యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో శ్రీ శివసాయి శ్రీనివాస నాట్యాలయం వ్యవస్థాపకురాలు, గురువు బలివాడ గ్రీష్మ నేతృత్వంలో కళాకారులు చేసిన ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. గురువు గ్రీష్మతో పాటు ఆమె వద్ద శిక్షణ పొందుతున్న 20 మంది విద్యార్థులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. లక్ష్మీనరసింహ స్వామి వారి వైభవాన్ని చాటి చెప్పే పలు భక్తి గీతాలకు వారు అద్భుతమైన నృత్య రూపకాలను ప్రదర్శించారు. విద్యార్థుల హావభావాలు, లయబద్ధమైన పాదముద్రలు సభికులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ ప్రదర్శనలో అన్నిటికంటే ముఖ్యంగా నరసింహ – హిరణ్యకశిప సంవాదం, సంహార ఘట్టం హైలైట్గా నిలిచింది. పురాణ గాథను కళ్లకు కట్టినట్లుగా ప్రదర్శించిన తీరుకు ప్రేక్షకుల నుండి భారీ స్పందన లభించింది. ఆలయ అధికారులు, భక్తులు కళాకారుల ప్రతిభను ప్రత్యేకంగా ప్రశంసించారు. బ్రహ్మోత్సవాల వేళ క్షేత్రానికి తరలివచ్చిన భక్తులకు ఈ నృత్య ప్రదర్శన ఒక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. ప్రదర్శన అనంతరం ఆలయ కమిటీ సభ్యులు గురువు గ్రీష్మను, విద్యార్థులను ఘనంగా సత్కరించారు. భవిష్యత్తులో మరిన్ని గొప్ప ప్రదర్శనలు ఇవ్వాలని వారు ఆకాంక్షించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు విమానాలు రద్దు
US-Israel Strikes On Iran: అమెరికాకు దిమ్మతిరిగిపోయే రీతిలో దాడులు చేస్తాం
Sonal Chauhan: దుబాయ్లో చిక్కుకున్న నటి సోనాల్ చౌహాన్
US-Israel Strikes On Iran: గ్రహాల ప్రభావం వల్లే ఈ యుద్ధం
కారును కిలోమీటర్ వరకు లాక్కెళ్లిన ట్రక్కు.. కట్ చేస్తే

