Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ముఖం వెలిగిపోవాలా? ఆపిల్‌తో ఈ సింపుల్ టిప్ ట్రై చేయండి.. ఫలితం గ్యారెంటీ!

26 February 2026

Mla Arava Sridhar Victim,పవన్ కళ్యాణ్ న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటా.. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలి మరో వీడియో – janasena railwaykoduru mla arava sridhar victim released one more video to pawan kalyan

26 February 2026

TGSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు భారీ శుభవార్త.. టికెట్ల ఛార్జీలు భారీగా తగ్గింపు.. ఒకేసారి ఎంతంటే..?

26 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra Pradesh High Court On Illegal Constructions Regularization,ఏపీలో అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ.. ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు – andhra pradesh high court key directions on illegal constructions regularization
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh High Court On Illegal Constructions Regularization,ఏపీలో అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ.. ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు – andhra pradesh high court key directions on illegal constructions regularization

.By .26 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra Pradesh High Court On Illegal Constructions Regularization,ఏపీలో అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ.. ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు – andhra pradesh high court key directions on illegal constructions regularization
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


AP High Court On Illegal Constructions Regularization: ఏపీ ప్రభుత్వం అనధికార, అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు అనుమతించిన సంగతి తెలిసిందే. అయితే పురపాలకశాఖ జారీచేసిన జీవోను రద్దు చేయాలని హైకోర్టులో పిల్ దాఖలైంది. విచారణ చేపట్టిన హైకోర్టు.. అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ కోసం వచ్చిన దరఖాస్తుల్ని ప్రాసెస్ చేయొద్దని ఆదేశించింది. తాము తదుపరి ఉత్తర్వులిచ్చేవరకూ చేయొద్దని తేల్చి చెప్పింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ అధికారుల్ని హైకోర్టు ఆదేశించింది.

హైలైట్:

  • ఏపీలో అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ
  • ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ
  • దరఖాస్తుల్ని ప్రాసెస్ చేయొద్దని ఆదేశం
AP High Court
ఏపీ అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణపై హైకోర్టు(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్‌లో అనధికారిక, అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు హైకోర్టులో బ్రేక్‌లు పడ్డాయి. ఈ క్రమబద్ధీకరణకు సంబంధించిన వచ్చిన దరఖాస్తుల్ని.. తాము ఉత్తర్వులు ఇచ్చేవరకు ప్రాసెస్ చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని మున్సిపల్ శాఖను ఆదేశించింది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌లతో కూడిన ధర్మాసనం. ఏపీ హైకోర్టు అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణపై ముందుకెళ్లొద్దని చెప్పడంతో ప్రభుత్వం ఆ ప్రక్రియను నిలిపివేయనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనధికారిక,అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించాలని నిర్ణయం తీసుకుంది. ఏపీ పురపాలక చట్టం (మూడో సవరణను), అలాగే గతేడాది నవంబర్ 12న మున్సిపల్‌శాఖ ఇచ్చిన జీవో 225ను రద్దు చేస్తూ ప్రకాశం జిల్లాకు చెందిన హరికృష్ణ హైకోర్టును ఆశ్రయించారు (పిల్ దాఖలు చేశారు). హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టగా.. పిటిషనర్ తరఫు లాయర్ వాదనలు వినిపించారు. సుప్రీం కోర్టు తీర్పునకు జీవో నంబర్ 225 విరుద్ధంగా ఉందని కోర్టుకు తెలిపారు. గతంలో కూడా పలుసార్లు అనధికారిక, అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించారని కోర్టుకు వివరించారు. అయితే ప్రభుత్వ తరఫు ఏజీపీ కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావలని కోరారు.. అయితే గతేడాది డిసెంబర్ 31న కౌంటర్ వేయమని ఉత్తర్వులిచ్చామని.. అయినా ఎందుకు వేయలేదని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ మేరకు క్రమబద్ధీకరణపై ముందుకెళ్లొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పిల్‌పై తదుపరి విచారణను ఏప్రిల్‌ 1కి వాయిదా వేసింది హైకోర్టు.

ఏపీ ప్రభుత్వం ఎంపీడీవోలను బదిలీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో గ్రూప్‌-1 పరీక్షల్లో ఉద్యోగాలకు ఎంపికైన 24 మంది ఎంపీడీవోలను ట్రాన్స్‌ఫర్ చేసింది. వీరితో పాటుగా శ్రీకాకుళం జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) కె భారతి సౌజన్యను కూడా బదిలీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ హైకోర్టు 2018 గ్రూప్ నోటిఫికేషన్ గ్రూప్-1 పరీక్షలో ఎంపికైనవారిని ప్రాధాన్య పోస్టుల నుంచి అప్రాధాన్య స్థానాల్లోకి బదిలీ చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే ఈ చర్యలు తీసుకున్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి