Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

మీ రాశికి ఈ రంగులు సరిపోవు.. వేసుకున్నారంటే అదృష్టం తిరగబడుద్ది..!

7 March 2026

T20 World Cup Final : రేపే భారత్-కివీస్ తుది పోరు.. ఫ్రీగా లైవ్ చూడటం ఎలాగో తెలుసా?

7 March 2026

దుమ్ము లేపిన బొబ్బిలి యువకులు.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగేసి..

7 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra Pradesh Weather,ఈ ఏడాది మండిపోనున్న సూర్యుడు.. ఆ నెలలో చుక్కలే.. ఉష్ణోగ్రతలు హాఫ్ సెంచరీ కొట్టే అవకాశం! – ecmwf weather forecast el nino forming by may, potentially becoming strong by august 2026
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh Weather,ఈ ఏడాది మండిపోనున్న సూర్యుడు.. ఆ నెలలో చుక్కలే.. ఉష్ణోగ్రతలు హాఫ్ సెంచరీ కొట్టే అవకాశం! – ecmwf weather forecast el nino forming by may, potentially becoming strong by august 2026

.By .7 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra Pradesh Weather,ఈ ఏడాది మండిపోనున్న సూర్యుడు.. ఆ నెలలో చుక్కలే.. ఉష్ణోగ్రతలు హాఫ్ సెంచరీ కొట్టే అవకాశం! – ecmwf weather forecast el nino forming by may, potentially becoming strong by august 2026
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


మార్చి నెల ప్రారంభంలోనే నడినెత్తిన సూరీడు సుర్రుమనిపిస్తున్నాడు. పగటి పూట ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఈసారి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ సంస్థ హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలోనే జూన్ నెలలో వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని తెలుస్తోంది. మే నెలలో ఎల్‍నినో ఏర్పడేందుకు అవకాశాలు ఉన్నట్లు ECMWF అంచనా వేసింది. ఆగస్ట్ నాటికి బలపడే అవకాశం ఉందని తెలిపింది.

weather ecmwf
ఈ ఏడాది మండిపోనున్న సూర్యుడు(ఫోటోలు– Samayam Telugu)
తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముఖ్య గమనిక. ఈ ఏడాది సూర్యుడి ప్రతాపం తీవ్రంగా ఉండనుంది. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు కానున్నాయి. అలాగే వేడిగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. వర్షాలు కురిసే అవకాశం తక్కువగా ఉంటుందని.. ఇదే సమయంలో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తన్నాయి. జూన్ నెలలో కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాలలో పగటి పూట ఉష్ణోగ్రతలు ఏకంగా 48 నుంచి 49 డిగ్రీల వరకూ నమోదయ్యే అవకాశం ఉండొచ్చని చెప్తున్నాయి. జూన్‌లో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని.. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నాయి.

మరోవైపు భానుడి ప్రతాపం ఇప్పటికే మొదలైపోయింది. దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. దీంతో భారత వాతావరణ విభాగం ఇప్పటికే పలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే మూడు రోజులు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య బయటకు వెళ్లొద్దని సూచించింది. వృద్ధులు, పిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలని.. డీహైడ్రేషన్ బారిన పడకుండా ద్రవపదార్థాలు తీసుకుంటూ ఉండాలని సూచించింది.

మరోవైపు మే నెలలో ఎల్‌నినో ఏర్పడుతుందని.. ఆగస్ట్ నాటికి బలపడుతుందని ECMWF ( European Centre for Medium Range Weather Forecasts) అంచనా వేసింది. ఆగస్ట్ నెలలో సూపర్ ఎల్‌నినో ఏర్పడే అవకాశం 22 శాతం ఉందని.. స్ట్రాంగ్ ఎల్‌నినో ఏర్పడటానికి 80 శాతం, మోస్తరు ఎల్‌నినో ఏర్పడేందుకు 98 శాతం అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. అటు మార్చి నుంచి సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కూడా అంచనా వేసింది.

ఏప్రిల్, మే నెలల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరతాయని.. వేడిగాలులతో వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మార్చిలో శ్రీకాకుళం, ప్రకాశం, కర్నూలు, మార్కాపురం, నంద్యాల, అన్నమయ్య, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. గుంటూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, మార్కాపురం జిల్లాల్లో వడగాలులు ఎక్కువ రోజులు వీచేందుకు ఛాన్స్ ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ అంచనా వేశారు. ఎండలు. వడగాలుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి