Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Petrol Prices: టెన్షన్ పడకండి..పెట్రోల్ రేట్లు పెంచం

9 March 2026

Gas Booking: గ్యాస్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్. కేంద్రం నుంచి బిగ్ డెసిషన్.. బుకింగ్‌కు కొత్త రూల్స్..

9 March 2026

దూసుకెళ్తున్న క్రూడ్‌ ఆయిల్‌ ధరలు.. మళ్లీ బొచ్చ పట్టుకున్న పాకిస్థాన్‌!

9 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Women Videos In Phone,గుంటూరు: ఫోన్ నిండా అమ్మాయిలు, మహిళల ఫోటోలు, వీడియోలే.. 53 ఏళ్ల వయసులో ఇదేం పని.. – women and young girls photos and videos in old man cell phone cause tension at tummapudi in guntur district
ఆంధ్రప్రదేశ్

Women Videos In Phone,గుంటూరు: ఫోన్ నిండా అమ్మాయిలు, మహిళల ఫోటోలు, వీడియోలే.. 53 ఏళ్ల వయసులో ఇదేం పని.. – women and young girls photos and videos in old man cell phone cause tension at tummapudi in guntur district

.By .9 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Women Videos In Phone,గుంటూరు: ఫోన్ నిండా అమ్మాయిలు, మహిళల ఫోటోలు, వీడియోలే.. 53 ఏళ్ల వయసులో ఇదేం పని.. – women and young girls photos and videos in old man cell phone cause tension at tummapudi in guntur district
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


గుంటూరు జిల్లా తుమ్మపూడిలో ఆదివారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆంజనేయులు అనే 53 ఏళ్ల వ్యక్తి సెల్ ఫోన్‌లో మహిళలు, యువతుల ఫోటోలు, వీడియోలు పెద్దసంఖ్యలో కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. దీంతో ఆంజనేయులు మీద చర్యలు తీసుకోవాలంటూ బాధితుల బంధువులు, గ్రామస్థులు ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడగా.. ఆదివారం రాత్రి 11 గంటల 30 నిమిషాలకు పోలీసులు ఆంజనేయులును అదుపులోకి తీసుకున్నారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటంతో స్థానికులు ఆందోళన విరమించారు.

Guntur
సెల్ ఫోన్‌లో మహిళలు యువతుల వీడియోలు(ఫోటోలు– Samayam Telugu)
వయసు పెరిగే కొద్దీ పెద్దరికం, పెద్దమనసు రావాలంటారు. కానీ ఆయన మాత్రం వయసుకు తగ్గట్లుగా ప్రవర్తించలేకపోయాడు. తన వయసుకు తగని పనులు చేశాడు. ఆయన చేసిన పనితో ఓ ఊరిలో ఆదివారం రాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలోని తుమ్మపూడి గ్రామం.. ఆ పక్కనే చిలువూరు అనే ఊరు. ఈ రెండు గ్రామాల ప్రజలు ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే తెనాలి విజయవాడ హైవేపై ఉన్న తుమ్మపూడి అడ్డరోడ్డు వద్దకు రావాల్సి ఉంటుంది. నాలుగు రోజుల కిందట చిలువూరు గ్రామానికి చెందిన ఓ యువతి.. తుమ్మపూడి అడ్డరోడ్డు వద్దకు వచ్చింది. బస్సు కోసం నిరీక్షిస్తూ ఉంది.

అయితే ఇదే సమయంలో ఓ వ్యక్తి తనను దొంగచాటుగా గమనిస్తున్నట్లు యువతికి అనుమానం వచ్చింది. దొంగతనంగా తన ఫోటోలు తీస్తున్నట్లు సందేహం కలిగింది. దీంతో నేరుగా అతని వద్దకు చేరుకున్న యువతి.. ఈ విషయం మీద అతన్ని గట్టిగా ప్రశ్నించింది. అతని చేతిలోని సెల్ ఫోన్ లాక్కుని.. ఫోన్ గ్యాలరీని పరిశీలించింది. అందులోని ఫోటోలు, వీడియోలు చూసి యువతి షాక్ తింది. సెల్ ఫోన్‌ నిండా మహిళలు, అమ్మాయిల ఫోటోలు, వీడియోలే దర్శనమిచ్చాయి. ఆ వ్యక్తి తుమ్మపూడికి చెందిన 53 ఏళ్ల ఆంజనేయులుగా గుర్తించారు.

అయితే ఈ విషయం ఆదివారం రోజున బయటకు పొక్కింది. దీంత తుమ్మపూడిలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. స్థానికులు, బాధితుల తరుఫు బంధువులు పెద్ద సంఖ్యలో తుమ్మపూడి చేరుకున్నారు. వారంతా ఆందోళనకు దిగటంతో ఐదుగంటల పాటు తుమ్మపూడిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ విషయంపై సమచారం అందుకున్న దుగ్గిరాల పోలీసులు వెంటనే తుమ్మపూడి గ్రామానికి చేరుకున్నారు. అయినప్పటికీ పరిస్థితులలో మార్పులు రాలేదు. దీంతో మంగళగిరి గ్రామీణ సీఐ బ్రహ్మం మిగతా పోలీసు సిబ్బందితో కలిసి అక్కడకు చేరుకున్నారు. ఆదివారం రాత్రి 11.30 సమయంలో నిందితుడు ఆంజనేయులును అదుపులోకి తీసుకుని దుగ్గిరాల పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

మరోవైపు నిందితుడిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వటంతో తుమ్మపూడిలో గ్రామస్థులు ఆందోళన విరమించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి