మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న ‘డ్రాగన్’ చిత్రంపై రోజుకో వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ముఖ్యంగా అక్కినేని యువ హీరో అఖిల్ ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ గెస్ట్ రోల్ చేస్తున్నాడనే వార్త గత కొద్ది రోజులుగా వైరల్ అయ్యింది. అయితే, ఈ క్రేజీ బజ్ పై తాజాగా ఒక స్పష్టత వచ్చింది.చిత్ర యూనిట్ సమాచారం ప్రకారం.. ‘డ్రాగన్’ కథలో అఖిల్ పాత్ర ఏదీ లేదని స్పష్టమైంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తన పూర్తి దృష్టిని ఎన్టీఆర్ పాత్రను ఎలివేట్ చేయడంపైనే పెట్టారు. ఇటీవల జోర్డాన్లో ఒక భారీ యాక్షన్ షెడ్యూల్ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం, త్వరలోనే హైదరాబాద్లో తదుపరి షెడ్యూల్ను ప్రారంభించనుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవి నాటికి పూర్తి చేసి, భారీ స్థాయిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇటు అఖిల కూడా తన ‘లెనిన్’ చిత్రంతో బిజీగా ఉన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
9 ఏళ్ల కిందట రూ.500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు కన్నీరు
బ్రిటీషర్లకు రూ.35 వేల అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా..!
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’
అద్భుతం.. పెన్సిల్ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము.. అంతలోనే..

