Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Dhurandhar The Revenge: సినిమానే కాదు ట్రైలర్ కూడా రికార్డ్ బ్రేక్ చేసింది..

10 March 2026

Telangana: 10 రోజుల మగ బిడ్డను అమ్మేసిన తల్లి.. ఎందుకో తెలిసి అధికారులే షాక్..!

10 March 2026

టీమండియా కెప్టెన్‌గా సంజూ శాంసన్.. పొట్టి ఫార్మాట్ బాధ్యతలు స్వీకరించేందుకు రెడీ..?

10 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Visakhapatnam Paramotoring Adventures Started,విశాఖ వెళ్లేవారికి సరికొత్త థ్రిల్.. రుషికొండలో పారా మోటార్ విన్యాసాలు మళ్లీ ప్రారంభం – paramotoring activities again started in rushikonda beach visakhapatnam
ఆంధ్రప్రదేశ్

Visakhapatnam Paramotoring Adventures Started,విశాఖ వెళ్లేవారికి సరికొత్త థ్రిల్.. రుషికొండలో పారా మోటార్ విన్యాసాలు మళ్లీ ప్రారంభం – paramotoring activities again started in rushikonda beach visakhapatnam

.By .10 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Visakhapatnam Paramotoring Adventures Started,విశాఖ వెళ్లేవారికి సరికొత్త థ్రిల్.. రుషికొండలో పారా మోటార్ విన్యాసాలు మళ్లీ ప్రారంభం – paramotoring activities again started in rushikonda beach visakhapatnam
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Visakhapatnam Paramotoring Activities Started: విశాఖపట్నంలో పారా మోటార్ విన్యాసాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి నెలలో పారా మోటార్ ఆగిపోగా.. సోమవారం నుంచి మళ్లీ విన్యాసాలు ప్రారంభించారు. రుషికొండ బీచ్‌లో ప్రతి రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు పారా మోటార్ అందుబాటులో ఉంటుంది. మొత్తం నాలుగు పారా మోటర్లు అందుబాటులో ఉంటాయి. పిల్లలు, పెద్దలకు టికెట్ ధరను రూ.3వేలుగా నిర్ణయించారు. ఆ సమీపంలోనే టికెట్లు కూడా జారీ చేస్తారు.

హైలైట్:

  • విశాఖ రుషికొండలో పారా మోటార్ విన్యాసాలు
  • సోమవారం నుంచి మళ్లీ ప్రారంభించారు
  • ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 వరకు
Visakhapatnam Paramotoring
విశాఖపట్నం పారా మోటార్ ప్రారంభం(ఫోటోలు– Samayam Telugu)
విశాఖపట్నం వెళ్లే పర్యాటకులకు తీపికబురు చెప్పింది టూరిజం శాఖ. రుషికొండ తీరంలో అలా ఆకాశంలో విహరిస్తూ సరికొత్త అనుభూతిని పొందేందుకు పారా మోటార్ విన్యాసాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. నగరానికి వచ్చే పర్యాటకుల కోసం.. ఏపీ పర్యాటకశాఖ అనుమతితో.. ఓ ప్రైవేట్ సంస్థ గతేడాది నవంబర్‌లో ఈ పారా మోటార్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. పర్యాటకులు కూడా రుషికొండ బీచ్‌లో పారా మోటార్‌ విన్యాసాలు చేస్తూ చిల్ అయ్యారు. కానీ ప్రైవేట్ సంస్థతో చేసుకున్న ఒప్పందం ముగియడంతో పాటుగా ఇతర కారణాలతో గత నెల నుంచి నిలిపివేశారు. విశాఖపట్నంలో రుషికొండ తీర ప్రాంతానికి పర్యాటకులు భారీగా తరలివస్తుండటంతో మళ్లీ పారా మోటార్‌ మళ్లీ అందుబాటులోకి వచ్చింది. భద్రతా చర్యలతో మళ్లీ పారామోటార్‌ విన్యాసాలు ప్రారంభమయ్యాయి. ప్రతి రోజూ (వారం మొత్తం) ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పారా మోటార్ అందుబాటులో ఉంటుంది. మొత్తం నాలుగు పారా మోటార్లు అందుబాటులో ఉన్నాయి.. వేర్వేరుగా పైలట్ కూడా ఉంటారు. వీరితో పాటుగా నిపుణులు, సహాయక సిబ్బంది 10మంది వరకు ఉంటారు.

ముందు జాగ్రత్తగా ట్రిప్‌కు వెళ్లే ముందు పారా మోటార్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. భద్రతాపరంగా ఎలాంటి ఇబ్బందులు లేవని
నిర్ధారించుకున్న తర్వాతే విన్యాసాలకు అనుమతిస్తారు. ఈ పారా మోటార్‌కు టికెట్ ధరను రూ.3వేలుగా నిర్ణయించారు.. 5 కిలో మీటర్ల వరకు వెళ్లొచ్చు. ఐదేళ్ల వయసుపైన ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తారు. రుషికొండ బీచ్ హెలిప్యాడ్ దగ్గర రెండు కౌంటర్లు ఏర్పాటు చేసి పారా మోటార్ కోసం టికెట్లు ఇస్తున్నారు.

విశాఖపట్నం వెళ్లేవారికి కైలాసగిరిలో గ్లాస్ బ్రిడ్జి కూడా మంచి టూరిజం స్పాట్. రూ.7 కోట్లతో ఈ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు.. జర్మనీ నుంచి 40 ఎంఎం మందం కలిగిన ల్యామినేటెడ్‌ గాజును తెప్పించి ఈ బ్రిడ్జిని నిర్మించారు. ఒకేసారి 500 టన్నుల బరువు మోయగలదు.. ఒకేసారి 40మంది పర్యాటకులు బ్రిడ్జిపైకి ఎక్కొచ్చు. బలమైన గాలులు వీచినా తట్టుకునేలా నిర్మించారు. ఇటు కైలాసగిరిపై త్రిశూల్ ప్రాజెక్టు కూడా ముగింపు దశకు వచ్చింది.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి