గుంటూరు జిల్లా తుమ్మపూడిలో ఆదివారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆంజనేయులు అనే 53 ఏళ్ల వ్యక్తి సెల్ ఫోన్లో మహిళలు, యువతుల ఫోటోలు, వీడియోలు పెద్దసంఖ్యలో కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. దీంతో ఆంజనేయులు మీద చర్యలు తీసుకోవాలంటూ బాధితుల బంధువులు, గ్రామస్థులు ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడగా.. ఆదివారం రాత్రి 11 గంటల 30 నిమిషాలకు పోలీసులు ఆంజనేయులును అదుపులోకి తీసుకున్నారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటంతో స్థానికులు ఆందోళన విరమించారు.

అయితే ఇదే సమయంలో ఓ వ్యక్తి తనను దొంగచాటుగా గమనిస్తున్నట్లు యువతికి అనుమానం వచ్చింది. దొంగతనంగా తన ఫోటోలు తీస్తున్నట్లు సందేహం కలిగింది. దీంతో నేరుగా అతని వద్దకు చేరుకున్న యువతి.. ఈ విషయం మీద అతన్ని గట్టిగా ప్రశ్నించింది. అతని చేతిలోని సెల్ ఫోన్ లాక్కుని.. ఫోన్ గ్యాలరీని పరిశీలించింది. అందులోని ఫోటోలు, వీడియోలు చూసి యువతి షాక్ తింది. సెల్ ఫోన్ నిండా మహిళలు, అమ్మాయిల ఫోటోలు, వీడియోలే దర్శనమిచ్చాయి. ఆ వ్యక్తి తుమ్మపూడికి చెందిన 53 ఏళ్ల ఆంజనేయులుగా గుర్తించారు.
అయితే ఈ విషయం ఆదివారం రోజున బయటకు పొక్కింది. దీంత తుమ్మపూడిలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. స్థానికులు, బాధితుల తరుఫు బంధువులు పెద్ద సంఖ్యలో తుమ్మపూడి చేరుకున్నారు. వారంతా ఆందోళనకు దిగటంతో ఐదుగంటల పాటు తుమ్మపూడిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ విషయంపై సమచారం అందుకున్న దుగ్గిరాల పోలీసులు వెంటనే తుమ్మపూడి గ్రామానికి చేరుకున్నారు. అయినప్పటికీ పరిస్థితులలో మార్పులు రాలేదు. దీంతో మంగళగిరి గ్రామీణ సీఐ బ్రహ్మం మిగతా పోలీసు సిబ్బందితో కలిసి అక్కడకు చేరుకున్నారు. ఆదివారం రాత్రి 11.30 సమయంలో నిందితుడు ఆంజనేయులును అదుపులోకి తీసుకుని దుగ్గిరాల పోలీస్ స్టేషన్కు తరలించారు.
మరోవైపు నిందితుడిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వటంతో తుమ్మపూడిలో గ్రామస్థులు ఆందోళన విరమించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.


