Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

పొద్దు పొద్దున్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని పాలు తాగితే శరీరంలో జరిగేది ఇదే..! ఆరోగ్యానికి మంచిదేనా కాదా..?

28 February 2026

PAK vs SL: 12 ఏళ్ల విరాట్ కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన పాక్ ప్లేయర్.. అదేంటంటే?

28 February 2026

Vijay: భార్య దెబ్బతో.. షాక్ లో విజయ్.. మరి రాజకీయ పరిస్థితి ఏంటో

28 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Tirumala Ssd Tokens,శ్రీవారి భక్తులకు గమనిక.. తిరుమలలో ఎస్ఎస్‌డీ టోకెన్ల జారీ రద్దు.. – ttd will not issued slotted sarva darshan tokens on march 1 and 2nd in view of lunar eclipse
ఆంధ్రప్రదేశ్

Tirumala Ssd Tokens,శ్రీవారి భక్తులకు గమనిక.. తిరుమలలో ఎస్ఎస్‌డీ టోకెన్ల జారీ రద్దు.. – ttd will not issued slotted sarva darshan tokens on march 1 and 2nd in view of lunar eclipse

.By .28 February 2026No Comments1 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Tirumala Ssd Tokens,శ్రీవారి భక్తులకు గమనిక.. తిరుమలలో ఎస్ఎస్‌డీ టోకెన్ల జారీ రద్దు.. – ttd will not issued slotted sarva darshan tokens on march 1 and 2nd in view of lunar eclipse
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. మార్చి మూడో తేదీ చంద్రగ్రహణం కారణంగా మార్చి 2, 3 తేదీలలో స్లాటెడ్ సర్వదర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ తేదీలలో దర్శనాల కోసం మార్చి 1, 2వ తేదీలో టోకెన్లు జారీ చేయడం లేదని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. మార్చి నాలుగో తేదీ నుంచి భక్తులకు స్లాటెడ్ సర్వదర్శనం కల్పిస్తామని.. ఇందుకోసం మార్చి మూడో తేదీన ఎస్ఎస్‌డీ టోకెన్లు జారీ చేస్తామని ప్రకటించింది. అలాగే మార్చి 3న వీఐపీ బ్రేక్‌ దర్శనాలు కూడా రద్దుచేసినట్లు తెలిపింది.

హైలైట్:

  • తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక
  • మార్చి 3వ తేదీ చంద్రగ్రహణం
  • మార్చి 1, 2వ తేదీలలో ఎస్ఎస్‌డీ టోకెన్ల జారీ రద్దు
Tirumala
తిరుమలలో ఎస్ఎస్‌డీ టోకెన్ల జారీ రద్దు(ఫోటోలు– Samayam Telugu)
తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. మార్చి మూడో తేదీ చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. ఈ నేపథ్యంలోనే మార్చి 1, 2వ తేదీల్లో స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్ల జారీని టీటీడీ రద్దు చేసింది. మార్చి మూడో తేదీ చంద్రగ్రహణం నేపథ్యంలో మార్చి 2, 3వ తేదీలలో దర్శనాల కోసం తిరుపతిలో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీ చేయరని టీటీడీ ప్రకటించింది. ఆయా రోజులకు సంబంధించిన ఎస్‌ఎస్‌డీ టోకెన్లు ముందురోజ అంటే మార్చి 1, 2వ తేదీల్లో జారీ చేయరని క్లారిటీ ఇచ్చింది. మార్చి నాలుగో తేదీ శ్రీవారి దర్శనాలకు సంబంధించిన SSD టోకెన్లను మార్చి 3వ తేదీ యథావిధిగా జారీ చేస్తామని తెలిపింది. అలాగే చంద్రగ్రహణం నేపథ్యంలో మార్చి మూడో తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. ఈ కారణంతో మార్చి రెండో తేదీన వీఐపీ సిఫార్సు లేఖలను టీటీడీ స్వీకరించదు.

మార్చి 3వ తేదీ చంద్రగ్రహణం.. మూతపడనున్న శ్రీవారి ఆలయం

మార్చి మూడో తేదీ చంద్రగ్రహణం కారణంగా ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు తిరుమల ఆలయాన్ని సుమారు 10.30 గంటలు మూసివేయనున్నారు. చంద్రగ్రహణం మార్చి మూడో తేదీ సాయంత్రం 3 గంటల 20 నిమిషాలకు ప్రారంభం కానుంది. సాయంత్రం 6.47 గంటలకు పూర్తవుతుంది. అయితే గ్రహణ సమయానికి 6 గంటల ముందే ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఉదయం తొమ్మిది గంటలకే తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు మూసివేయనున్నారు.

గ్రహణం విడిచిన తర్వాత సాయంత్రం 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరుస్తారు. అనంతరం శుద్ధి, పుణ్యహవచనం నిర్వహించి.. 8 గంటల 30 నిమిషాల నుంచి భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తారు. చంద్రగ్రహణం కారణంగా మార్చి 3వ‌ తేదీ అష్టదళ పాద పద్మారాధన సేవ, కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేశారు. అలాగే వీఐపీ బ్రేక్ దర్శనాలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి దర్శనాలు, చంటి పిల్లల తల్లిదండ్రులు, వృద్ధులు, దివ్యాంగులకు కల్పించే దర్శనాలను రద్దు చేశారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని టీటీడీ కోరింది. చంద్రగ్రహణం సందర్భంగా తిరుపతి, తిరుచానూరులోని టీటీడీ అన్నప్రసాద వితరణ కేంద్రాలను మూసివేయనున్నారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి