Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

US, Israel-Iran War: దాడుల విషయంలో అమెరికా ఇజ్రాయెల్ మధ్య విభేదాలు..?

9 March 2026

ATM Alert: ఏటీఎం మెషీన్‌లో మీ కార్డు ఇరుక్కుపోయిందా?.. ఈ పొరపాటు చేస్తే మీ డబ్బులు గోవిందా..

9 March 2026

ఎండకాలంలో బెల్లం తింటే ఏమవుతుందో తెలుసా..? నిపుణులు చెప్పేది వింటే నోరెళ్లబెడతారు..

9 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Manthena Satyanarayana Raju,ప్రకృతి వైద్యుడు మంతెన సత్యనారాయణ రాజుకు ఏపీ ప్రభుత్వంలో కీలక పదవి.. కేబినేట్ హోదా, సౌకర్యాలు ఇవే.. – government issue orders to appoint doctor manthena satyanarayana raju as a ap yoga and naturopathy advisor
ఆంధ్రప్రదేశ్

Manthena Satyanarayana Raju,ప్రకృతి వైద్యుడు మంతెన సత్యనారాయణ రాజుకు ఏపీ ప్రభుత్వంలో కీలక పదవి.. కేబినేట్ హోదా, సౌకర్యాలు ఇవే.. – government issue orders to appoint doctor manthena satyanarayana raju as a ap yoga and naturopathy advisor

.By .9 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Manthena Satyanarayana Raju,ప్రకృతి వైద్యుడు మంతెన సత్యనారాయణ రాజుకు ఏపీ ప్రభుత్వంలో కీలక పదవి.. కేబినేట్ హోదా, సౌకర్యాలు ఇవే.. – government issue orders to appoint doctor manthena satyanarayana raju as a ap yoga and naturopathy advisor
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Doctor Manthena Satyanarayana Raju appointed as AP Government Advisor for Naturopathy: ప్రకృతి వైద్యులు మంతెన సత్యనారాయణ రాజుకు ఏపీ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఏపీ యోగా, నేచురోపతి విభాగం సలహాదారుగా మంతెన సత్యనారాయణ రాజును నియమించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. కేబినెట్ హోదాలో గౌరవ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే మంతెన సత్యనారాయణ రాజుకు వాహనం, ఆఫీస్, కార్యాలయ సిబ్బంది సౌకర్యాలు, అధికారిక పర్యటనలకు ట్రావెల్ అలవెన్స్ సౌకర్యం కల్పిస్తారు.

Manthena Satyanarayana Raju
ప్రకృతి వైద్యుడు మంతెన సత్యనారాయణరాజు(ఫోటోలు– Samayam Telugu)
ప్రకృతి వైద్య రంగ నిపుణులు, డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. మంతెన సత్యనారాయణ రాజును ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. ఈ నియామకానికి సంబంధించిన నిర్ణయం గతేడాది డిసెంబర్ నెలలోనే జరిగింది. అయితే అధికారిక ఉత్తర్వులు మాత్రం సోమవారం రోజున జారీ అయ్యాయి. మంతెన సత్యనారాయణ రాజును ఏపీ ప్రభుత్వం యోగా, నేచురోపతి సలహాదారుగా నియమించింది. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. మరోవైపు మంతెన సత్యనారాయణ రాజుకు కేబినెట్ ర్యాంక్ హోదా కల్పించారు. గౌరవ సలహాదారుగా బాధ్యతలు అప్పగించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరస సలహాదారుగా మంతెన సత్యనారాయణ రాజుకు వాహనం, కార్యాలయం, సిబ్బంది సౌకర్యాలు కల్పిస్తారు. అలాగే అధికారిక పర్యటనల కోసం ట్రావెల్ అలవెన్స్ అందిస్తారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ జారీ చేసిన అధికారిక ఉత్తర్వుల్లో ఈ విషయాలను స్పష్టం చేశారు. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ ఏపీ వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు జి. సాయి ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు.

మరోవైపు ప్రకృతి వైద్యుడిగా మంతెన సత్యనారాయణ రాజుకు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరుంది. ఉండవల్లిలోని కరకట్ట వద్ద మంతెన సత్యనారాయణ రాజు.. ప్రకృతి వైద్యశాల ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ప్రకృతి వైద్యంలో ఆయనకు ఉన్న అనుభవాన్ని ఉపయోగించుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే యోగా, నేచురోపతి విభాగం సలహాదారుగా ఆయనను నియమించింది. మరోవైపు మంతెన సత్యనారాయణ రాజుకు విజయవాడ సహా రెండు చోట్ల ఆరోగ్యాలయం కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల ద్వారా ప్రకృతి వైద్యంతో మంతెన సత్యనారాయణ రాజు రోగులకు సేవలు అందిస్తున్నారు.

మరోవైపు గతంలోనూ వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఏపీ ప్రభుత్వం సలహాదారులుగా నియమించుకుంది. ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును నైతిక విలువల సలహాదారుగా నియమించింది. చాగంటి సహకారంతో విద్యార్థుల కోసం ప్రత్యేక పుస్తకాలను కూడా ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చింది. పెద్దలపై గౌరవం, సామాజంపై బాధ్యత, క్రమశిక్షణ, నైతిక విలువలను విద్యార్థులలో పెంపొందించేలా చాగంటి సహకారంతో ఈ పుస్తకాలను తయారు చేశారు. విలువల విద్య పేరుతో వీటిని రూపొందించి ప్రభుత్వ పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకూ చదివే విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించింది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి