Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Yadadri: యాదాద్రిలో ‘శివసాయి శ్రీనివాస నాట్యాలయం’ కళాకారుల నాట్య నీరాజనం – Telugu News | Yadadri Lakshmi Narasimha Swamy Utsav: Greeshma Students’ Epic Dance Performance video

1 March 2026

భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు విమానాలు రద్దు

1 March 2026

IND vs WI T20 WC Live Score: కోల్‌కతా వెస్టిండీస్ అడ్డా.. సూర్యసేన అడ్డుకునేనా.. మరికొద్దిసేపట్లో టాస్..

1 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Rice Card Status,రేషన్ కార్డుదారులకు బ్యాడ్ న్యూస్.. ఈసారికి ఆ రెండూ లేనట్లే..! – ration card holders not receiving ragi and kandipappu in visakhapatnam and alluri districts
ఆంధ్రప్రదేశ్

Rice Card Status,రేషన్ కార్డుదారులకు బ్యాడ్ న్యూస్.. ఈసారికి ఆ రెండూ లేనట్లే..! – ration card holders not receiving ragi and kandipappu in visakhapatnam and alluri districts

.By .1 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Rice Card Status,రేషన్ కార్డుదారులకు బ్యాడ్ న్యూస్.. ఈసారికి ఆ రెండూ లేనట్లే..! – ration card holders not receiving ragi and kandipappu in visakhapatnam and alluri districts
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఏపీ ప్రభుత్వం ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకూ రేషన్ దుకాణాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ చేపడుతున్న సంగతి తెలిసిందే. మార్చి నెల ప్రారంభం కావటంతో రాష్ట్రవ్యాప్తంగా రేషన్ సరుకుల పంపిణీ మొదలైంది. అయితే విశాఖపట్నం, అల్లూరి జిల్లా రేషన్ కార్డుదారులకు మాత్రం ఈ నెలలో కందిపప్పుతో పాటుగా రాగులు పంపిణీ కూడా జరగడం లేదు. కందిపప్పు పంపిణీ రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోగా.. గత మూడు నెలలుగా పంపిణీ చేసిన రాగులు కూడా విశాఖ, అల్లూరి జిల్లావాసులకు ఈసారికి అందుబాటులో లేకుండా పోయాయి.

Ration-shop-AP
ఏపీలో రేషన్ దుకాణాలు(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు రేషన్ సరుకుల పంపిణీ మొదలైంది. మార్చి ఒకటో తేదీ నుంచి నిత్యావసర సరుకులను రేషన్ దుకాణాల ద్వారా అందిస్తున్నారు. లబ్ధిదారులకు బియ్యంతో పాటుగా అరకిలో పంచదార, కిలో గోధుమపిండి కూడా అందించనున్నారు. కొన్ని చోట్ల జొన్నలు, రాగుల పంపిణీ కూడా జరుగుతోంది. అయితే విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల వంటి చోట్ల రాగుల పంపిణీ జరగడం లేదు. గత మూడు నెలలుగా రేషన్ కార్డుదారులకు రాగులను పంపిణీ చేశారు. అయితే మార్చి నెలలో మాత్రం ఇచ్చే పరిస్థితి లేనట్లు తెలిసింది.

అవసరాలకు తగిన మొత్తంలో రాగులు సరఫరా కాలేదని సమాచారం. ముఖ్యంగా ఒడిశా నుంచి రావాల్సిన రాగులు రాలేదని.. దీంతో విశాఖపట్నం, అల్లూరి జిల్లాలలో రాగుల పంపిణీ జరగనట్లు సమాచారం. మరోవైపు ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకూ ఆదివారాలతో సహా రేషన్ షాపులు.. లబ్ధిదారులకు అందుబాటులో ఉండనున్న సంగతి తెలిసిందే. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకూ, అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ రేషన్ దుకాణాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి.

కందిపప్పు.. ఈసారి లేనట్లేనా..

మరోవైపు ఏపీలో రేషన్ కార్డుదారులకు బియ్యం, పంచదార, గోధుమపిండి, రాగులు, జొన్నలు పంపిణీ చేస్తున్నప్పటికీ.. కందిపప్పు సరఫరా మాత్రం జరగడం లేదు. బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా రాయితీపై కందిపప్పు అందిస్తే మధ్యతరగతి జీవికి కాస్త ఊరటగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అయితే ఏపీలో కందిపప్పు పంపిణీ నిలిచిపోయి సుమారుగా ఏడాది కావొస్తోంది.

బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు నాణ్యత ఆధారంగా ధర రూ.110 నుంచి రూ.120 వరకూ పలుకుతోంది. రేషన్ దుకాణాల్లో కిలో కందిపప్పు. రూ.67లకే అందించేవారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా కందిపప్పు సరఫరా చేయాలని జనం కోరుతున్నారు. అయితే పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన కొత్తల్లో కొన్ని నెలలు పాటు కందిపప్పు సరఫరా చేశారు. ఆ తర్వాత కందిపప్పు పంపిణీ నిలిచిపోయింది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి