Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

వరంగల్ జిల్లా కోర్టులో టెన్షన్ టెన్షన్.. ఉరుకు పరుగులు పెట్టించిన బాంబు బెదిరింపులు..!

26 February 2026

‘ఆ ఇద్దరి గురించి నోరు జారాడు..’ పాపం !! అడ్డంగా దొరికిన తమన్

26 February 2026

గోంగూర ఉల్లి కారం ఇలా చేస్తే.. ఆహా అదిరిందంటూ వదలకుండా మొత్తం లాగించేస్తారు

26 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»ఏపీలో కిడ్నీ రోగులకు ఉచితంగా డయాలసిస్.. ఒక్కొక్కరికి రూ.86వేలు, మంత్రి కీలక ప్రకటన – free dialysis for poor kidney patients in andhra pradesh says minister satyakumar yadav
ఆంధ్రప్రదేశ్

ఏపీలో కిడ్నీ రోగులకు ఉచితంగా డయాలసిస్.. ఒక్కొక్కరికి రూ.86వేలు, మంత్రి కీలక ప్రకటన – free dialysis for poor kidney patients in andhra pradesh says minister satyakumar yadav

.By .26 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
ఏపీలో కిడ్నీ రోగులకు ఉచితంగా డయాలసిస్.. ఒక్కొక్కరికి రూ.86వేలు, మంత్రి కీలక ప్రకటన – free dialysis for poor kidney patients in andhra pradesh says minister satyakumar yadav
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


AP Govt Free Dialysis For Poor Kidney Patients: ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో పేద కిడ్నీ రోగులకు ఉచితంగా డయాలసిస్ అందిస్తోంది. ఏడాదికి ఒక్కొక్కరికి రూ.86000 వేల వరకు ఖర్చు చేస్తోంది. అంతేకాదు గతంలో పోలిస్తే ఇప్పుడు సెషన్లు కూడా పెరిగాయి. గతంలో 40 వేలు ఉంటే.. ఇప్పుడు అది 66 వేలకు చేరింది. ఈ వివరాలను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శాసనమండలిలో తెలియజేశారు.

హైలైట్:

  • ఏపీలో పేద కిడ్నీ రోగులకు తీపికబురు
  • ఉచితంగా డయాలసిస్ సేవలు
  • ఒక్కొక్కరికి ఏడాదికి రూ.86వేలు ఖర్చు
AP Govt Free Dialysis For Kidney Patients
ఏపీలో కిడ్నీ రోగులకు ఉచితంగా డయాలసిస్(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్‌లో పేద కిడ్నీ రోగులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది.. వారికి ఉచితంగా డయాలసిస్ చేస్తున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు. డయాలసిస్ పేషెంట్లకు సెషన్ల సంఖ్యను గణనీయంగా పెంచామని.. గతంలో నెలకు 40 వేల సెషన్లు జరిగితే, మా ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు 66 వేల సెషన్లకు పెరిగాయన్నారు. ఒక్కో డయాలసిస్ పేషెంట్ కోసం సగటున సంవత్సరానికి రూ.86 వేలను మా ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. శాసనమండలిలో టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో కిడ్నీ రోగులు 21,504 మంది ఉచితంగా డయాలసిస్‌ సేవలు పొందుతున్నారని వివరించారు.గత 20 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా సెకండరీ ఆసుపత్రుల్లో కొత్తగా 14 డయాలసిస్‌ కేంద్రాలు ప్రారంభించినట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. మరో 11 కేంద్రాలను కూడా త్వరలో అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రభుత్వం కిడ్నీ రోగులకు పింఛన్ అందిస్తోందని.. అలాగే మందులు కూడా ఉచితంగా అందజేస్తున్నట్తు తెలిపారు. రాష్ట్రంలో మంచినీరు కలుషితం కాకుండా, డయేరియా కేసులు ప్రబలకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. డయేరియాను అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. నీటి కాలుష్యానికి అడ్డుకట్ట వేసేందుకు ఓవర్ హెడ్ ట్యాంకులను ఎప్పటికప్పుడు క్లీన్ చేయిస్తున్నాం. క్లోరినేషన్, బ్లీచింగ్ చేయిస్తున్నాం. మొబైల్ టెస్టింగ్ వ్యాన్స్ ఏర్పాటు చేసి టెస్టులు చేయిస్తున్నాం. జలజీవన్ మిషన్ ద్వారా సురక్షితమైన మంచినీటిని అందించేందుకు చర్యలు చేపట్టాం’ అని మంత్రి తెలిపారు.

మరోవైపు శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ రోగుల కోసం ఏర్పాటు చేస్తున్న తాగునీటి పథకం పూర్తయ్యిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ పథకం కోసం రూ.4,162.95కోట్లు ఖర్చు చేశారన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తరఫున నాదెండ్ల సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో జల్‌జీవన్‌ మిషన్‌ కింద కేంద్రం రాష్ట్రానికి రూ.13,499 కోట్లు కేటాయించింది అన్నారు. అయితే గత ప్రభుత్వం ఈ నిధుల వినియోగించడంలో విఫలమైందన్నారు. కేంద్రం ఇచ్చిన నిధుల్లో కేవలం రూ.2,324 కోట్లు మాత్రమే వినియోగించుకుందన్నారు. కూటమి ప్రభుత్వం కొత్త పనుల కోసం ఏకంగా రూ.26 వేల కోట్లతో ప్రతిపాదనలు కేంద్రానికి పంపినట్లు తెలిపారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి