Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Tech Tips: ఫోన్ ఛార్జర్‌ను ఎప్పుడూ ప్లగ్‌లో ఉంచుతున్నారా? ఏమవుతుందో తెలుసా..?

10 March 2026

ఫ్రిజ్‌కు, గోడకు మధ్య ఎంత దూరం ఉండాలి.. కరెంట్ ఆదా చేసే ఈ రహస్యం గురించి తెలుసా..!

10 March 2026

Beer: సమ్మర్‌లో బీర్ తాగితే శరీరంలో ఏమవుతుంది.? ‘చిల్’ పడిపోతుంది జాగ్రత్త.!

10 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ap Govt Withdraws Case On Teachers,ఏపీ ప్రభుత్వ టీచర్లకు ఊరట.. జగన్ సర్కార్ హయాంలో నమోదైన కేసు ఉపసంహరణ, కీలక ఉత్తర్వులు – ap govt has withdrawn the case filed against teachers who protested against the abolition of cps during the previous government tenure
ఆంధ్రప్రదేశ్

Ap Govt Withdraws Case On Teachers,ఏపీ ప్రభుత్వ టీచర్లకు ఊరట.. జగన్ సర్కార్ హయాంలో నమోదైన కేసు ఉపసంహరణ, కీలక ఉత్తర్వులు – ap govt has withdrawn the case filed against teachers who protested against the abolition of cps during the previous government tenure

.By .10 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ap Govt Withdraws Case On Teachers,ఏపీ ప్రభుత్వ టీచర్లకు ఊరట.. జగన్ సర్కార్ హయాంలో నమోదైన కేసు ఉపసంహరణ, కీలక ఉత్తర్వులు – ap govt has withdrawn the case filed against teachers who protested against the abolition of cps during the previous government tenure
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Andhra Pradesh Govt Teachers Case Withdrawn: ఏపీలో ప్రభుత్వ టీచర్లపై నమోదైన కేసుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. 2022లో నమోదైన కేసును తాజాగా ఉపసంహరించుకోవడానికి ఓకే చెప్పింది. ఈ కేసును ఉపసంహరించుకునేందుకు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. దీనికి అనుమతిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ ఉత్తర్వులు ఇచ్చారు. అంతేకాదు అంధ ఉపాధ్యాయులకు ముఖ ఆధారిత హాజరు విషయంలో మినహాయింపు ఇచ్చారు.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి

హైలైట్:

  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ టీచర్లకు ఊరట దక్కింది
  • గత ప్రభుత్వ హయాంల ోకేసు ఉపసంహరణ
  • కోర్టులో పిటిషన్ వేసేందుకు అనుమతి ఇచ్చారు
AP Govt Teachers Case
ఏపీ ఉపాధ్యాయులపై కేసు ఉపసంహరణ(ఫోటోలు– Samayam Telugu)
ఏపీలో టీచర్లకు భారీ ఊరట దక్కింది.. గత ప్రభుత్వ హయాంలో నమోదైన కేసుల్ని ప్రభుత్వం ఉసంహరించుకుంది. యూటీఎఫ్‌ సీపీఎస్‌ రద్దు కోరుతూ 2022 ఏప్రిల్‌ 25న సీఎం క్యాంపు కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చింది. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర ఉపాధ్యాయులు, యూటీఎఫ్ సభ్యులు సమావేశం నిర్వహించారు. అయితే ఈ నిరసనకు అనుమతి లేదని గత ప్రభుత్వం టీచర్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు విజయవాడ గవర్నర్‌పేట పోలీసు స్టేషన్‌లో కేసు కూడా నమోదు చేశారు. మొత్తం 73 మందిని ఈ కేసులో నిందితులుగా చేర్చారు. తాజాగా కూటమి ప్రభుత్వం ఈ కేసును ఉపసంహరించాలని నిర్ణయం తీసుకుంది. తాజాగా కోర్టులో పిటిషన్‌ దాఖలుకు అనుమతించగా.. హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసుల్ని ఉపసంహరించడంతో ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఊరట దక్కింది.

అంధ ఉపాధ్యాయుల హాజరుకు మినహాయింపు

ఏపీ ప్రభుత్వం అంధ ఉపాధ్యాయుల హాజరుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. అంధ ఉపాధ్యాయులకు ముఖ ఆధారిత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చారు. అంధ ఉపాధ్యాయులతో పాటుగా బోధనేతర సిబ్బందికి కూడా ఫేస్ రికగ్నిషన్ హాజరు నుంచి మినహాయింపు ఇచ్చారు. హాజరుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రభుత్వం స్కూల్స్‌లో ఇకపై ప్రధానోపాధ్యాయులు లీప్‌ యాప్‌లో హాజరు వేయాలి. అలాగే దృష్టిలోపం ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది హాజరు వేయాలని సూచించారు. ఏపీలో ప్రభుత్వ స్కూల్ టీచర్ల హాజరుకు సంబంధించి కొత్త నిబంధనను అమలు చేస్తోంది. ఇకపై టీచర్లు ప్రతిరోజూ ఉదయం 9 గంటలలోపు పాఠశాలలకు హాజరవ్వాల్సిందే. లేట్‌గా హాజరు నమోదు చేస్తే దానిని ‘లేట్ ఇన్‌’గా పరిగణిస్తారు. క్రమశిక్షణ, సమయపాలన కోసం ఈ మార్గదర్శకాలను జారీ చేశారు. అలాగే నెలలో ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే 10 నిమిషాల గ్రేస్ పీరియడ్ (వెసులుబాటు సమయం) అవకాశం మాత్రం కల్పించారు.

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా సంస్కరణలు భేష్‌ అంటూ ఢిల్లీకి చెందిన ఎస్‌ఎస్‌ఏ (సమగ్ర శిక్షా అభియాన్‌) బృందం కితాబిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల విద్యలో అమలు చేస్తున్న సంస్కరణలు అద్భుతమంటూ ఢిల్లీకి చెందిన ఎస్‌ఎస్‌ఏ అభియాన్‌ అధికారుల బృందం ప్రశంసించింది. ఢిల్లీకి చెందిన సమగ్ర శిక్షా అభియాన్‌ 25మందితో కూడిన బృందం ప్రస్తుతం ఏపీలో పర్యటిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల విద్యలో అమలు చేస్తున్న కార్యక్రమాలను పరిశీలిస్తోంది. రెండు రోజుల పాటూ ఇక్కడ స్కూల్స్‌లో అమలు చేస్తున్న సంస్కరణల్ని పరిశీలంచనుంది. ఆంధ్రప్రదేశ్ ఎస్‌ఎస్‌ఏ ఎస్పీడీ శ్రీనివాసరావుతో ఢిల్లీ టీమ్ భేటీ అయ్యారు. ప్రస్తుతం ఏపీలో అమలవుతున్న డిజిటల్‌ విద్య, మెగా పీటీఎం, హోలిస్టిక్‌ ప్రోగ్రెస్‌ కార్డులు, గ్రీన్‌ పాస్‌పోర్టు, స్టెమ్‌ ల్యాబ్స్, గ్యారెంటీ ఎఫ్‌ఎల్‌ఎన్, లైబ్రవరీ అభివృద్ధి, నైపుణ్య విద్య గురించి అడిగి తెలుసుకున్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి