుష్పనే మించిపోయేలా ప్లాన్.. కోట్లల్లో వ్యవహారం.. – narsipatnam police catch ganja smuggling gang who setting up secret compartments in bolero in anakapalli

.By .24 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Pushpa Style Ganja Smuggling In Narsipatnam,స్మగ్లర్‌గా మారిన కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్.. పుష్పనే మించిపోయేలా ప్లాన్.. కోట్లల్లో వ్యవహారం.. – narsipatnam police catch ganja smuggling gang who setting up secret compartments in bolero in anakapalli
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఉన్నత చదువు చదివిన ఓ వ్యక్తి దారి తప్పి గంజాయి స్మగ్లర్‌గా మారిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది, అయితే నిందితులు గంజాయి తరలిస్తూ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పోలీసులకు దొరికిపోయారు. హరిబాబు అనే వ్యక్తి గంజాయి స్మగ్లింగ్ చేస్తూ ఓ సారి జైలుకు వెళ్లాడు. అక్కడైన పరిచయాలతో బయటకు రాగానే బొలెరోలు కొనుగోలు చేసి వాటికి రహస్య అరలు ఏర్పాటు చేయించి గంజాయి అక్రమ రవాణా ప్రారంభించారు. అయితే సోమవారం రోజు ఈ ముఠా నర్సీపట్నం పోలీసులకు దొరికిపోయింది.

Pushpa Style Ganja Smuggling in Narsipatnam
బొలెరో అరలు గంజాయి అక్రమ రవాణా(ఫోటోలు– Samayam Telugu)
కంప్యూటర్ సైన్స్ చదివిన ఓ వ్యక్తి.. దారి తప్పి గంజాయి స్మగ్లర్‌గా మారిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పోలీసులు ఇటీవల కొంతమంది గంజాయి స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా మీదుగా గంజాయి రవాణా జరుగుతున్నట్లు నర్సీపట్నం పోలీసులకు సమాచారం అందింది. దీంతో తనిఖీలు నిర్వహించిన పోలీసులు.. వాహనాలలో గంజాయి రవాణా చేస్తున్న ముఠాను సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 80 ప్యాకెట్లలో నిలువ చేసిన 160 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే రెండు బొలెరో వాహనాలు, ఒక కారు, బైక్, తొమ్మిది సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.1.19 కోట్లు ఉండొచ్చని పోలీసుల అంచనా.

మరోవైపు ఈ కేసుకు సంబంధించిన వివరాలను నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లాలోని సైదులుపేటకు చెందిన హరిబాబు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. కంప్యూటర్స్‌ సైన్స్‌ వరకూ చదివిన హరిబాబు.. గంజాయితో పోలీసులకు దొరికిపోయి 2018లో తొలిసారిగా జైలుకు వెళ్లాడు. జైలులో గంజాయి నిందితులతో హరిబాబుకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం సాయంతో వారంతా కలిసి ముఠాగా ఏర్పడ్డారు. జైలు నుంచి విడుదలైన తర్వాత రెండు బొలెరో వాహనాలను కొనుగోలు చేయించాడు హరిబాబు. ఆ తర్వాత ఆ బొలెరోలలో ఎవరికీ కనిపించకుండా ఉండేలా రహస్య అరలు ఏర్పాటు చేయించాడు.

ఆ తర్వాత హరిబాబు తన వ్యాపారం మొదలుపెట్టాడు. గంజాయిని ఒడిశాలో కొనుగోలు చేయటం, బొలెరోలలోని రహస్య అరలలో వాటిని దాచి అక్రమంగా సరఫరా చేయటం ప్రారంభించారు. ఎవరికీ అనుమానం రాకుండా పైన కూరగాయలు ఉంచి.. లోపల మాత్రం గంజాయి ప్యాకెట్లు ఉంచి రవాణా చేయటం ప్రారంభించారు. ఈ రకంగా పోలీసులను మస్కా కొట్టి ఇప్పటి వరకూ 12 సార్లు గంజాయి రవాణా చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితేఈ సారి మాత్రం అతని ఎత్తులు పారలేదు.

తమిళనాడులోని దిండిగల్‌కు గంజాయి తరలిస్తూ నర్సీపట్నం పోలీసులకు హరిబాబు ముఠా దొరికిపోయింది. ఐదుగురు సభ్యులు పోలీసులకు దొరకగా.. ఇద్దరు పరారయ్యారు. పరారైన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఒడిశా నుంచి గంజాయిని తీసుకువస్తూ నాతవరం మండలం వెదురుపల్లి వద్ద దొరికినట్లు పోలీసులు వెల్లడించారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి