Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఉదయం లేవడంతోనే కళ్ళు తిరుగుతున్నాయా.. అయితే, మీకు ఈ లోపాలు ఉన్నట్లే!

26 February 2026

ఈ కుర్రాడు ఇండస్ట్రీలో తోపు హీరో.. త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నాడు.. ఎవరో కనిపెట్టారా.?

26 February 2026

Statewide Raids After Rajahmundry Milk Tragedy,రాజమండ్రి కల్తీపాల ఘటన.. అధికారుల తనిఖీలు ముమ్మరం – statewide food safety raids after rajahmundry milk tragedy

26 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»లక్ష మందిలో ఒకరికి.. హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రిలో అరుదైన వ్యాధికి చికిత్స..
తాజా వార్తలు

లక్ష మందిలో ఒకరికి.. హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రిలో అరుదైన వ్యాధికి చికిత్స..

.By .26 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
లక్ష మందిలో ఒకరికి.. హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రిలో అరుదైన వ్యాధికి చికిత్స..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


తెలుగు రాష్ట్రాల వైద్య చరిత్రలో ఇప్పటికే ఎన్నో అత్యాధునిక వైద్య విధానాలను అందుబాటులోకి తెచ్చి ఎంతో మంది ప్రాణాలను కాపాడిన హైదరాబాద్ నగరంలోని వైద్యులు.. ఇప్పుడు వారసత్వంగా వచ్చే అమెగాకార్యోసైటిక్ థ్రోంబోసైటోపెనియా అనే అరుదైన ఎముక మజ్జ వైఫల్యంతో బాధపడుతున్న 10 నెలల వయసున్న చిన్నారి ఎం. ఖాదర్ అర్మాన్ కు అత్యాధునిక హాప్లోయిడెంటికల్ స్టెమ్ సెల్ మార్పిడి చేసి కొత్త జీవితాన్నిచ్చారు.. ఈ అరుదైన వ్యాధికి సోమాజిగూడలోని యశోద హాస్పిటల్స్ చికిత్సను అందించి.. సరికొత్త చరిత్రను లిఖించింది.

వివరాల ప్రకారం.. కర్నూల్ జిల్లా, నందవరం కి చెందిన ముళ్ళ ఖాజా, రేష్మ ల 10 నెలల వయసున్న చిన్నారి నిరంతరం తక్కువ ప్లేట్‌లెట్స్ కౌంట్ నిర్దారణతో మా యశోద హాస్పిటల్స్-సోమాజిగూడకు గత నెల డిసెంబర్ 26, 2025న తీసుకురావడం జరిగింది. ఆసుపత్రిలో చేరినప్పుడు, పిల్లవాడు ఆహారం ఇస్తున్నప్పుడు ఆస్పిరేషన్ ఎపిసోడ్ ‌ను అనుభవించాడు. దీని ఫలితంగా ఆకస్మిక శ్వాసకోశ ఇబ్బంది, హైపోక్సియా, బ్రాడీకార్డియా వచ్చాయి. అతనికి వెంటనే ఇంట్యూబేట్ చేసి నాలుగు రోజుల పాటు పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో యాంత్రిక వెంటిలేషన్ నిర్వహించడం జరిగిందన్నారు. సమగ్ర క్లినికల్, ప్రయోగశాల అంచనా తర్వాత, ఆ బాబుకి పుట్టుకతో వచ్చే అమెగాకార్యోసైటిక్ థ్రోంబోసైటోపెనియా ఉన్నట్లు నిర్ధారణ అయిందని యశోద హాస్పిటల్స్-సోమాజిగూడ, సీనియర్ హేమాటో-ఆంకాలజిస్ట్ & బోన్ మ్యారో ట్రాన్స్‌ ప్లాంట్ స్పెషలిస్ట్, డాక్టర్. అశోక్ కుమార్ పిళ్ళై తెలిపారు.

Hyderabad Yashoda Hospitals

Hyderabad Yashoda Hospitals

ఇది తీవ్రమైన థ్రోంబోసైటోపెనియా, రక్తస్రావం ప్రమాదంతో కూడిన అరుదైన వారసత్వంగా వచ్చే ఎముక మజ్జ వైఫల్య రుగ్మత అని తెలిపారు. ఈ పరిస్థితికి ఏకైక నివారణ చికిత్స అలోజెనిక్ హెమటోపోయిటిక్ స్టెమ్ సెల్ మార్పిడే అని తల్లిదండ్రులైన ముళ్ళ ఖాజా, రేష్మే లకు వివరించడం జరిగింది. వారి ఆమోదంతో స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంట్ ను మొదలు పట్టడం జరిగింది. పూర్తిగా సరిపోలిన దాత అందుబాటులో లేనందున, పిల్లాడి తండ్రిని అంచనా వేసి హాప్లోయిడెంటికల్ స్టెమ్ సెల్ దాతగా ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ 10 నెలల వయసున్న బాబుకి పితృ మూల కణాలను ఉపయోగించి హాప్లోయిడెంటికల్ స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంటేషన్ జనవరి 8, 2026న విజయవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంటేషన్ తరువాత పిల్లవాడికి తగిన క్రిటికల్ కేర్ సపోర్ట్, నిపుణులైన వైద్య బృందం 24 గంటల పర్యవేక్షణతో, పిల్లవాడు స్థిరంగా కోలుకున్నాడు. క్రమంగా ప్లేట్‌లెట్స్ కౌంట్ మెరుగుపడటంతో వెంటిలేటరీ సపోర్ట్ నిలిపివేయబడింది. ఆ పిల్లవాడు వైద్యపరంగా స్థిరంగా ఉన్నాడు అని నిర్దారించుకున్న తరువత హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేయగలిగామని ఈ పరిస్థితి విజయవంతమైన స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఫలితాన్ని సూచిస్తుందని డాక్టర్ పిళ్ళై తెలియజేసారు.

ఈ కేసు అరుదైన పీడియాట్రిక్ హెమటోలాజికల్ రుగ్మతల నిర్వహణలో ముందస్తు రోగ నిర్ధారణ, సకాలంలో అధునాతన మార్పిడి సౌకర్యాల లభ్యత, సమన్వయంతో కూడిన బహుళ విభాగ సంరక్షణ ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుందన్నారు. విజయవంతమైన ఫలితం హెమటాలజీ, ట్రాన్స్‌ప్లాంటేషన్ విభాగాలు, పీడియాట్రిక్స్, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్ విభాగం, నర్సింగ్, హాస్పిటల్ మేనేజ్‌మెంట్ విభాగాల సమిష్టి ప్రయత్నాలను ప్రతిబింబిస్తుంది. ఇటువంటి కేసులు గతంలో ప్రాణాంతకమైన అనేక బాల్య రక్త రుగ్మతలను ఇప్పుడు ఆధునిక వైద్య సంరక్షణతో నయం చేయవచ్చని, ఈ కేసు ఫలితం ముందస్తు రోగ నిర్ధారణ, తగిన చికిత్స పద్దతులు సాధారణ ప్రజలలో అవగాహన పెంచడానికి సహాయపడుతాయని డాక్టర్. ఎస్. ప్రశాంత్ రెడ్డి తెలిపారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

ఉదయం లేవడంతోనే కళ్ళు తిరుగుతున్నాయా.. అయితే, మీకు ఈ లోపాలు ఉన్నట్లే!

26 February 2026

ఈ కుర్రాడు ఇండస్ట్రీలో తోపు హీరో.. త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నాడు.. ఎవరో కనిపెట్టారా.?

26 February 2026

హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ 5 అంశాలు మరవకండి!

26 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

ఉదయం లేవడంతోనే కళ్ళు తిరుగుతున్నాయా.. అయితే, మీకు ఈ లోపాలు ఉన్నట్లే!

26 February 2026

చలికాలం మొదలయ్యిదంటే చాలు తల తిరుగుడు సమస్యతో ఎంతో మంది బాధ పడుతుంటారు. ఉదయం లేవడంతోనే కింద పడిపోతుంటారు. ఇంకొందరికి…

ఈ కుర్రాడు ఇండస్ట్రీలో తోపు హీరో.. త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నాడు.. ఎవరో కనిపెట్టారా.?

26 February 2026

Statewide Raids After Rajahmundry Milk Tragedy,రాజమండ్రి కల్తీపాల ఘటన.. అధికారుల తనిఖీలు ముమ్మరం – statewide food safety raids after rajahmundry milk tragedy

26 February 2026

హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ 5 అంశాలు మరవకండి!

26 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ఉదయం లేవడంతోనే కళ్ళు తిరుగుతున్నాయా.. అయితే, మీకు ఈ లోపాలు ఉన్నట్లే!

26 February 2026

ఈ కుర్రాడు ఇండస్ట్రీలో తోపు హీరో.. త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నాడు.. ఎవరో కనిపెట్టారా.?

26 February 2026

Statewide Raids After Rajahmundry Milk Tragedy,రాజమండ్రి కల్తీపాల ఘటన.. అధికారుల తనిఖీలు ముమ్మరం – statewide food safety raids after rajahmundry milk tragedy

26 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.