Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Tollywood : జూమ్ చేసి మరీ మా శరీరాలను ఫోటోస్ తీయొద్దు.. కన్నడ హీరోయిన్స్ ఆగ్రహం..

4 March 2026

Petrol: ఇరాన్‌లో లీటర్ పెట్రోల్ ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు.. అస్సలు ఊహించలేరు..

4 March 2026

ఏంట్రా ఇలా ఉన్నారు.. భార్యభర్తలు ఇద్దరూ కలిసి గుట్టుగా ఏం చేశారో తెలుసా..?

4 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Chittoor Five Killed In Road Accident,చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి – five killed in road accident near palamaner chittoor district
ఆంధ్రప్రదేశ్

Chittoor Five Killed In Road Accident,చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి – five killed in road accident near palamaner chittoor district

.By .4 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Chittoor Five Killed In Road Accident,చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి – five killed in road accident near palamaner chittoor district
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Five Killed In Road Accident Near Chittoor District: చిత్తూరు జిల్లా పలమనేరు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేలో వెళుతున్న ఓ కారు లారీ కిందుకు దూసుకెళ్లడంతో ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. చనిపోయినవారిని కర్ణాటకకు చెందిన వారిగా గుర్తించారు. ఓవర్ స్పీడ్‌ కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. చనిపోయినవారిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు.

హైలైట్:

  • చిత్తూరు జిల్లా పలమనేరు దగ్గర ఘోర రోడ్డుప్రమాదం
  • పలమనేరు దగ్గర లారీ కిందకు దూసుకెళ్లిన కారు
  • ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు
Palamaner Accident Five Killed
చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం(ఫోటోలు– Samayam Telugu)
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలమనేరు సమీపంలో జాతీయ రహదారిపై లారీ కిందకు కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురి ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. బెంగళూరు నుంచి తిరుపతి వైపు వెళుతున్న లారీ కిందకు కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.. కారులోని మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతులు కర్ణాటకకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ప్రాథమిక సమాచారం మేరకు కారు ఓవర్ స్పీడ్‌లో ఉందని.. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్ల లారీ కిందకు దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తిరుపతి జిల్లాలో యువకుడు మృతి

తిరుపతి జిల్లాలో ఓ యువకుడు అతిగా మద్యం తాగా కాలువలో పడి చనిపోయాడు. యువకుడి మృతదేహాన్ని గుర్తించిన పారిశుద్ధ్య కార్మికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆటో డ్రైవర్ దివాకర్ స్నేహితులతో కలిసి సోమవారం రాత్రి మద్యం సేవించాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లి మళ్లీ మద్యం కొనడానికి డబ్బులు కావాలని భార్యతో గొడవపడ్డాడు. కొద్దిసేపటి తర్వాత అక్కడి నుంచి లిక్కర్ షాపునకు వెళ్లి మద్యం కొనుగోలు చేశాడు. అయితే మురుగుకాలువ దగ్గర పడి చనిపోయాడు. మంగళవారం రోజు పారిశుద్ధ్య కార్మికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు యువకుడి మృతదేహాన్ని రుయా ఆస్పత్రికి తరలించారు. అయితే చనిపోయిన యువకుడు షర్ట్ లేకుండా ఉండటంపై అనుమానాలువ్యక్తమయ్యాయి. భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.. ఘటనా స్థలానికి సమీపంలో సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో వృద్ధుడు చెరువులో పడి చనిపోయాడు. స్థానికంగా ఆవుల మేపుతూ జీవనం సాగిస్తున్న గంగాధరం చిత్తూరు రూరల్ మండలం బండపల్లిలో చెరువు దగ్గర సాయంత్రం కూర్చున్నాడు. ప్రమాదవశాత్తు జారిపడి నీటమునిగి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి