Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Virosh: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రిసెప్షన్.. హాజరవుతున్న అతిథులు

4 March 2026

భోజనం చేసిన కాసేపటికే మళ్లీ ఆకలిగా అనిపిస్తుందా? ఇది ఈ వ్యాధికి సంకేతం..

4 March 2026

Tollywood: హోలీ సెలబ్రేషన్స్‌లో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా? హ్యాట్రిక్ హిట్స్ కొట్టింది

4 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Kanaka Durga Temple Kumbha Abhisekham,12 ఏళ్ల తర్వాత దుర్గ గుడిలో కుంభాభిషేకం.. భక్తులకు అధికారుల కీలక విజ్ఞప్తి.. – kumbha abhishekam from 6th march 2026 at vijayawada kanaka durga temple
ఆంధ్రప్రదేశ్

Kanaka Durga Temple Kumbha Abhisekham,12 ఏళ్ల తర్వాత దుర్గ గుడిలో కుంభాభిషేకం.. భక్తులకు అధికారుల కీలక విజ్ఞప్తి.. – kumbha abhishekam from 6th march 2026 at vijayawada kanaka durga temple

.By .4 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Kanaka Durga Temple Kumbha Abhisekham,12 ఏళ్ల తర్వాత దుర్గ గుడిలో కుంభాభిషేకం.. భక్తులకు అధికారుల కీలక విజ్ఞప్తి.. – kumbha abhishekam from 6th march 2026 at vijayawada kanaka durga temple
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


విజయవాడ దుర్గగుడిలో కుంభాభిషేకానికి సర్వం సిద్ధమైంది. మరో రెండు రోజులలో కుంభాభిషేకం మొదలు కానుంది. మార్చి ఆరో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకూ మూడు రోజుల పాటు కుంభాభిషేకం క్రతువు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో భక్తులకు దుర్గగుడి అధికారులు కీలక విజ్ఞప్తి చేశారు. కుంభాభిషేకం సందర్భంగా యాగశాలలోకి భక్తులకు అనుమతి లేదని క్లారిటీ ఇచ్చారు. అయితే ఆలయానికి వచ్చి దర్శనాలు చేసుకోవచ్చని సూచించారు.

హైలైట్:

  • విజయవాడ దుర్గగుడిలో కుంభాభిషేకం
  • మార్చి 6వ తేదీ నుంచి ప్రారంభం
  • మూడు రోజుల పాటు కొనసాగనున్న కుంభాభిషేకం
kanaka durga temple kumbha abhisekham
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో కుంభాభిషేకం(ఫోటోలు– Samayam Telugu)
విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో కుంభాభిషేకం కార్యక్రమానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. దుర్గగుడిలో 12 సంవత్సరాలకు ఒకసారి కుంభాభిషేకం నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే మార్చి ఆరో తేదీ నుంచి దుర్గగుడిలో కుంభాభిషేకం కార్యక్రమం ప్రారంభం కానుంది. మొత్తం మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. మార్చి 6, 7, 8 తేదీల్లో కుంభాభిషేకం కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఆలయ విమాన గోపురాలకు సంప్రోక్షణ నిర్వహిస్తారు. వేద మంత్రాలతో ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. కంచికామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. మరోవైపు 2012 సంవత్సరంలో విజయవాడ దుర్గగుడిలో కుంభాభిషేకం జరిగింది. అయితే ప్రధాన రాజగోపురం ప్రతిష్ట సందర్భంగా రెండేళ్లలోపే.. అంటే 2014లో మళ్లీ కుంభాభిషేకం నిర్వహించారు. 12 ఏళ్లు పూర్తైన నేపథ్యంలో ఇప్పుడు మరోసారి కుంభాభిషేకం నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై ఉన్న విగ్రహాలు, గోపురాలకు పునరుజ్జీవనం కల్పించడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. ఇందులో భాగంగా పవిత్ర నదులు, సముద్రాల నుంచి జలాలను సేకరించి ఆలయంలోని యాగశాలలో మూడురోజుల పాటు పూజలు నిర్వహిస్తారు. ఆ తరువాత ఆ జలంతో గోపురాలు, కలశాలకు అభిషేకం నిర్వహిస్తారు.

కుంభాభిషేకం.. ఏ రోజున ఏం చేస్తారంటే..

మార్చి ఆరో తేదీన యాగశాలలో ఉదయం ఎనిమిది గంటలకు గణపతి పూజ నిర్వహిస్తారు. తర్వాత పుణ్యాహవచనం, దీక్షాధారణ, పంచగవ్వ ప్రాశనం, అఖండ దీపారాధన వంటి కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం అంకురార్పణ, అగ్ని ప్రతిష్ఠాపన కార్యక్రమాలతో పాటుగా.. మూలమంత్ర హవనములు, హారతి ఉంటుంది. రాత్రి 7 మంత్ర పుష్పం కార్యక్రమం ఉంటుంది.

మార్చి ఎనిమిదో తేదీ ఉదయం 8 గంటలకు అష్టోత్తర కలశస్థాపన, పూజ, పీఠ పూజలు ఉంటాయి. మధ్యాహ్నం 12గంటలకు మూలమంత్ర హవనములు కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం ప్రదోషకాల పీఠపూజలు, హారతితో పాటుగా 7 గంటలకు మంత్ర పుష్పం ఉంటుంది. ఆఖరి రోజైన మార్చి ఎనిమిదో తేదీ ఉదయం మంటప పూజలు, మూలమంత్ర హవనములు, పూర్ణాహుతి కార్యక్రమాలు ఉంటాయి ఉదయం 9.34 నిమిషాలకు అమ్మవారి ప్రధాన ఆలయ ప్రాంగణంలో కుంభాభిషేకం నిర్వహిస్తారు. మరోవైపు కుంభాభిషేకం కార్యక్రమానికి భక్తులకు అనుమతి లేదని ఆలయ అధికారులు వెల్లడించారు. ఇది అంతర్గత కార్యక్రమమని.. యాగశాలలోకి భక్తులను అనుమతించమని క్లారిటీ ఇచ్చారు. అయితే దర్శనాలకు ఎలాంటి ఇబ్బందులు లేవని వెల్లడించారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి