Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

EPFO: ఈపీఎఫ్‌వో ఉద్యోగులకు శుభవార్త.. త్వరలోనే రూ.7,500కి పెరగనుందా..? కేంద్రం నిర్ణయం..!

10 March 2026

ఖాళీ వాటర్ క్యాన్‌తో అందమైన మినీ చెరువు… పైసా ఖర్చు లేకుండా హోమ్ డెకర్ ఐడియా!

10 March 2026

Virat Kohli : స్టేడియంలో ధోనీ, రోహిత్ సందడి.. కానీ కింగ్ కోహ్లీ ఎక్కడ? గైర్హాజరుకు అసలు కారణం ఇదే

10 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Annadata Sukhibhava Funds Release,Annadata Sukhibhava: ఏపీ రైతులకు ఉగాది కానుక.. అన్నదాత సుఖీభవ నిధుల విడుదల ఆరోజే! – ap government annadata sukhibhava 3rd installment likely to release on 13th march 2026 reports said
ఆంధ్రప్రదేశ్

Annadata Sukhibhava Funds Release,Annadata Sukhibhava: ఏపీ రైతులకు ఉగాది కానుక.. అన్నదాత సుఖీభవ నిధుల విడుదల ఆరోజే! – ap government annadata sukhibhava 3rd installment likely to release on 13th march 2026 reports said

.By .10 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Annadata Sukhibhava Funds Release,Annadata Sukhibhava: ఏపీ రైతులకు ఉగాది కానుక.. అన్నదాత సుఖీభవ నిధుల విడుదల ఆరోజే! – ap government annadata sukhibhava 3rd installment likely to release on 13th march 2026 reports said
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త. ఉగాది కానుకగా అన్నదాత సుఖీభవ పథకం నిధులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. పీఎం కిసాన్ యోజన 22వ విడత నిధులను మార్చి 13వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది. పీఎం కిసాన్ యోజనతో పాటుగానే అన్నదాత సుఖీభవ పథకం నిధులు కూడా విడుదల చేస్తూ ఉండటంతోనే.. ఉగాదికి ముందుగా మార్చి 13న అన్నదాత సుఖీభవ పథకం మూడో విడత నిధులను ఏపీ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిసింది. మొత్తం రూ.6000 రైతుల అకౌంట్లలో జమ చేయనున్నట్లు సమాచారం.

annadata sukhibhava
అన్నదాత సుఖీభవ నిధుల విడుదల(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్ రైతులకు ముఖ్య గమనిక. అన్నదాత సుఖీభవ పథకం నిధుల విడుదలకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. అన్నదాత సుఖీభవ పథకాన్ని, కేంద్ర ప్రభుత్వం పథకమైన పీఎం కిసాన్ యోజన తో కలిపి అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ యోజన పేరుతో ప్రతి ఏటా ఏపీలోని అర్హులైన రైతులకు 20 వేలు చొప్పున పంపిణీ చేస్తున్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.14000, పీఎం కిసాన్ యోజన కింద రూ.6000 అందిస్తున్నారు. మొత్తం మూడు విడతల్లో ఈ నిధులను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నారు. అయితే పీఎం కిసాన్ యోజన 22వ విడత నిధుల విడుదలకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. మార్చి 13వ తేదీన పీఎం కిసాన్ యోజన 22వ విడత నిధులు విడుదల చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా మార్చి 13వ తేదీన అస్సాంలోని గౌహతిలో జరిగే కార్యక్రమంలో పీఎం కిసాన్ యోజన 22వ విడత నిధులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. మరోవైపు కేంద్రం పీఎం కిసాన్ యోజన నిధులు విడుదల చేసిన రోజే.. ఏపీ ప్రభుత్వం కూడా అన్న దాత సుఖీభవ పథకం నిధులు విడుదల చేస్తుంది. ఈ నేపథ్యంలో మార్చి 13వ తేదీనే అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు కూడా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే అవకాశాలు ఉన్నాయి. పీఎం కిసాన్ యోజన కింద రూ.2000, అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.4000 కలిపి అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.6000 జమయ్యే అవకాశం ఉంది. ఉగాదికి ముందు ఈ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.

మరోవైపు పీఎం కిసాన్ యోజన సాయం అందాలంటే రైతులు తప్పనిసరిగా ఈ కేవైసీ పూర్తి చేయాల్సి ఉంది. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయశాఖ మరోసారి స్పష్టం చేసింది. పీఎం కిసాన్ లబ్ధి అందుకోవటానికి రైతులు ఈకేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాలని.. ఇందుకోసం సమీప సీఎస్‌సీ కేంద్రాలను సంప్రదించాలని సూచించింది. ఓటీపీ ఆధారిత ఈకేవైసీ కోసం పీఎం కిసాన్ సైట్ సందర్శించవచ్చు. లేదా బయోమెట్రిక్ ఆధారంగా ఈకేవైసీ చేయాలంటే కామన్ సర్వీస్ సెంటర్లను సంప్రదించాలని కేంద్ర వ్యవసాయ శాఖ సూచించింది.

మరోవైపు అన్నదాత సుఖీభవ పథకం కింద ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకూ రూ.10000 లను అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాలలో జమ చేసింది. మూడో విడతగా మరో నాలుగు వేలు అందించనుంది. సంక్రాంతి సమయంలోనే ఈ డబ్బులు జమ చేస్తారనే వార్తలు వచ్చినప్పటికీ.. వివిధ కారణాలతో జాప్యం జరిగింది. అయితే తాజాగా మార్చి 13వ తేదీన అన్నదాత సుఖీభవ పథకం నిధుల విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి