Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Andhra Pradesh: ఏపీకి రైల్వేశాఖ సూపర్ న్యూస్.. ఈ ప్రాంతాలకు కూడా రైల్వే కనెక్టివిటీ.. ఆరు కొత్త లైన్లకు లైన్ క్లియర్..

4 March 2026

Hyderabad To Srisailam New Railway Line,ఏపీకి కొత్త రైలు ప్రాజెక్టులు.. విజయవాడ టు విశాఖ గంటలో వెళ్లొచ్చు, హైదరాబాద్ టు శ్రీశైలం కొత్త రైలు మార్గం – railways focus on vijayawada to visakhapatnam high speed railway corridor hyderabad to srisailam railway line and other projects

4 March 2026

ఆడవాళ్ళు మంగళసూత్రం బంగారం కాకుండా వెండి కూడా పెట్టుకోవచ్చా.. పండితులు చెప్పేది ఇదే!

4 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»AP High Court Grants Anticipatory Bail To Harsha Veena,జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వీడియోల ఎపిసోడ్.. మహిళకు ఊరట, హైకోర్టులో బెయిల్ – ap high court granted conditional anticipatory bail to woman in railway kodur janasena party mla arava sridhar issue
ఆంధ్రప్రదేశ్

AP High Court Grants Anticipatory Bail To Harsha Veena,జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వీడియోల ఎపిసోడ్.. మహిళకు ఊరట, హైకోర్టులో బెయిల్ – ap high court granted conditional anticipatory bail to woman in railway kodur janasena party mla arava sridhar issue

.By .4 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
AP High Court Grants Anticipatory Bail To Harsha Veena,జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వీడియోల ఎపిసోడ్.. మహిళకు ఊరట, హైకోర్టులో బెయిల్ – ap high court granted conditional anticipatory bail to woman in railway kodur janasena party mla arava sridhar issue
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


AP High Court Anticipatory Bail To Janasena Party Mla Arava Sridhar Episode Woman: రైల్వేకోడూరు జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ ఎపిసోడ్‌లో ఆరోపణలు చేసిన మహిళకు హైకోర్టులో ఊరట దక్కింది. ఎమ్మెల్యేను బెదిరించారని తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో నమోదైన కేసులో ఏపీ హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిలు మంజూరు చేసింది. బెయిల్ షరతుల్ని పాటించాలని.. ఒకవేళ పాటించకపోతే బెయిల్ రద్దుకు పోలీసులు కోర్టును ఆశ్రయించొచ్చని తెలిపింది.

హైలైట్:

  • రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎపిసోడ్
  • మహిళకు ఏపీ హైకోర్టులో షరతులతో బెయిల్
  • ఎమ్మెల్యే తల్లి ఫిర్యాదుతో మహిళపై కేసు
AP High Court
జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసు(ఫోటోలు– Samayam Telugu)
తిరుపతి జిల్లా రైల్వేకోడూరు జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ‌‌పై ఆరోపణలు చేసిన మహిళకు హైకోర్టులో ఊరట దక్కింది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మహిళపై తల్లి చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో ఆమెకు హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల విచారణకు అందుబాటులో ఉండాలని.. సాక్షుల్ని బెదిరించడం, ప్రభావితం చేయకూడదని కోర్టు షరతుల్లో పేర్కొంది. కోర్టు అనుమతి తీసుకోకుండా జిల్లా దాటి వెళ్లకూడదని.. పాస్‌పోర్టు కోర్టులో అప్పగించాలని ఆదేశించింది.. పాస్‌పోర్టు లేకపోతే అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించింది. ఒక వారంలో మెజిస్ట్రేట్ ముందు హాజరై రూ.20 వేలతో రెండు పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. పోలీసులు ఈ కేసులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసేవరకు సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో ముందు ప్రతి శనివారం హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. పాస్‌పోర్ట్‌ను కోర్టులో అప్పగించాలి. పాస్‌పోర్ట్‌ లేకుంటే ఆమేరకు అఫిడవిట్‌ వేయాలని సూచించింది. ఒకవేళ ఆమె షరతుల్ని ఉల్లంఘిస్తే పోలీసులు బెయిల్ రద్దుకు చర్యలు తీసుకోవచ్చని తెలిపింది.

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తల్లి ఆరోపణలు చేసిన మహిళపై పోలీసులకు ఫిర్యాదుచేశారు. మహిళ తన కుమారుడు, కుటుంబసభ్యులతో పరిచయం పెంచుకున్నారన్నారు. ఏకంగా రూ.25 కోట్లు డిమాండ్ చేసిందని.. ఆమె తన కుమారుడ్ని బెదిరించారని, కుట్ర చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ డబ్బులు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తానని బెదిరించినట్లు ఆరోపించారు. ఈ మేరకు రైల్వే కోడూరు పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు షరతులతో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

జనసేన పార్టీ రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై ఓ మహిళ లైంగిక దాడి, మోసం చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఆమె అరవ శ్రీధర్‌తో ప్రైవేట్‌గా మాట్లాడినట్లుగా కొన్ని వీడియోలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తనకు న్యాయం చేయాలంటూ ఆమె ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు జనసే పార్టీ ఈ ఆరోపణలపై విచారణ చేసేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ శ్రీధర్‌ను ప్రశ్నించింది. బాధితురాలు చేసిన ఆరోపణలు, వాట్సాప్‌ చాటింగ్‌ వ్యవహారంపై ఆరా తీశారు. తనపై వచ్చిన ఆరోపణలకు జనసేన పార్టీ ఏర్పాటు చేసిన కమిటీకి వివరణ ఇచ్చానన్నారు ఎమ్మెల్యే అరవ శ్రీధర్. తమ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా సరే కట్టుబడి ఉంటానని.. అలాగే తనపై నమోదైన కేసులను చట్టపరంగానే ఎందుర్కొంటానని శ్రీధర్ చెబుతున్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి