Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

బంపర్ ఆఫర్ కొట్టేసిన బాలీవుడ్ బ్యూటీ.. రామ్ చరణ్ సరసన ఈ అందాల భామ.?

3 March 2026

వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలపై క్లారిటీ!

3 March 2026

Us Iran War: ఇరాన్‌తో యుద్ధంలో అమెరికా ప్రతిరోజూ ఎంత డబ్బు ఖర్చు చేస్తోందో తెలిస్తే షాకవుతారు!

3 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Anantapur News,అనంతపురం: మూడు పోస్టులకు ఒక్కడు.. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో విచిత్ర పరిస్థితి! – three posts for one person in anantapur stamps and registration department
ఆంధ్రప్రదేశ్

Anantapur News,అనంతపురం: మూడు పోస్టులకు ఒక్కడు.. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో విచిత్ర పరిస్థితి! – three posts for one person in anantapur stamps and registration department

.By .3 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Anantapur News,అనంతపురం: మూడు పోస్టులకు ఒక్కడు.. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో విచిత్ర పరిస్థితి! – three posts for one person in anantapur stamps and registration department
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఉమ్మడి అనంతపురం జిల్లాలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో ఒకే వ్యక్తికి మూడు పోస్టులు అప్పగించారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలో రిజిస్ట్రార్ అదనపు బాధ్యతలు మార్కెట్ విలువ రిజిస్ట్రార్‌గా ఉన్న శ్రీనివాసులకు అప్పగించారు. దీంతో ఒకే వ్యక్తి మూడు పోస్టులను నిర్వహించడం సాధ్యమేనా అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం వెంటనే ఆయా జిల్లాలకు రిజిస్ట్రార్లను నియమించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Anantapur
అనంతపురం ఒకే వ్యక్తికి మూడు పోస్టులు(ఫోటోలు– Samayam Telugu)
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఒకే అధికారికి మూడు బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశమైంది. మార్కెట్ విలువల రిజిస్ట్రార్‌గా ఉన్న శ్రీనివాసులు అనే వ్యక్తికి.. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల రిజిస్ట్రార్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఒకే వ్యక్తికి మూడు పోస్టులు అప్పగించినట్లైంది. ఫలితంగా పనులు ఎక్కడివి అక్కడే ఆగిపోతున్నాయనే విమర్శలు వస్తున్నాయి.

అసలు ఎందుకీ పరిస్థితి..

2018 గ్రూప్ 1లో ఎంపికైన అధికారులను ముఖ్యమైన పోస్టుల నుంచి తప్పించాలని ఏపీ హైకోర్టు ఇటీవల ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీ ప్రభుత్వం పలువురు అధికారులను బదిలీ చేసింది. మరికొందరిని ఇతర కార్యాలయాలకు అటాచ్ చేశారు. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లా రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న భార్గవ్‌ను.. విజయవాడలోని ఐజీ ఆఫీసుకు అటాచ్ చేశారు. అలాగే అనారోగ్య కారణాలతో శ్రీసత్యసాయి జిల్లా రిజిస్ట్రార్‌ కృష్ణకుమారి దీర్ఘకాలిక సెలవులో ఉన్నారు. దీంతో అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల రిజిస్ట్రార్‌ పోస్టులకు ప్రభుత్వం అధికారులను నియమించలేదు. ఈ బాధ్యతలను మార్కెట్ విలువల రిజిస్ట్రార్ శ్రీనివాసులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో రెగ్యులర్‌ రిజిస్ట్రార్లు లేక.. అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలలో కలిపి 21 సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. రెగ్యులర్ రిజిస్ట్రార్లు లేకపోవటంతో ఈ కార్యాలయాలలోని పాలనపరమైన ఇబ్బందులు, ఫిర్యాదులకు సంబంధించి ఒక్కరే అధికారి పనులు చక్కబెట్టాలంటే సాధ్యమేనా అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి . ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు వెంటనే స్పందించి అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు రెగ్యులర్‌ రిజిస్ట్రార్లను నియమించాలని స్థానికులు కోరుతున్నారు.

మరోవైపు 2018 గ్రూప్ -1 నియామక ప్రక్రియలో లోపాలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటిపై విచారణ పూర్తయ్యే వరకూ.. 2018 గ్రూప్ 1లో ఎంపికైన అధికారులను అప్రాధాన్య పోస్టుల్లోనే ఉంచాలని ఏపీ హైకోర్టు ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో కీలక పోస్టుల్లోని అధికారులను బదిలీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల 26 మంది ఆర్డీవోలను ఏపీ ప్రభుత్వం ఒకేసారి బదిలీ చేసింది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి