Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

నోరూరించే ఆంధ్రా స్పెషల్ గోంగూర మాంసం కూర.. ఇలా వండితే ఒక్క ముక్క కూడా వదలరు

27 February 2026

Bigg Boss Emmanuel: బిగ్ బాస్‌ ఓటమిని తలుచుకొని.. కన్నీళ్లు పెట్టుకున్న ఇమ్మూ

27 February 2026

Vijay-Rashmika Marriage: 9 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పడిన వేళ.. విరోషి పెళ్లి ఆనందభరితం

27 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Guntur Ggh,డాక్టర్ రాతతో పనిలేదు.. నోటి మాట చాలు.. ఆస్పత్రులలో ప్రయోగాత్మకంగా స్పీచ్ టు టెక్ట్స్ విధానం .. – speech to text method pilot project in vijayawada and guntur gghspeech to text method pilot project in vijayawada and guntur ggh
ఆంధ్రప్రదేశ్

Guntur Ggh,డాక్టర్ రాతతో పనిలేదు.. నోటి మాట చాలు.. ఆస్పత్రులలో ప్రయోగాత్మకంగా స్పీచ్ టు టెక్ట్స్ విధానం .. – speech to text method pilot project in vijayawada and guntur gghspeech to text method pilot project in vijayawada and guntur ggh

.By .27 February 2026No Comments1 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Guntur Ggh,డాక్టర్ రాతతో పనిలేదు.. నోటి మాట చాలు.. ఆస్పత్రులలో ప్రయోగాత్మకంగా స్పీచ్ టు టెక్ట్స్ విధానం .. – speech to text method pilot project in vijayawada and guntur gghspeech to text method pilot project in vijayawada and guntur ggh
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఏపీ ప్రభుత్వం వైద్య సేవలలో టెక్నాలజీ వాడకానికి ప్రాధాన్యం ఇస్తోంది. విజయవాడ , గుంటూరు సర్వజన ఆస్పత్రులలో స్పీచ్ టు టెక్ట్స్ విధానం ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. చేతి రాతతో అవసరం లేకుండా ఈ విధానం పరీక్షిస్తున్నారు. గత వారం రోజుల నుంచి ఈ విధానం పరిశీలిస్తున్నారు. సాధ్యాసాధ్యాల పరిశీలన తర్వాత పూర్తిస్థాయిలో అమలు చేయనున్నారు. ఈ విధానం అమల్లోకి వస్తే ఓపీ, రోగుల వివరాలు, డాక్టర్ ప్రిస్ర్కిప్షన్ అన్నీ డిజిటల్ రూపంలోకి మారనున్నాయి.

Guntur GGH
గుంటూరు సర్వజన ఆస్పత్రిలో స్పీచ్ టు టెక్ట్స్ విధానం(ఫోటోలు– Samayam Telugu)
పాలనలో సాంకేతిక వినియోగానికి పెద్దపీట వేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వైద్యసేవల విషయంలోనూ టెక్నాలజీ వాడకానికి ప్రాధాన్యం ఇస్తోంది. టెక్నాలజీ సహాయంతో రోగులకు మరింత వేగంగా, నాణ్యమైన వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా గుంటూరు సర్వజన ఆస్పత్రిలో స్పీచ్ టు టెక్ట్స్ విధానం ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. గుంటూరు, విజయవాడ సర్వజన ఆస్పత్రులలో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. స్పీచ్ టు టెక్ట్స్ విధానంలో రోగుల వివరాలు, డాక్టర్ రాసే ప్రిస్క్రిప్షన్, పరీక్షల వివరాలు, నిర్ధారణ పరీక్షలు ఇలా మొత్తం.. రాతపూర్వకంగా కాకుండా డిజిటల్ విధానంలో ఉండనున్నాయి.

సాధారణంగా రోగి చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చినప్పుడు రోగి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు తెలుసుకుంటారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలతో పాటుగా వాటి ఫలితాల ఆధారంగా కొన్ని మందులను డాక్టర్లు సిఫార్సు చేస్తారు. అయితే ఇప్పటి వరకూ ఈ వివరాలన్నీ రాతపద్ధతిలో ఉండేవి. రికార్డులు కూడా ఉండేవి కావు. అలాగే ఏ డాక్టర్ వద్దకు ఎంతమంది రోగులొచ్చారనేదీ ఓపీ చీటీల ఆధారంగానే తెలుసుకోవాల్సి వచ్చేది. అయితే స్పీచ్ టు టెక్ట్స్ విధానంలో అలా ఉండదు. ఉదాహరణకు రోగిని పరిశీలించిన తర్వాత డాక్టర్ ఎలాంటి ఔషధాలు వాడాలి, ఏయే పరీక్షలు చేయాలి అనే వివరాలను చెప్తే.. డాక్టర్ ముందున్న కంప్యూటర్, లేదా ల్యాప్ టాప్ వంటి ఎలక్ట్రానిక్ పరికరంలో స్పీచ్ టు టెక్ట్స్ విధానంలో అదంతా నమోదవుతుంది. ఆ తర్వాత ఆ వివరాలు మొత్తం ఆస్పత్రి డేటాబేస్‌లో నమోదవుతాయి.

గుంటూరు, విజయవాడ సర్వజన ఆస్పత్రులలో గత వారం రోజులుగా స్పీచ్‌ టు టెక్స్ట్‌ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు. గుంటూరు ఆస్పత్రిలో 35కుపైగా విభాగాలున్నాయి. వైద్యుల కొరతతో పాటుగా సమయపాలన పాటించకపోవడం ఇతరత్రా సమస్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి సమస్యలకు పరిష్కార మార్గంగా ఏపీ వైద్యారోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి సౌరభ్‌గౌర్‌ ఈ ఆలోచన చేశారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహించి కొన్ని లోపాలను గుర్తించిన సౌరభ్ గౌర్.. రికార్డుల డిజిటలైజేషన్‌ ప్రక్రియ ప్రారంభించారు. అలాగే ఓపీకి క్యూఆర్‌ కోడ్, వైద్యుల పనితీరుపై హెచ్‌పీఆర్‌ కోడ్‌ కేటాయింపు అమల్లోకి తెచ్చారు. అలాగే స్పీ్చ్ టు టెక్ట్స్ విధానం ప్రారంభించారు.

మరోవైపు స్పీచ్ టు టెక్ట్స్ విధానంలో నమోదు చేసిన తర్వాత.. ఆ వివరాలు సరిగ్గా నమోదయ్యాయో లేదో డాక్టర్ సరిచూసి ఓకే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆస్పత్రి డేటా బేస్‌లోకి వివరాలు చేరుతాయి. ఈ విధానంలో ఫైల్ ఓపీ నుంచి ఫార్మసీ కౌంటర్ వరకూ చెక్ చేసుకునే వీలు ఉంటుంది. ప్రస్తుతం సాధ్యాసాధ్యాలపై అధికారులు విశ్లేషణ చేస్తున్నారు. పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే ఉపయోగకరంగా ఉంటుందని ఆస్పత్రి వర్గాలు చెప్తున్నాయి.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి