Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Drishyam 3: ‘దృశ్యం 3’కి వెంకీ నో చెప్పారా.. కారణం అదేనా

10 March 2026

Dhurandhar 2: తెలుగు ధురంధర్‌2 లో పాటలు ఉండవా.. ఇదేం మ్యాజిక్

10 March 2026

ప్రస్తుతం భారత్ వద్ద ఎంత పెట్రోల్ ఉందో తెలుసా..? ఇంకెన్ని రోజులు వస్తుందంటే..!

10 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Kadiri Bramarathostavam,Kadiri Rathostavam 2026: లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మరథోత్సవంలో అపశ్రుతి.. భక్తులకు గాయాలు – discord in the brahmarathotsavam of kadiri lakshmi narasimha swamy temple and devotees injured
ఆంధ్రప్రదేశ్

Kadiri Bramarathostavam,Kadiri Rathostavam 2026: లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మరథోత్సవంలో అపశ్రుతి.. భక్తులకు గాయాలు – discord in the brahmarathotsavam of kadiri lakshmi narasimha swamy temple and devotees injured

.By .10 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Kadiri Bramarathostavam,Kadiri Rathostavam 2026: లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మరథోత్సవంలో అపశ్రుతి.. భక్తులకు గాయాలు – discord in the brahmarathotsavam of kadiri lakshmi narasimha swamy temple and devotees injured
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


సత్యసాయి జిల్లా కదిరిలోని ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మరథోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. బ్రహ్మరథోత్సవంలో భాగంగా రథం కిందపడి ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. అతన్ని కాపాడే క్రమంలో మరో ఐదుగురు భక్తులు గాయపడ్డారు. వీరందరినీ వెంటనే కదిరి గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వీరికి చికిత్స అందిస్తున్నారు. కదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం రోజున రథోత్సవం నిర్వహించారు.

Kadiri
కదిరి రథోత్సవంలో అపశ్రుతి(ఫోటోలు– Samayam Telugu)
శ్రీసత్యసాయి జిల్లాలోని కదిరిలో శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మ రథోత్సవంలో (తేరు) అపశ్రుతి చోటుచేసుకుంది. రథోత్సవంలో భాగంగా రథం లాగే క్రమంలో రథం చక్రం కింద పడి ఓ వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. అతన్ని కాపాడేందుకు ప్రయత్నించిన మరో ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. దీంతో గాయపడిన వారందరిని కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వాసుపత్రిలో ప్రస్తుతం వీరికి చికిత్స కొనసాగుతోంది. కదిరిలోని శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రధాన ఘట్టమైన బ్రహ్మరథోత్సవం మంగళవారం నిర్వహించారు.

వేలాదిమంది భక్తజన సందోహం మధ్యన వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది. బ్రహ్మరథోత్సవంలో భాగంగా ఉదయం ఎనిమిది గంటల 40 నిమిషాలకు ఆలయ అర్చకులు స్వామివారికి నిత్యకైంకర్యాలు, పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల జయజయధ్వానాల నడుమ రథం ముందుకు కదిలింది. ఈ కార్యక్రమానికి పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు తరలివచ్చారు.

రథోత్సవంలో భాగంగా స్వామివారు రథంలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు దవనం, మిరియాలు చల్లి ముక్కులు చెల్లించుకున్నారు. రథంలో ఆసీనుడైన నరసింహస్వామిపై దవనం, మిరియాలు చల్లితే పాపాలు తొలగి అష్టఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. దీంతో అధిక సంఖ్యలో భక్తులు కదిరి బ్రహ్మరథోత్వానికి హాజరవుతుంటారు. ఈ కార్యక్రమం కోసం పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి