బతుకు దెరువు కోసం పనికి వెళ్తే బాణా సంచా అమాయకులు సమిథలయ్యారు. తూర్పుగోదావరి జిల్లా వేట్లపాలెంలోని సూర్య శ్రీ ఫైర్ ఫ్యాక్టరీ ఎన్నో కుటుంబాల్లో చీకట్లను నింపింది. ప్రశాంతంగా ఉండే గోదావరి గుండెలపై బాంబుల మోత. ఏం జరిగిందో తెలుసుకునేలోపే సూర్యశ్రీ బాణా సంచా తయారీ కేంద్రంలో కార్మికుల జీవితాలు బుగ్గిపాలయ్యాయి. వేట్లపాలెం ఘటనలో మొత్తం 23 మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
సరిగ్గా మధ్యాహ్నం 2.30కు వేట్లపాలెంలో క్రాకర్ ఫ్యాక్టరీ పేలింది.. భారీ శబ్దాలతో చుట్టు పక్కల గ్రామాలు కూడా ఉలిక్కి పడ్డాయి. మధ్యాహ్నం 2.45 నిమిషాలు.. క్రాకర్ ఫ్యాక్టరీ నుంచి కార్మికుల మృతదేహాలు చెల్లాచెదురయ్యాయి. మధ్యాహ్నం 3 గంటలు.. స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం మూడున్నరకు అంబులెన్స్లు స్పాట్కు వచ్చాయి. గాయపడిపడిన వాళ్లను హాస్పిటల్కు తరలించారు. మధ్యాహ్నం 3గంటల 45 నిమిషాలకు సీఎం చంద్రబాబు ప్రమాదంపై అధికారులను ఆరా తీశారు. పేలుడు ఘటనపై మాజీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
సాయంత్రం 4.00గంటలకు బాణాసంచా ఖార్జానా నుంచి మృతదేహాలను వెలికితీశారు. సాయంత్రం 4గంటల 40 నిమిషాలకు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతో మంత్రి కందుల దుర్గేష్ వేట్లపాలెంలో పేలుడు జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. సాయంత్రం 5గంటలకు చనిపోయిన వారి వివరాలపై క్లారిటీ వచ్చింది. 13 మంది మృతదేహాలను ఐడెంటిఫై చేశారు. సాయంత్రం 6గంటలు.. ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ వేట్లపాలెంలో ప్రమాద స్థలిని సందర్శించారు.
సాయంత్రం 6గంటల పది నిమిషాలు..వేట్లపాలెం ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2లక్షలు, క్షతగాత్రులకు 50వేల ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
సాయంత్రం 6గంటల 30 నిమిషాలకు.. సీఎం చంద్రబాబు వేట్లపాలెంలో ప్రమాద స్థలిని పరిశీలించారు. వేట్లపాలెం ఘటనపై విచారణ జరుపుతామన్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగన్నారు.మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు సీఎం చంద్రబాబు . దోషుల ఆస్తులు జప్తు చేసి జీవితఖైదు పడేలా చేస్తామన్నారు.బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా వుంటుందని భరోసానిచ్చారు సీఎం చంద్రబాబు .
రాత్రి 10 గంటల 45 నిమిషాలకు.. రాజమండ్రి ఏయిర్పోర్టులో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
రాత్రి 11గంటల 40 నిమిషాలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..వేట్లపాలెం చేరుకొని బాధిత కుటుంబాలను పరామర్శించారు. పేలుడు ఘటనకు గల కారణాలపై జిల్లా కలెక్టర్, ఎస్పీలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి పవన్ కల్యాణ్ ధైర్యం చెప్పారు.

