Andhra Pradesh High Court On Illegal Constructions Regularization,ఏపీలో అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ.. ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు – andhra pradesh high court key directions on illegal constructions regularization
AP High Court On Illegal Constructions Regularization: ఏపీ ప్రభుత్వం అనధికార, అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు అనుమతించిన సంగతి తెలిసిందే. అయితే పురపాలకశాఖ జారీచేసిన జీవోను రద్దు చేయాలని హైకోర్టులో పిల్ దాఖలైంది. విచారణ చేపట్టిన హైకోర్టు.. అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ కోసం వచ్చిన దరఖాస్తుల్ని ప్రాసెస్ చేయొద్దని ఆదేశించింది. తాము తదుపరి ఉత్తర్వులిచ్చేవరకూ చేయొద్దని తేల్చి చెప్పింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ అధికారుల్ని హైకోర్టు ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్లో అనధికారిక, అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు హైకోర్టులో బ్రేక్లు పడ్డాయి. ఈ క్రమబద్ధీకరణకు సంబంధించిన వచ్చిన దరఖాస్తుల్ని.. తాము ఉత్తర్వులు ఇచ్చేవరకు ప్రాసెస్ చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని మున్సిపల్ శాఖను ఆదేశించింది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్, జస్టిస్ చల్లా గుణరంజన్లతో కూడిన ధర్మాసనం. ఏపీ హైకోర్టు అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణపై ముందుకెళ్లొద్దని చెప్పడంతో ప్రభుత్వం ఆ ప్రక్రియను నిలిపివేయనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనధికారిక,అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించాలని నిర్ణయం తీసుకుంది. ఏపీ పురపాలక చట్టం (మూడో సవరణను), అలాగే గతేడాది నవంబర్ 12న మున్సిపల్శాఖ ఇచ్చిన జీవో 225ను రద్దు చేస్తూ ప్రకాశం జిల్లాకు చెందిన హరికృష్ణ హైకోర్టును ఆశ్రయించారు (పిల్ దాఖలు చేశారు). హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టగా.. పిటిషనర్ తరఫు లాయర్ వాదనలు వినిపించారు. సుప్రీం కోర్టు తీర్పునకు జీవో నంబర్ 225 విరుద్ధంగా ఉందని కోర్టుకు తెలిపారు. గతంలో కూడా పలుసార్లు అనధికారిక, అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించారని కోర్టుకు వివరించారు. అయితే ప్రభుత్వ తరఫు ఏజీపీ కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావలని కోరారు.. అయితే గతేడాది డిసెంబర్ 31న కౌంటర్ వేయమని ఉత్తర్వులిచ్చామని.. అయినా ఎందుకు వేయలేదని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ మేరకు క్రమబద్ధీకరణపై ముందుకెళ్లొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పిల్పై తదుపరి విచారణను ఏప్రిల్ 1కి వాయిదా వేసింది హైకోర్టు.
ఏపీ ప్రభుత్వం ఎంపీడీవోలను బదిలీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో గ్రూప్-1 పరీక్షల్లో ఉద్యోగాలకు ఎంపికైన 24 మంది ఎంపీడీవోలను ట్రాన్స్ఫర్ చేసింది. వీరితో పాటుగా శ్రీకాకుళం జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) కె భారతి సౌజన్యను కూడా బదిలీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ హైకోర్టు 2018 గ్రూప్ నోటిఫికేషన్ గ్రూప్-1 పరీక్షలో ఎంపికైనవారిని ప్రాధాన్య పోస్టుల నుంచి అప్రాధాన్య స్థానాల్లోకి బదిలీ చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే ఈ చర్యలు తీసుకున్నారు.
రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి