Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

వరంగల్ జిల్లా కోర్టులో టెన్షన్ టెన్షన్.. ఉరుకు పరుగులు పెట్టించిన బాంబు బెదిరింపులు..!

26 February 2026

‘ఆ ఇద్దరి గురించి నోరు జారాడు..’ పాపం !! అడ్డంగా దొరికిన తమన్

26 February 2026

గోంగూర ఉల్లి కారం ఇలా చేస్తే.. ఆహా అదిరిందంటూ వదలకుండా మొత్తం లాగించేస్తారు

26 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»ఏపీలో దేశంలోనే అతి పెద్ద పరిశ్రమ.. రూ.1.35 లక్షల కోట్లతో.. మార్చి 7న స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన – arcelormittal nippon steel plant bhoomi pooja in anakapalli district on march 7th
ఆంధ్రప్రదేశ్

ఏపీలో దేశంలోనే అతి పెద్ద పరిశ్రమ.. రూ.1.35 లక్షల కోట్లతో.. మార్చి 7న స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన – arcelormittal nippon steel plant bhoomi pooja in anakapalli district on march 7th

.By .26 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
ఏపీలో దేశంలోనే అతి పెద్ద పరిశ్రమ.. రూ.1.35 లక్షల కోట్లతో.. మార్చి 7న స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన – arcelormittal nippon steel plant bhoomi pooja in anakapalli district on march 7th
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Andhra Pradesh Arcelor Mittal Steel Plant Bhoomi Pooja Update: ఏపీలో దేశంలోనే అతిపెద్ద స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి కీలక ముందడుగు పడింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి దగ్గర మార్చి 7న ఆర్సెలాల్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు మిట్టల్ సంస్థ ట్వీట్ చేసింది. రూ.1.35 లక్షల కోట్లతో.. రూ.2,200 ఎకరాల్లో ఈ స్టీల్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

హైలైట్:

  • ఏపీలో ఆర్సెలాల్ మిట్టర్ స్టీల్‌ప్లాంట్
  • అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు
  • మార్చి 7న శంకుస్థాపన చేయనున్నారు
AP Arcelor Mittal Rs 1.35 Crore Steel Plant
రూ.1.35 లక్షల కోట్ల నిప్పాన్‌ ఉక్కు కర్మాగారం(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్‌కు ఐటీ కంపెనీలు, పరిశ్రమలు క్యూకట్టాయి.. ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. ఇప్పుడు ఒక్కొక్క పరిశ్రమకు సంబంధించి నిర్మాణ పనులు ప్రారంభం అవుతున్నాయి. తాజాగా మరో ప్రతిష్టాత్మక సంస్థ పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి శంకుస్థాపన కోసం ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఏఎంఎన్‌ఎస్‌ (ఆర్సెలాల్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా) సంస్థ అనకాపల్లి జిల్లాలో దేశంలోనే అతిపెద్ద స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో మార్చి 7న శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు ఏఎంఎన్‌ఎస్‌ యాజమాన్యం శంకుస్థాపనకు సంబంధించిన వివరాలను ‘ఎక్స్‌’ ద్వారా ప్రకటించింది. చాలా కాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నామంటూ ఆర్సెలాల్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా పేర్కొంది. ట్వీట్‌లో శంకుస్థాపనకు సంబంధించి కంపెనీ ఫోటోతో పాటుగా, గూగుల్‌ మ్యాప్, ఇతర వివరాలను కూడా ప్రస్తావించింది. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రలు, రాష్ట్రమంత్రులు హాజరవుతారనే చర్చ జరుగుతోంది.. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్న నక్కపల్లి మండలంలో ప్రాంతాన్ని అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌తో పాటుగా అధికారులు పరిశీలించారు. ఈ మేరకు అక్కడ భద్రతా ఏర్పాట్లను కూడా పరిశీలించారు.

ఆర్సెలాల్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా సంస్థ శంలోనే అతిపెద్ద స్టీల్‌ప్లాంట్‌‌ను దాదాపు రూ.1.35 లక్షల కోట్లతో ఏర్పాటు చేయనున్నారు. ఈ భారీ పరిశ్రమను రెండు దశల్లో ఏర్పాటు చేయనున్నారు. ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయని అధికారులు చెబుతున్నారు. ఈ స్టీల్‌ప్లాంట్‌కు అవసరమైన భూమిని ఏపీ ప్రభుత్వం కేటాయించింది. ఎకరా రూ.51,39,690 ధరకు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు కోసం తొలిదశలో 2,200 ఎకరాలు కేటాయించారు. అంతేకాదు ఏపీ ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్‌కు రాయితీలు, ప్రోత్సాహకాలతో ప్యాకేజీ కూడా ప్రకటించింది. అయితే ఈ స్టీల్ ప్లాంట్ తొలిదశ ప్రాజెక్టు పురోగతిని బట్టి రెండోదశ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ ఉంటుంది. మొత్తం మీద ఆర్సెలాల్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు మరో ముందడుగు పడబోతోంది.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి