Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

T20 World Cup Final : టీమిండియాకు ఫైనల్ టెన్షన్..నంబర్ వన్ ప్లేయర్ల ఫామ్ పై కోచ్ గంభీర్ తల బాదుకుంటున్నాడా?

7 March 2026

Weekly Horoscope: వారికి ఆకస్మిక ధన లాభానికి ఛాన్స్.. 12 రాశుల వారికి వారఫలాలు

7 March 2026

Indian Railways: రైలు ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్‌.. ఈ నెలలో ఈ మార్గాల్లో రైళ్లన్ని రద్దు..!

7 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Tiger In Polavaram,పోలవరం: ఆవు,దూడను చంపేసిన పెద్దపులి.. భయంభయంగా జనం.. – tiger killed a cow and a calf in addateegala mandal of polavaram district andhra pradesh
ఆంధ్రప్రదేశ్

Tiger In Polavaram,పోలవరం: ఆవు,దూడను చంపేసిన పెద్దపులి.. భయంభయంగా జనం.. – tiger killed a cow and a calf in addateegala mandal of polavaram district andhra pradesh

.By .7 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Tiger In Polavaram,పోలవరం: ఆవు,దూడను చంపేసిన పెద్దపులి.. భయంభయంగా జనం.. – tiger killed a cow and a calf in addateegala mandal of polavaram district andhra pradesh
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


పోలవరం జిల్లాలోని ఏలేరు రిజర్వాయర్ పరిసర ప్రాంతాలలో పెద్దపులి సంచారం భయపెడుతోంది. తాజాగా అడ్డతీగల మండలంలోని కృష్ణవరంలో ఆవులపై పెద్దపులి దాడి చేయడం మరింత ఆందోళనకు కారణమవుతోంది. ఆవులపై దాడి చేసిన పులి.. ఓ అవును, దూడను చంపేసింది. దీంతో స్థానికులు భయపడిపోతున్నారు. మరోవైపు పెద్దపులిని బంధించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి బోన్లను తీసుకువస్తున్నారు. అయితే భౌగోలిక ప్రతిస్థితులు అధికారులకు ప్రతికూలంగా మారాయి.

Tiger at polavaram
పోలవరం జిల్లాలో పెద్దపులి సంచారం(ఫోటోలు– Samayam Telugu)
పోలవరం జిల్లాలో పెద్దపులి సంచారం భయపెడుతోంది. దీంతో గ్రామస్థులు బిక్కుబిక్కుమంటూ భయాందోళనతో బతుకుతున్నారు. పోలవరం జిల్లాలోని అడ్డతీగల మండలంలో ఉన్న కృష్ణవరం గ్రామంలో ఆవులపై పెద్దపులి దాడి చేసింది. గంగవరం మండలం ట్యాంకుబీడు ప్రాంతం నుంచి పెద్దపులి శుక్రవారం అర్ధరాత్రి కృష్ణవరం చేరుకున్నట్లు తెలిసింది. కృష్ణవరంలో ఆవులపై దాడి చేసి ఓ ఆవు, దూడను చంపేసింది. దీంతో ఈ ప్రాంతవాసులు మరింత భయపడిపోతున్నారు. ఇటీవలే ఓ ఆవుపై పెద్దపులి దాడి చేసింది. ఈ ఘటన మరువకముందే మరోసారి ఆవులపై దాడి చేయడం కలవరం రేపుతోంది. మరోవైపు ఈ ఘటనతో ట్యాంకుబీడు గ్రామం నుంచి అటవీ శాఖ అధికారులు బోనులను తరలిస్తున్నారు.

మరోవైపు ఏలేరు జలాశయం పరివాహక ప్రాంతంలోనే పెద్దపులి తిరుగుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కాకినాడ, పోలవరం జిల్లా సరిహద్దులలో పులి అడుగుజాడలను గుర్తించటం ఇందుకు బలం చేకూరుస్తోంది. అడ్డతీగల మండలంలోని గొట్టువానిపాలెం గ్రామంతో పాటుగా.. ఏలేశ్వరం మండలంలోని మర్రివీడు ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అడ్డతీగల, రాజవొమ్మంగి, ఏలేశ్వరం మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శుక్రవారం సూచించారు. అయితే శుక్రవారం రాత్రి అడ్డతీగల మండలంలోని కృష్ణవరంలో ఆవులపై పెద్దపులి దాడి చేయటంతో ఆందోళన అధికమైంది.

మరోవైపు పెద్దపులిని బంధించేందుకు అధికారులు అన్నిరకాలుగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ప్రాంత పరిస్థితులు అందుకు సహకరించడం లేదు. భౌగోళిక ప్రతికూలతల కారణంగా పులి బంధించటం కష్టంగా మారుతోంది. పెద్దపులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు బోన్లు ఏర్పాటు చేశారు. అయితే పెద్దపులి బోను దరిదాపుల్లోకి కూడా రావటం లేదు. ఈ నేపథ్యంలో గ్రామాల ప్రజలను అటవీశాఖ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.

పెద్దపులి సంచారంపై హెచ్చరిస్తూ గ్రామాల్లో దండోరా వేయించటంతో పాటుగా ఆలయాల మైక్ సెట్ల ద్వారా జాగ్రత్తలు చెప్తున్నారు. రాత్రివేళ బయటకు రావొద్దంటూ సూచిస్తున్నారు. మరోవైపు వీలైనంత త్వరగా పెద్దపులిని బంధించి.. సురక్షిత ప్రాంతానికి తరలించాలని స్థానికులు కోరుతున్నారు. నిత్యం భయంభయంగా గడపలేకపోతున్నామని.. అధికారులు వెంటనే పులిని బంధించాలని కోరుతున్నారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి