Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

అటు రాజకీయ రచ్చ.. ఇటు సినిమా కష్టాలు! అరవ రాజకీయాల్లో తలపతి ఒంటరేనా!

10 March 2026

8th Pay Commission: 8వ వేతన సంఘంలో ఒక కీలక అప్‌డేట్‌.. ప్రభుత్వం నుంచి నోటీసు జారీ.. అదేంటంటే..!

10 March 2026

Allu Arjun Supports Durga Victim Of Vetlapalem,అల్లు అర్జున్ గొప్ప మనసు.. బాణసంచా పేలుడులో తండ్రిని కోల్పోయిన యువతికి అండ, – allu arjun helps a woman who lost her father in kakinada firecracker blast incident

10 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Kovvur To Jeelugumilli National Highway,ఏపీలో కొత్తగా మరో హైవే.. రూ.368 కోట్లు మంజూరు, హైదరాబాద్ రాజమండ్రి మధ్య తగ్గనున్న ప్రయాణ దూరం – center sanctioned rs 368 crore for national highway between jeelugumilli and kovvur in andhra pradesh
ఆంధ్రప్రదేశ్

Kovvur To Jeelugumilli National Highway,ఏపీలో కొత్తగా మరో హైవే.. రూ.368 కోట్లు మంజూరు, హైదరాబాద్ రాజమండ్రి మధ్య తగ్గనున్న ప్రయాణ దూరం – center sanctioned rs 368 crore for national highway between jeelugumilli and kovvur in andhra pradesh

.By .10 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Kovvur To Jeelugumilli National Highway,ఏపీలో కొత్తగా మరో హైవే.. రూ.368 కోట్లు మంజూరు, హైదరాబాద్ రాజమండ్రి మధ్య తగ్గనున్న ప్రయాణ దూరం – center sanctioned rs 368 crore for national highway between jeelugumilli and kovvur in andhra pradesh
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Kovvur To Jeelugumilli national Highway Rs 368 Crores Sanctioned: ఏపీలో మరో నేషనల్ హైవేకు కేంద్రం నుంచి నిదులు మంజూరయ్యాయి. రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఈ విషయాన్ని తెలియజేశారు. కొవ్వూరు టు జీలుగుమిల్లి హైవేకు కేంద్రం రూ.386 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. ఈ హైవేతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని.. పోలవరం ప్రాజెక్టుకు కనెక్టివిటీ పెరగుతుందన్నారు. ఏజెన్సీ గ్రామాలకు కూడా రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని పురందేశ్వరి తెలిపారు.

హైలైట్:

  • ఏపీలో మరో నేషనల్ హైవేకు నిధులు
  • కొవ్వూరు టు జీలుగుమిల్లికి హైవే ఫిక్స్
  • కేంద్రం నుంచి రూ.368 కోట్లు మంజూరు
Kovvur Jeelugumilli Highway
కొవ్వూరు టు జీలుగుమిల్లి నేషనల్ హైవే(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం సహకారంతో రాష్ట్రంలో నేషనల్ హైవేలు, రాష్ట్ర రహదారుల్ని అభివృద్ధి చేస్తోంది. రాష్ట్రం మీదుగా జాతీయరహదారులతో పాటుగా మరికొన్ని ముఖ్యమైన రోడ్లకు నిధులు మంజూరవుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో మరో ముఖ్యమైన రహదారికి నిధులు మంజూరు చేశారు. ఈ విషయాన్ని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నుంచి ఏలూరు జిల్లా జిలుగుమిల్లి వరకు రెండు వరుసల హైవే నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందన్నారు. కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం రూ.368 కోట్లు మంజూరు చేసినట్లు సోషల్ మీడియాలో తెలిపారు. ఈ హైవే అందుబాటులోకి వస్తే పోలవరం ప్రాజెక్టుకు కూడా కనెక్టివిటీ పెరుగుతుందని పురందేశ్వరి తెలిపారు. అలాగే హైదరాబాద్-రాజమండ్రి ప్రయాణ దూరం తగ్గుతుందని.. దాదాపు 86.7 కి.మీ పొడవైన ఈ రహదారి నిర్మాణంతో.. 100 ఏజెన్సీ గ్రామాలు, 30 మైదాన ప్రాంత గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యం లభించనుందన్నారు. ఈ హైవే నిర్మాణం ద్వారా పర్యాటకంగా పోలవరం ప్రాంత అభివృద్ధికి, గ్రామీణ ప్రాంతాలకు కనెక్టివిటీ మరింత పెరగనుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారులకు కేంద్రం కూడా పెద్ద పీట వేస్తోందన్నారు పురందేశ్వరి.

మరోవైపు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (PPA) కార్యాలయం తరలింపుపై ఎంపీ క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్‌లో ఉన్న కార్యాలయాన్ని రాజమహేంద్రవరం తరలించాలని కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ పర్యవేక్షణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని ట్వీట్ చేశారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో వేగవంతమైన పర్యవేక్షణకు అవకాశం ఉంటుందని.. అలాగే క్షేత్రస్థాయికి కార్యాలయం దగ్గరగా ఉంటే ప్రాజెక్టుకు సంబంధించిన పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించడం సులభమవుతుందన్నారు. మెరుగైన సమన్వయానికి అవకాశం ఉంటుందని.. రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో, స్థానిక విభాగాలతో సమన్వయం వేగవంతం అవుతుంది అన్నారు. బాధితులకు దగ్గరగా ఉండొచ్చని.. పోలవరం ప్రాజెక్ట్ ముంపు గ్రామాల ప్రజలు, నిర్వాసితులు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ కార్యకలాపాల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుంది అన్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి