Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

UPSC Rank 301 Row: వీడిన మిస్టరీ.. యూపీఎస్సీ సివిల్స్‌ ఫలితాల్లో 301 ర్యాంకు లొల్లిపై కమిషన్‌ క్లారిటీ!

10 March 2026

పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన మిస్టరీ స్పిన్నర్.. దెబ్బ అదుర్స్ కదూ..!

10 March 2026

ఎటువైపు తిరిగి నిద్రపోతున్నారు?.. ఇలా తిరిగి పడుకున్నారంటే ఒత్తిడి పెరిగే ప్రమాదం ఎక్కువ..!

10 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ap Govt Employee Avinash Singh Suicide Attempt,తెలంగాణకు బదిలీ చేయలేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం.. ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ క్లారిటీ – andhra pradesh fact check team gives clarity on government employee avinash singh try to ends his life on not transfer to telangana issue
ఆంధ్రప్రదేశ్

Ap Govt Employee Avinash Singh Suicide Attempt,తెలంగాణకు బదిలీ చేయలేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం.. ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ క్లారిటీ – andhra pradesh fact check team gives clarity on government employee avinash singh try to ends his life on not transfer to telangana issue

.By .10 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ap Govt Employee Avinash Singh Suicide Attempt,తెలంగాణకు బదిలీ చేయలేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం.. ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ క్లారిటీ – andhra pradesh fact check team gives clarity on government employee avinash singh try to ends his life on not transfer to telangana issue
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


AP Govt Employee Avinash Singh Suicide Attempt Issue Fact Check: ఏపీ సచివాలయంలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేశారంటూ ప్రచారం జరుగుతోంది. తనను తెలంగాణకు బదిలీ చేయలేదనే మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు కొందరు సోషల్ మీడియాలో పోస్టలు పెట్టారు. ఈ అంశంపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది. అవినాష్ సింగ్ బదిలీ అంశం, ఆత్మహత్యాయత్నంపై క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే అవినాష్ బదిలీ ప్రక్రియ కొనసాగుతోందన్నారు.

హైలైట్:

  • ఏపీ ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
  • తెలంగాణకు బదిలీ చేయలేదనే మనస్తాపం
  • ఈ అంశంపై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్
AP Govt Employee Avinash Singh
ఏపీ ప్రభుత్వ ఉద్యోగి అవినాష్ సింగ్ బదిలీ అంశం(ఫోటోలు– Samayam Telugu)
తెలంగాణకు బదిలీ చేయలేదనే ఆవేదనతో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. త‌న‌ను తెలంగాణ‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేయాలని అవినాష్ సింగ్ అనే ఉద్యోగి అర్జీ పెట్టుకున్నారని.. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా క‌మిష‌న‌ర్ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని మ‌న‌స్తాపంతో ఆత్మాహత్యాయత్నం చేసినట్లు కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. త‌న‌ను తెలంగాణ‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌క‌పోతే చ‌నిపోతాన‌ని సీఎస్‌కు లెట‌ర్ రాశారని.. బదిలీ జాబితాలో త‌న పేరు లేద‌ని మ‌నోవేద‌న‌తో ఆత్మహ‌త్యాయ‌త్నం చేశాడని ఆరోపించారు. అవినాష్ సింగ్ పరిస్థితి విషమంగా ఉందని, హైద‌రాబాద్‌లో చికిత్సపొందుతున్నట్లు కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.అవినాష్ సింగ్ ఆత్మహత్యాయత్నం చేసినట్లు జరుగుతున్న ప్రచారంపై ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు వారి కార్యాలయం(ఏపీ సచివాలయం పబ్లిసిటీ సెల్)లో అవినాష్ సింగ్ ఆఫీస్ సబార్డినేట్‌గా పని చేస్తున్నారని తెలిపారు. తనను ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ చేయకపోవడంతో ఆత్మహత్యా ప్రయత్నానికి పాల్పడినట్లు ఎక్స్ వేదికగా Telugu Feed(@ Telugu feedsite)అనే సోషల్ మీడియా అకౌంట్‌లో ఓ కథనాన్ని వైరల్ చేస్తున్నారన్నారు. అయితే ఆ కథనం పూర్తిగా నిరాధారమని క్లారిటీ ఇచ్చారు.

అవినాష్ సింగ్ స్వయంగా తాను ఎలాంటి ఆత్మహత్యా ప్రయత్నం చేయలేదని ఓ వీడియో ద్వారా తెలియజేశారని ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ తెలిపింది. కాబట్టి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం, కథనం పూర్తిగా అసత్యమన్నారు. అయితే అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాల మేరకు (కమీషనర్ గారి లేఖ తేదీ 19/02/2026), అంతరాష్ట్ర బదిలీల ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతోందని ఆ వివరాలను ప్రస్తావించారు. అయితే తెలంగాణకు బదిలీ కోరుకుంటున్న ఉద్యోగుల జాబితాలో అవినాష్ సింగ్ పేరు కూడా ఉందన్నారు. ఈ మేరకు ఆ జాబితాలోని (క్రమ సంఖ్య 472) స్పష్టంగా ఉందన్నారు. బదిలీలకు సంబంధించి డేటాను అప్‌డేట్ చేసి, తదుపరి చర్యల కోసం తెలంగాణ ప్రభుత్వానికి పంపించినట్లు తెలిపారు. ఏపీ నుంచి తెలంగాణకు ఉద్యోగుల బదిలీల ప్రక్రియ సజావుగానే సాగుతోందని.. ఇలాంటి సమయంలో తప్పుడు వార్తలు ప్రచారం చేయడం సరికాదన్నారు. ఇదంతా కేవలం ప్రజల్ని, తోటి ఉద్యోగులను గందరగోళానికి గురిచేయడమే అంటూ ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ తెలిపింది.

విభజన తర్వాత కూడా ఏపీలో కొందరు తెలంగాణ ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే వారంతా తమను తెలంగాణకు బదిలీ చేయాలని చాలా కాలంగా కోరుతున్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం ఓ జాబితాను తయారు చేసి తెలంగాణకు పంపించింది. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే బదిలీ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెబుతున్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి