Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

పొద్దు పొద్దున్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని పాలు తాగితే శరీరంలో జరిగేది ఇదే..! ఆరోగ్యానికి మంచిదేనా కాదా..?

28 February 2026

PAK vs SL: 12 ఏళ్ల విరాట్ కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన పాక్ ప్లేయర్.. అదేంటంటే?

28 February 2026

Vijay: భార్య దెబ్బతో.. షాక్ లో విజయ్.. మరి రాజకీయ పరిస్థితి ఏంటో

28 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Chandrababu On Kakinada Blast,కాకినాడ పేలుడు ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు పరిహారం.. – cm chandrababu naidu announces 20 lakh compensation to families of those killed in kakinada blast
ఆంధ్రప్రదేశ్

Chandrababu On Kakinada Blast,కాకినాడ పేలుడు ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు పరిహారం.. – cm chandrababu naidu announces 20 lakh compensation to families of those killed in kakinada blast

.By .28 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Chandrababu On Kakinada Blast,కాకినాడ పేలుడు ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు పరిహారం.. – cm chandrababu naidu announces 20 lakh compensation to families of those killed in kakinada blast
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


కాకినాడ పేలుడు ఘటనపై సీఎం నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో నలుగురు అధికారులను సస్పెండ్ చేశారు. ఆర్డీఓతో పాటుగా.. డీఎస్పీ, డిస్టిక్ లేబర్ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. అలాగే మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రమాద స్థలిని పరిశీలించిన చంద్రబాబు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు.

AP Govt Compensation for Kakinada Blast Victims
కాకినాడ పేలుడు ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు పరిహారం..(ఫోటోలు– Samayam Telugu)
AP Govt Compensation for Kakinada Blast Victims: కాకినాడ పేలుడు ఘటనలో మృతుల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. సీఎం చంద్రబాబు నాయుడు మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు. వేట్లపాలెం ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు నాయుడు.. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడి.. కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నవారిని సీఎం చంద్రబాబు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి.. గాయపడినవారిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. ఈ ఘటనకు బాధ్యులైన నలుగురు అధికారులను సస్పెండ్‌ చేస్తున్నట్లు సీఎం తెలిపారు. ఆర్డీఓ, డీఎస్పీ, డిస్టిక్ లేబర్ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

మరోవైపు గాయపడినవారికి మెరుగైన వైద్య చికిత్స అందిస్తామని, బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. పేలుడు పదార్థాల వద్ద సరైన జాగ్రత్తలు తీసుకోవడంలో వైఫల్యం కనిపిస్తోందన్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకుంటామన్న చంద్రబాబు.. బాధ్యులైనవారి ఆస్తులు జప్తు చేసి బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. అలాగే ప్రభుత్వం నుంచి అనుమతి లేకుండా బాణసంచా తయారు చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.అంతకుముందు సామర్లకోట మండలంలోని వేట్లపాలెంలో ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించారు. ఘటన గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సహాయకచర్యల గురించి ఆరా తీశారు.

వేట్లపాలెం పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన చాలా బాధాకరమని.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్‌లో పోస్టు చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 పరిహారాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. మరోవైపు వేట్లపాలెం ప్రమాద ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి