TTD On Tirumala Srivari Temple Parakamani Theft: తిరుమల శ్రీవారి పరకామణిలో గతేడాది జరిగిన చోరీ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. భారీగా బంగారం చోరీ జరిగిందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో టీటీడీ స్పందించింది.. ఈ అంశంపై క్లారిటీ ఇచ్చింది. గతేడాది పరకామణిలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బంది పెంచలయ్య బంగారం చోరీ చేసేందుకు ప్రయత్నించారని.. టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ అతడ్ని పట్టుకుని కేసు నమోదు చేశారని.. కేసు కోర్టు పరిధిలో ఉందని టీటీడీ తెలిపింది.
హైలైట్:
- గతేడాది తిరుమల పరకామణిలో దొంగతనం
- భారీగా బంగారం చోరీ జరిగిందని ప్రచారం
- స్పందించిన టీటీడీ.. కీలక ప్రకటన జారీ

ఈ ఘటన తర్వాత పోలీసులు దర్యాప్తు చేపట్టారని.. నిందితుడి ఇంటి దగ్గర, ఇతర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారన్నారు. ఈ క్రమంలో మరో 555.5 గ్రాముల బంగారు ఆభరణాలు, 157 గ్రాముల వెండి వస్తువుల్ని గుర్తించామన్నారు. వెంటనే పోలీసులు స్వాధీనం చేసుకున్నారన్నారు. ప్రకటనలో తెలిపింది. అలాగే జ్యువెలరీ షాపుల్లో బంగారం మార్పిడి చేసిన ఇన్వాయిస్లను స్వాధీనం చేసుకున్నారట. అయితే ఈ కేసు దర్యాప్తు చేస్తుంటే 12 మంది సాక్షులను ప్రశ్నించామని.. అన్ని ఆధారాలతో పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారన్నారు. ఏప్రిల్ 13న కోర్టులో విచారణ జరుగుతుందంటున్నారు. ఈ విషయాలు మీడియాలో కూడా ప్రసారమయ్యాయని.. కానీ పరకామణిలో భారీగా బంగారం చోరీ జరిగినట్లు ప్రచారం చేయడం సరికాదని టీటీడీ తెలియజేసింది. ఈ మేరకు టీటీడీ పరకామణిలో చోరీ జరిగిందనే ప్రచారంలో నిజం లేదని తెలిపింది.
తిరుమల శ్రీవారికి విరాళం
తిరుమల శ్రీవారికిమరో విరాళం అందింది. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ బాలాజీ వర ప్రసాదిని స్కీంకు రూ.10 లక్షల విరాళం అందింది. హైదరాబాద్ కు చెందిన కియోరా ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ కంపెనీ ఎండీ డా. కోడెల శివరామకృష్ణ తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ విరాళాన్ని అందించారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్లో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రకు దాత విరాళం డీడీని మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా డా. కోడెల శివరామకృష్ణను టిటిడి ఈవో అభినందించారు.


