తెలుగు పంచాంగం ప్రకారం, మార్చి 19 గురు వారం రోజున ఉగాది పండుగ. ఇక ఈ రోజు నుంచే శ్రీ పరాభవ నామ సంవత్సరం ప్రారంభం అవుతుంది. అయితే ఈ సంవత్సరం ప్రారంభం నుంచి నాలుగు రాశుల వారికి అద్భుతంగా ఉండనున్నదంట. ముఖ్యంగా ఈ రాశుల వారు నక్కతోక తొక్కినట్లే, అన్ని విధాల కలిసి వస్తుందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?
వృషభ రాశి : 2026 మార్చి 19 శ్రీ పరాభవ నామ సంవత్సరం నుంచి వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. ఈ రాశుల వారు జాక్ పాట్ కొట్టడం ఖాయం. ఊహించినదానికంటే ఎక్కువగా సంపాదిస్తారు. అనుకోని విధంగా ఆదాయం పెరుగుతుంది. స్థిరమైన ఆదాయం ఏర్పరుచుకుంటారు. ఇంటిలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే డబ్బు పొదుపు కోసం, ఎందులోనైనా పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నారో, వారు ఈ సంవత్సరం ఆ కోరికను తీర్చుకుంటారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహించుకుంటారు. సంవత్సరం మొత్తం చాలా ఆనందంగా గడుపుతారు.
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి ఇది చాలా అద్భుతమైన సంవత్సరం అని చెప్పాలి. ఏకంగా సంవత్సరం ప్రారంభంలోనే వీరు గోల్డెన్ ఛాన్స్లు అందుకునే అవకాశం ఉంది. చాలా రోజుల నుంచి మంచి ఉద్యోగం కోసం ఎదురు చూసే వారు ఈ సంవత్సరం ఏకంగా ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా తీర్పు వస్తాయి. కొత్త వ్యాపారం ప్రారంభించాలి అనే మీ కోరిక సఫలీకృతం అవుతుంది. అన్నింటా విజయాలే మిమ్మల్ని వరిస్తాయి.
మిథున రాశి : మిథున రాశి వారికి వ్యాపార పరంగా కలిసి వస్తుంది. చాలా ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు మంచి కాలేజీల్లో సీటు సంపాదించుకుంటారు. ఈ రాశి వారు తీర్థయాత్రలు చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంది, ఇంటా బయట సానుకూల వాతావరణం ఉంది. ఈ సంవత్సరం కెరీర్ పరంగా కలిసి వస్తుంది. ఎవరు అయితే విదేశాల్లో జాబ్ చేయాలనుకుంటారో వారి కోరిక తీరుతుంది. ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం.
తుల రాశి : తుల రాశి వారికి ఇది చాలా అద్భుతమై సమయంగా చెప్పాలి. ఈ రాశి వారు నూతన గృహ నిర్మాణం లేదా కొత్త ఇల్లు కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. కానీ ఇవి మీకు లాభాలను తీసుకొచ్చే విధంగా ఉంటాయి. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. పుణ్య క్షేత్రాలు సందర్శించుకుంటారు. అన్ని విధాల మీకు ఇది లాభాలు తీసుకొస్తుంది.






