Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Roshan: లవ్ స్టోరీస్ మీద ఫోకస్ చేస్తున్న యంగ్ హీరో

26 February 2026

2047 టార్గెట్: అగ్రశ్రేణి లాజిస్టిక్ హబ్‌గా తెలంగాణ, వేలాది ఉద్యోగాలకు బంగారు బాట

26 February 2026

IND vs ZIM: ఆ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ, సంజూ జోడీ..

26 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Council Chairman Moshen Raju On Resigned Ycp Mlcs,మా రాజీనామాలను ఆమోదించండి.. మండలి ఛైర్మన్‌కు వైసీపీ ఎమ్మెల్సీల విజ్ఞప్తి – resigned ycp mlcs marri rajashekar balli kalyan chakravarthi attended before council chairman moshen raju
ఆంధ్రప్రదేశ్

Council Chairman Moshen Raju On Resigned Ycp Mlcs,మా రాజీనామాలను ఆమోదించండి.. మండలి ఛైర్మన్‌కు వైసీపీ ఎమ్మెల్సీల విజ్ఞప్తి – resigned ycp mlcs marri rajashekar balli kalyan chakravarthi attended before council chairman moshen raju

.By .26 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Council Chairman Moshen Raju On Resigned Ycp Mlcs,మా రాజీనామాలను ఆమోదించండి.. మండలి ఛైర్మన్‌కు వైసీపీ ఎమ్మెల్సీల విజ్ఞప్తి – resigned ycp mlcs marri rajashekar balli kalyan chakravarthi attended before council chairman moshen raju
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఏపీ శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజుకు రాజీనామా చేసిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలు కీలక విజ్ఞప్తి చేశారు. తమ పదవులకు తాము రాజీనామా చేశామని.. వాటికి ఆమోదం కల్పించాలని కోరారు. వైసీపీ చేసిన పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన మండలి ఛైర్మన్ మోషన్ రాజు ముందు.. ఎమ్మెల్సీలు బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్ హాజరై తమ వాదనలు వినిపించారు.

YCP MLC
మా రాజీనామాలను ఆమోదించండి.. మండలి ఛైర్మన్‌కు వైసీపీ ఎమ్మెల్సీల విజ్ఞప్తి(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఎమ్మెల్సీలు ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే రాజీనామా చేసిన ఇద్దరు ఎమ్మెల్సీలు తాజాగా తమ రాజీనామాలు ఆమోదించాలని శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజును కోరారు. ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, బల్లి కళ్యాణ్ చక్రవర్తిలు ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేశారు. అయితే ఈ ఇద్దరు ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారంటూ.. మండలి ఛైర్మన్‌కు వైసీపీ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ పార్టీ ఫిరాయింపులపై ఛైర్మన్ మోషేన్ రాజు విచారణ చేపట్టారు.

వైసీపీ పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు .. ఇవాళ వేర్వేరుగా బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్‌లతో వేర్వేరుగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారి రాజీనామాలపై మోషేన్ రాజు వివరణ అడిగి తెలుసుకున్నారు. స్వతహాగా రాజీనామా చేశారా లేక ఎవరైనా ఒత్తిడి తీసుకువస్తే.. రాజీనామా చేశారా అని ప్రశ్నించారు. అయితే తమపై ఎవరూ ఒత్తిడి తీసుకురాలేదని స్పష్టం చేశారు. అందుకే తక్షణమే తమ రాజీనామాలకు ఆమోదం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

మరోవైపు.. ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసిన మరో ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ కూడా తన రాజీనామాను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో మొత్తం ఐదుగురు ఎమ్మెల్సీలు రాజీనామాలు చేసిన నేపథ్యంలో.. మరో ఇద్దరు ఎమ్మెల్సీలను కూడా మండలి ఛైర్మన్ మోషేన్ రాజు విచారణ జరపాల్సి ఉంది. అయితే తాను వైసీపీ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి సంవత్సరం అయిందని.. కానీ ఇంకా తన రాజీనామాను ఆమోదించడం లేదని జయమంగళం వెంకట రమణ.. ఇప్పటికే ఛైర్మన్‌ మోషేన్‌ రాజును కోరారు. బుధవారం మండలి ఛైర్మన్ ఎదుట విచారణకు హాజరైన జయమంగళం వెంకటరమణ.. జనసేన పార్టీ కండువా కప్పుకుని రావడం గమనార్హం.

విచారణ తర్వాత అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడిన జయమంగళం వెంకటరమణ.. తన రాజీనామాను ఆమోదించాలని ఇప్పటికే పలుమార్లు కోరినా ఎందుకు ఆమోదం కల్పించడం లేదని మండలి ఛైర్మన్‌ను అడిగినట్లు చెప్పారు. ఇదే విషయంపై తాను గతంలో హైకోర్టును ఆశ్రయించిన విషయాన్ని గుర్తు చేశారు. తాను వైసీపీకి రాజీనామా చేసి.. అధికారికంగా జనసేన పార్టీలో చేరినట్లు తెలిపారు. అందుకే జనసేన కండువాతో విచారణకు హాజరైనట్లు చెప్పారు. ఛైర్మన్ ఎదుట ఇతర పార్టీ కండువా కప్పుకుంటే.. సస్పెండ్‌ చేయవచ్చని.. కానీ తన రాజీనామా విషయంలో మాత్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని తాను ఛైర్మన్‌ను అడిగినట్లు జయమంగళం వెంకటరమణ తెలిపారు.

శివరామచారి తాటికొండ

రచయిత గురించిశివరామచారి తాటికొండశివరామచారి తాటికొండ సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ట్రెండింగ్ టాపిక్స్ సహా వివిధ అంశాలపై ప్రత్యేక కథనాలు రాస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయం, అంతర్జాతీయం, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తాజా వార్తలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు, విశ్లేషణలను శివరామచారి అందిస్తుంటారు. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వార్తలపై ఫ్యాక్ట్‌చెక్‌ వార్తలు రాసిన అనుభవం ఉంది. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ETV సంస్థలో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. లోక్‌సభతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్‌ (EJS) నుంచి జర్నలిజంలో పీజీ డిప్లొమా పూర్తి చేశారు.… ఇంకా చదవండి