New Anganwadi Helpers In Ap,కొత్తగా 5 వేల అంగన్వాడీ సహాయకుల నియామకం.. మంత్రి కీలక ప్రకటన – 5000 new anganwadi helpers to be recruited in andhra pradesh said by minister anitha
ఏపీ ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు శుభవార్త వినిపించింది. రాష్ట్రంలోని ఐదువేల మినీ అంగన్వాడీలను పూర్తిస్థాయి అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేస్తున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. మినీ అంగన్వాడీ కార్యకర్తలకు.. అంగన్వాడీ టీచర్లుగా ప్రమోషన్లు కల్పించి.. పూర్తి స్థాయి వేతనాలు అందిస్తామన్నారు. అలాగే రాష్ట్రంలో కొత్తగా 5,000 అంగన్వాడీ సహాయకులను నియమించనున్నట్లు మంత్రి అనిత వెల్లడించారు. 9 డిమాండ్లను పరిష్కరించామన్న అనిత.. వేతనాల పెంపు విషయాన్ని వీలైనంత త్వరగా అమలు చేస్తామన్నారు.
హైలైట్:
అంగన్వాడీ కార్యకర్తలకు ఏపీ ప్రభుత్వం తీపికబురు
5000 మినీ అంగన్వాడీ కేంద్రాలు మెయిన్ అంగన్వాడీలుగా అప్గ్రేడ్
మినీ కార్యకర్తలకు టీచర్లుగా ప్రమోషన్
5,000 కొత్త అంగన్వాడీ సహాయకుల నియామకం
ఏపీ ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు శుభవార్త(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అంగన్వాడీ కార్యకర్తలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. రాష్ట్రంలో మినీ అంగన్వాడీ కార్యకర్తలకు అంగన్వాడీ టీచర్లుగా ప్రమోషన్లు కల్పించనున్నట్లు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత వివరించారు. రాష్ట్రంలోని ఐదువేల మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేస్తున్నామన్న హోం మంత్రి.. అందులో భాగంగా మినీ అంగన్వాడీ కార్యకర్తలకు.. అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి ఇచ్చి. పూర్తిస్థాయిలో వేతనాలు అందించనున్నట్లు తెలిపారు. ఆలాగే రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 5 వేల అంగన్వాడీ సహాయకుల నియమించనున్నట్లు మంత్రి అనిత వివరించారు. సచివాలయంలో అంగన్వాడీ కార్యకర్తలతో మాట్లాడిన హోం మంత్రి అనిత.. అంగన్వాడీ సిబ్బంది సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అంగన్వాడీ వేతనాలను రెండుసార్లు పెంచిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదని మంత్రి అనిత తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టామని.. అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీటి సౌకర్యాలు, మరుగుదొడ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం రూ. 86.68 లక్షలు విడుదల చేసిన సంగతిని గుర్తు చేశారు. అంగన్వాడీ కార్యకర్తలకు ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు అందేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. రాష్ట్రంలో ఉన్న 58,204 మంది అంగన్వాడీ కార్యకర్తలు , సూపర్వైజర్లు, బ్లాక్ కోఆర్డినేటర్లకు 5జీ స్మార్ట్ ఫోన్లు అందించినట్లు వివరించారు. ఈ ఫోన్ల ద్వారా మరింత వేగంగా సేవలు అందిస్తున్నామని వెల్లడించారు.
అంగన్వాడీల గ్రాట్యుటీ కలను నిజం చేశామని.. గ్రాట్యుటీ చెల్లింపుల కోసం బడ్జెట్లో రూ. 20 కోట్లు కేటాయించినట్లు మంత్రి అనిత తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తల డిమాండ్లలో తొమ్మిదింటిని పరిష్కరించినట్లు తెలిపారు. వేతనాల పెంపు అంశాన్ని కూడా త్వరలోనే అమలు చేస్తామన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్నప్పటికీ.. ఉద్యోగుల సంక్షేమంలో రాజీ పడటం లేదని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అంగన్వాడీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని.. వీలైనంత త్వరగా వేతనాల పెంపు అంశాన్ని కూాడా పరిష్కరించి అమలుచేస్తామని హోం మంత్రి వంగలపూడి అనిత హామీ ఇచ్చారు.
రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి