Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Actress : దూసుకొస్తున్న మిసైళ్లు.. దుబాయ్‌లో చిక్కుకున్న హీరోయిన్.. రక్షించాలని మోదీకి రిక్వెస్ట్

1 March 2026

BR Naidu Response To The Viral Videos,‘డీఫ్ ఫేక్ వీడియోలతో నాపై దుష్ప్రచారం.. సైబర్ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాను’: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు – viral videos are deep fake to defame me ttd chairman br naidu submitted complaint to cyber crime police

1 March 2026

Telangana: డబ్బులు రాలేదు.. కానీ సౌండ్ వచ్చింది.. కొత్త స్కామ్‌తో వ్యాపారులకు కుచ్చుటోపీ.. అసలేం జరిగిందంటే..?

1 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Apsrtc Free Bus Travel For Disabled Men From March,స్త్రీశక్తి బస్సుల్లో వారికి కూడా ఉచిత ప్రయాణం.. చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు జారీ – ap government issues orders providing free travel to the disabled in stree shakti buses
ఆంధ్రప్రదేశ్

Apsrtc Free Bus Travel For Disabled Men From March,స్త్రీశక్తి బస్సుల్లో వారికి కూడా ఉచిత ప్రయాణం.. చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు జారీ – ap government issues orders providing free travel to the disabled in stree shakti buses

.By .1 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Apsrtc Free Bus Travel For Disabled Men From March,స్త్రీశక్తి బస్సుల్లో వారికి కూడా ఉచిత ప్రయాణం.. చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు జారీ – ap government issues orders providing free travel to the disabled in stree shakti buses
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఏపీలోని దివ్యాంగులకు గుడ్‌‌న్యూస్. ఇక ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ‘స్త్రీ శక్తి పథకం’ కింద దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు 50 శాతం రాయితీతో ప్రయాణ సౌకర్యం కల్పిస్తుండగా.. ఇక నుంచి ఉచితంగా ఆయా బస్సుల్లో ప్రయాణం చేయవచ్చు.

హైలైట్:

  • స్త్రీశక్తి బస్సుల్లో వారికి కూడా ఉచిత ప్రయాణం
  • చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు జారీ
  • 11 లక్షల మందికి లబ్ధి
Apsrtc Free Bus Travel
(ఫోటోలు– Samayam Telugu)
ఏపీ ప్రభుత్వం మహిళలకు ‘స్త్రీ శక్తి పథకం’ కింద ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం లేదు. ఇటీవల వారికి కూడా ఫ్రీ జర్నీ సౌకర్యం కల్పించాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేబినెట్ సమావేశంలోనూ ఆమోదం తెలిపారు. తాజాగా.. ఏపీలోని దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత సదుపాయం కల్పిస్తూ ప్రభుత్వం శనివారం (ఫిబ్రవరి 28) అధికారిక ఉత్తర్వులు జారీచేసింది. సిటీ ఆర్డినరీ, పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహిళలకు ప్రస్తుతం స్త్రీశక్తి పథకం కింద ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. వీటిలో దివ్యాంగులకు కూడా తాజాగా ఉచిత ప్రయాణం వర్తింపజేసింది. 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ శాతం వైకల్యం ఉన్న దివ్యాంగులకు బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తిస్తుందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. గతేడాది డిసెంబరు 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. దివ్యాంగుల కోసం ఇంద్రధనస్సు పేరిట ఆరు పథకాలు ప్రకటించారు. అందులో ఉచిత బస్సు ప్రయాణ (మగవారికి సైతం) పథకం కూడా ఉంది. ఈ మేరకు ఫిబ్రవరి 24న కేబినెట్‌ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీచేశారు.

ప్రస్తుతం దివ్యాంగులకు మెట్రో ఎక్స్‌ప్రెస్, అల్ట్రా పల్లెవెలుగు, పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, నాన్‌ స్టాప్, ఇంటర్‌స్టేట్‌, తిరుమల ఘాట్‌లో తిరిగే సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌, అల్ట్రా డీలక్స్‌ బస్సు సర్వీసుల్లోని టికెట్‌ ఛార్జీలో 50 శాతం రాయితీ ఇస్తున్నారు. ఇక విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోని సిటీ ఆర్డినరీ బస్సుల్లో మాత్రం ఉచిత ప్రయాణ సదుపాయం ఉంది. తాజా ప్రభుత్వ ఉత్తర్వు నేపథ్యంలో పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ దివ్యాంగుల ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పిస్తారు. నాన్‌స్టాప్, సప్తగిరి ఎక్స్‌ప్రెస్, అల్ట్రా డీలక్స్, అంతర్‌రాష్ట్ర బస్సు సర్వీసుల్లో ప్రస్తుతం ఉన్నట్లే 50 శాతం రాయితీ కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏపీలో 11 లక్షల మంది దివ్యాంగులు ఉన్నట్లు సంబంధిత శాఖ అధికారులు ఆర్టీసీకి వివరాలు అందజేయగా.. ప్రస్తుతం ఆర్టీసీలో 2 లక్షల మంది దివ్యాంగులు మాత్రమే పాస్‌ వినియోగించుకుంటున్నట్లు తేలింది.

సందీప్ పూల

రచయిత గురించిసందీప్ పూల సందీప్ పూల సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పొలిటికల్ న్యూస్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం సందీప్‌కు ఉంది. ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్ట్‌ల కోసం పని చేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రెండు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. సందీప్ ఈజేఎస్‌ నుంచి మల్టీ మీడియా జర్నలిజం కోర్స్ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, మార్చిలో సందీప్ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి