Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

మార్చి 17న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. ఎందుకంటే?

5 March 2026

అలాంటి సమస్యలున్నవారికి ఈ బెండకాయ, టమాటా రోటి పచ్చడి బెస్ట్ మెడిసిన్

5 March 2026

ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణంపై భారత్ సంతాపం.. విచారం వ్యక్తం చేసిన విదేశాంగ కార్యదర్శి

5 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Tirumala Devotees Clash,తిరుమల: క్యూలైన్‌లో భక్తుల గొడవ.. సంయమనం పాటించాలని టీటీడీ విజ్ఞప్తి – devotees clash in queue in tirumala and ttd appeals for restraint
ఆంధ్రప్రదేశ్

Tirumala Devotees Clash,తిరుమల: క్యూలైన్‌లో భక్తుల గొడవ.. సంయమనం పాటించాలని టీటీడీ విజ్ఞప్తి – devotees clash in queue in tirumala and ttd appeals for restraint

.By .2 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Tirumala Devotees Clash,తిరుమల: క్యూలైన్‌లో భక్తుల గొడవ.. సంయమనం పాటించాలని టీటీడీ విజ్ఞప్తి – devotees clash in queue in tirumala and ttd appeals for restraint
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


తిరుమల క్యూలైన్‌లో భక్తుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కృష్ణతేజ అతిథి గృహం సమీపంలోన క్యూలైన్‌లో భక్తుల మధ్య కొట్లాట జరిగింది. ఇద్దరు భక్తులు పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనపై టీటీడీ స్పందించింది. భక్తులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేసింది. ఇద్దరు భక్తులు ఘర్షణ పడ్డారని.. టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు జోక్యం చేసుకుని గొడవను సద్దుమణిగేలా చేశారని టీటీడీ పేర్కొంది. భక్తులు ఓపికతో వ్యవహరించి శ్రీవారిని దర్శించుకోవాలని సూచించింది.

Tirupati
తిరుమల క్యూలైన్‌లో భక్తుల గొడవ(ఫోటోలు– Samayam Telugu)
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఈ క్రమంలోనే క్యూలైన్‌లోని భక్తుల మధ్య ఘర్షణ తలెత్తింది. పరస్పరం దాడి చేసుకునేవరకూ వెళ్లింది. కృష్ణతేజ అతిథి గృహం క్యూలైన్‌లో ఇద్దరు భక్తుల మధ్య కొట్లాట జరిగింది. ఓ భక్తుడు కోపంలో బెల్టుతీసి మరొకరిపై దాడి చేయటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే టీటీడీ సిబ్బంది అప్రమత్తమై సర్దిచెప్పటంతో ఈ గొడవ సద్దుమణిగింది. అయితే గొడవకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఘటనపై స్పందించింది. క్యూలైన్లలోని భక్తులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది.

” తిరుమల ఔటర్ రింగ్ రోడ్డులో కృష్ణతేజ అతిథి భవనం సమీపంలో ఉన్న క్యూలైన్లలో ఇద్దరు భక్తులు సోమవారం ఘర్షణ పడ్డారు. అయితే అక్కడే విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బంది, శ్రీవారి సేవకులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఇద్దరి మధ్య ఘర్షణను నిలువరించారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు ఈ విధంగా ఘర్షణకు దిగడం సమంజసం కాదు. ఓర్పు, సహనంతో వ్యవహరిస్తూ తోటి భక్తులతో స్నేహపూర్వకంగా ఉండాలి. క్యూలైన్ నియమాలను తప్పనిసరిగా పాటించి శ్రీవారిని దర్శించుకోవాల్సిందిగా తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తి చేస్తోంది.” అంటూ టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది.

తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలు

మరోవైపు తిరుమల శ్రీవారి ఆలయంలో తెప్పోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఐదు రోజుల పాటు వార్షిక తెప్పోత్సవాలు నిర్వహించారు. సోమవారంతో ఈ ఉత్సవాలు ముగిశాయి. తెప్పోత్సవాలలో భాగంగా చివరి రోజైన సోమవారం శ్రీదేవీ, భూదేవీసమేత మలయప్పస్వామి తెప్పపై విహ‌రించి భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆలయ పుష్కరిణిలో ఏడు చుట్లు విహరించి భక్తులకు కనువిందు చేశారు.

వేదపండితుల వేదపారాయణం, మంగళవాయిద్యాలు‌, అన్నమాచార్య ప్రాజెక్టు క‌ళాకారుల సంకీర్తనల మధ్య శ్రీవారి తెప్పోత్సవం ఘనంగా జరిగింది. ఈ తెప్పోత్సవంలో తిరుమ‌ల‌ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్‌ స్వామి, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో లోక‌నాథం ఇతర అధికారులు పాల్గొన్నారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి