Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Schools Closes: అక్కడ సంచలన నిర్ణయం.. మార్చి 31 వరకు విద్యాసంస్థలు బంద్‌.. వారానికి 4 రోజులే పని!

10 March 2026

Ap Excise Proposed To Reduce Liquor Prices,ఏపీలో మద్యం ధరలు తగ్గించే ఆలోచనలో ప్రభుత్వం.. ఆదాయం పెంచుకోవడానికేనా! – andhra pradesh excise department proposed to reduce prices of premium liquor reports

10 March 2026

ఐస్‌క్రీం తినగానే నీళ్లు తాగుతున్నారా ?? అయితే ఈ సమస్యలు తప్పవు

10 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Union Govt Suggest Some Changes In Visakhapatnam Vijayawada Metro Rail Projects,విశాఖ, విజయవాడ మెట్రోరైల్‌.. రెండు ప్రాజెక్టుల్లో మార్పులు, కేంద్రం కీలక సూచనలు – union government suggest some changes in visakhapatnam vijayawada metro rail projects reports
ఆంధ్రప్రదేశ్

Union Govt Suggest Some Changes In Visakhapatnam Vijayawada Metro Rail Projects,విశాఖ, విజయవాడ మెట్రోరైల్‌.. రెండు ప్రాజెక్టుల్లో మార్పులు, కేంద్రం కీలక సూచనలు – union government suggest some changes in visakhapatnam vijayawada metro rail projects reports

.By .10 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Union Govt Suggest Some Changes In Visakhapatnam Vijayawada Metro Rail Projects,విశాఖ, విజయవాడ మెట్రోరైల్‌.. రెండు ప్రాజెక్టుల్లో మార్పులు, కేంద్రం కీలక సూచనలు – union government suggest some changes in visakhapatnam vijayawada metro rail projects reports
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Visakhapatnam Vijayawada Metro Rail Projects Changes: విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు సంబంధించి డీపీఆర్‌లను కేంద్రానికి పంపించిన సంగతి తెలిసిందే. అయితే కేంద్రం ఏపీ ప్రభుత్వం పంపించిన డీపీఆర్‌ను పరిశీలించి.. ఈ ప్రాజెక్టులపై కొన్ని సూచనలు, మార్పులు చెప్పింది.. దీంతో విశాఖపట్నం, విజయవాడలో మెట్రో రైలు కోసం మరోసారి సర్వే చేయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే సర్వే ప్రక్రియను పూర్తిచేసి కేంద్రానికి మరోసారి నివేదికను పంపించాలని భావిస్తున్నారు.

హైలైట్:

  • విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులు
  • డీపీఆర్‌లు పరిశీలించి కేంద్రం సూచనలు చేసింది
  • మరోసారి సర్వేకు సిద్ధమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
Visakhapatnam Vijayawada Metro Rail Projects
విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టులో మార్పులు(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం సహకారంతో విశాఖపట్నం, విజయవాడలో మెట్రోరైల్ ప్రాజెక్టుల్ని ప్లాన్ చేసింది.. దీనికి సంబంధించి డీపీఆర్‌లను కేంద్రానికి పంపించింది. అయితే ఈ రెండు మెట్రో రైలు ప్రాజెక్టులపై కేంద్రం కొన్ని మార్పులు సూచించింది. కేంద్రం విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి.. స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాదికి వెళ్లే మార్గంలో డబుల్ డెక్కర్ కంటే కారిడార్ నిర్మించడం మంచిదని ఏపీ ప్రభుత్వానికి తెలిపింది. విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు విషయానికి వస్తే.. బస్టాండ్ నుంచి కాకుండా కాళేశ్వరం మార్కెట్ నుంచి అయితే బావుంటుందని తెలిపింది. కేంద్రం నుంచి కొన్ని మార్పులు, మరికొన్ని సూచనలు రావడంతో.. ఈ ప్రతిపాదనలపై సర్వ చేయించాలని నిర్ణయించింది. ఈ సర్వే బాధ్యతల్ని కూడా రైట్స్ సంస్థకు అప్పగించారు. ఈ సర్వే ప్రక్రియను 60 రోజుల్లో పూర్తి చేసి రిపోర్ట్ ఇవ్వనున్నారు.విశాఖపట్నంలో మెట్రో రైలును మూడు కారిడార్లలో ప్లాన్ చేశారు. ఇందులో స్టీల్‌ ప్లాంట్‌ టు కొమ్మాది కారిడార్ ముఖ్యమైనది. అయితే ఏపీ ప్రభుత్వం డబుల్ డెక్కర్ ప్లాన్ చేసింది. అక్కడ నేషనల్ హైవేపై ఫ్లై ఓవర్, దానిపై డబుల్ డెక్కర్ మెట్రో కారిడార్ ఏర్పాటు చేయాలనుకున్నారు. అయితే నేషనల్ హైవే మధ్యలో నుంచి కారిడార్ ఏర్పాటు చేయడం మంచిదని కేంద్రం చెబుతోంది. అంతేకాదు ఈ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబందించిన అంచనా వ్యయం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. విజయవాడలో కూడా మెట్రో రైల్ కారిడార్‌పై కొన్ని సూచనలు చేసింది. అక్కడ రెండు కారిడార్లు ప్లాన్ చేశారు. ఈ రెండు కూడా బస్టాండ్ నుంచి మొదలవుతాయి. కేంద్రం కొన్ని సూచనలు, మార్పులు చెప్పడంతో.. మళ్లీ సర్వే ప్రక్రియ చేపడతారు. దీంతో విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులు మరికొంత ఆలస్యం అవుతాయని భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. విశాఖపట్నం మధ్యలో నుంచి నేషనల్ హైవే 16 వెళుతోంది. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఫ్లై ఓవర్లను నిర్మించాలని ఎన్‌హెచ్ఏఐ ప్రతిపాదించింది. ఇటు మెట్రో రైలు ప్రాజెక్టు చేపడితే భూసేకరణ సమస్యలు వస్తాయని భావిస్తున్నారు. అందుకే డబుల్‌ డెక్కర్‌ మోడల్‌ను తెరపైకి తీసుకొచ్చారు. కింద వాహనాలు, పైన మెట్రో వెళ్లేలా ప్లాన్ చేశారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కూడా త్వరలోనే అందుబాటులోకి రానుండటంతో ఫ్లై ఓవర్లు కూడా చాలా ముఖ్యం అంటున్నారు. లేకపోతే ట్రాఫిక్ సమస్యలు తప్పవంటున్నారు.. ఈ అంశాన్ని ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రస్తావించారు. మరి ఏపీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది చూడాలి. మొత్తం మీద మెట్రో రైలు ప్రాజెక్టుల్లో కొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి