Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

రూ.10 వేలు పెడితే 10 లక్షలు.. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ మ్యాజిక్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షమే..

25 February 2026

Drishyam 3: దృశ్యం 3 సినిమా రిలీజ్ డేట్ ఖరారు

25 February 2026

టాలీవుడ్‌లో పెళ్లి సందడి.. నెల రోజుల్లో 3 పెళ్లిళ్లు

25 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»26 Rdos Transfers In Ap,ఏపీలో 2018 గ్రూప్-1 అధికారుల మూకుమ్మడి బదిలీ.. 26 మంది ఆర్డీవోలు ట్రాన్స్‌ఫర్.. – andhra pradesh government transfers 26 rdos and chief secretary issue orders
ఆంధ్రప్రదేశ్

26 Rdos Transfers In Ap,ఏపీలో 2018 గ్రూప్-1 అధికారుల మూకుమ్మడి బదిలీ.. 26 మంది ఆర్డీవోలు ట్రాన్స్‌ఫర్.. – andhra pradesh government transfers 26 rdos and chief secretary issue orders

.By .25 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
26 Rdos Transfers In Ap,ఏపీలో 2018 గ్రూప్-1 అధికారుల మూకుమ్మడి బదిలీ.. 26 మంది ఆర్డీవోలు ట్రాన్స్‌ఫర్.. – andhra pradesh government transfers 26 rdos and chief secretary issue orders
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 26 మంది ఆర్డీవోలను ఒకేసారి బదిలీ చేసింది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. 2018 గ్రూప్ -1 నియామకాలపై హైకోర్టులో దాఖలైన రిట్ అప్పీల్ తీర్పు మేరకు ఏపీ ప్రభుత్వం ఈ మూకుమ్మడి బదిలీ నిర్ణయం తీసుకుంది. తదుపరి పోస్టింగ్‌ల కోసం వీరందరినీ జీఏడీలో రిపోర్ట్ చేయాలని సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.

RDOs Transfers in AP
s, ఆర్డీవోల మూకుమ్మడి బదిలీ(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఒకేసారి 26 మంది ఆర్డీవోలను ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2018 గ్రూప్-1 అధికారుల నియామక ప్రక్రియపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. 2018 గ్రూప్ -1 నియామక ప్రక్రియలో జరిగినట్లుగా భావిస్తున్న లోపాలపై విచారణ పూర్తయ్యే వరకూ.. ఆ అధికారులను అప్రాధాన్య పోస్టుల్లోనే ఉంచాలని హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణ కొనసాగుతున్న తరుణంలో.. ఈ అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించవద్దని స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వుల మేరకు సీఎస్ విజయానంద్.. విధుల్లో ఉన్న 26 మంది ఆర్డీవోలను బదిలీ చేశారు. వారిని బాధ్యతల నుంచి తప్పించి, సాధారణ పరిపాలన శాఖకు అటాచ్ చేస్తూ సీఎస్ విజయానంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో 2018 గ్రూప్ -1 రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో జరిగాయంటున్న లోపాలపై విచారణ ముగిసి, తీర్పు వచ్చే వరకు వీరంతా అప్రాధాన్య పోస్టులలో ఉండే అవకాశాలు ఉన్నాయి.

అసలు వివాదం..

2018 గ్రూప్-1 పరీక్షల ప్రక్రియపై పలు ఆరోపణలు ఉన్నాయి. గ్రూప్ 1 మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. దీంతో కొంతమంది అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. జవాబు పత్రాల మూల్యాంకనంలో భాగంగా తొలుత డిజిటల్ మూల్యాంకనం చేశారని, మళ్లీ మాన్యువల్ మూల్యాంకనం చేశారని .. ఈ ప్రక్రియలో పారదర్శకత లేదంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఒకే పేపర్‌ను మూడుసార్లు మూల్యాంకనం చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థుల పిటిషన్ విచారించిన హైకోర్టు, పాత ఎంపిక జాబితాను రద్దుచేయటంతో పాటుగా మళ్లీ కొత్తగా మూల్యాంకనం చేయాలనిగతంలో తీర్పునిచ్చింది.

మరోవైపు 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ ద్వారా 167 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరు రాష్ట్రంలోని వివిధ కీలక శాఖల్లో పనిచేస్తున్నారు. కొంతమంది ఆర్డీవోలుగా, మరికొంతమంది డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లుగా పనిచేస్తున్నారు. అయితే అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేయాలంటూ కోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. తాజాగా 26 మంది ఆర్డీవోలను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి