Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Inter Physics Exam 2026: ఇంటర్‌ ఫిజిక్స్‌ క్వశ్చన్‌ పేపర్లో ఓ ప్రశ్న మిస్సింగ్‌.. గుడ్‌న్యూస్ చెప్పిన ఇంటర్ బోర్డు

11 March 2026

Kashi Ganga Jal: కాశీ నుంచి తెచ్చిన నీటిని ఇంట్లో ఉంచుకోవచ్చా..?

11 March 2026

Gas Save Tips: బెస్ట్‌ ట్రిక్స్‌.. ఇలా చేశారంటే వంట గ్యాస్‌ను భారీగా ఆదా చేసుకోవచ్చు!

11 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»TTD On Tirumala Srivari Temple Parakamani Gold Theft,తిరుమల పరకామణిలో భారీగా బంగారం చోరీ చేసిన ఉద్యోగి.. టీటీడీ క్లారిటీ, కీలక ప్రకటన – allegations that large scale gold theft in tirumala srivari temple parakamani is false says ttd
ఆంధ్రప్రదేశ్

TTD On Tirumala Srivari Temple Parakamani Gold Theft,తిరుమల పరకామణిలో భారీగా బంగారం చోరీ చేసిన ఉద్యోగి.. టీటీడీ క్లారిటీ, కీలక ప్రకటన – allegations that large scale gold theft in tirumala srivari temple parakamani is false says ttd

.By .11 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
TTD On Tirumala Srivari Temple Parakamani Gold Theft,తిరుమల పరకామణిలో భారీగా బంగారం చోరీ చేసిన ఉద్యోగి.. టీటీడీ క్లారిటీ, కీలక ప్రకటన – allegations that large scale gold theft in tirumala srivari temple parakamani is false says ttd
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


TTD On Tirumala Srivari Temple Parakamani Theft: తిరుమల శ్రీవారి పరకామణిలో గతేడాది జరిగిన చోరీ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. భారీగా బంగారం చోరీ జరిగిందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో టీటీడీ స్పందించింది.. ఈ అంశంపై క్లారిటీ ఇచ్చింది. గతేడాది పరకామణిలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది పెంచలయ్య బంగారం చోరీ చేసేందుకు ప్రయత్నించారని.. టీటీడీ విజిలెన్స్‌, సెక్యూరిటీ అతడ్ని పట్టుకుని కేసు నమోదు చేశారని.. కేసు కోర్టు పరిధిలో ఉందని టీటీడీ తెలిపింది.

హైలైట్:

  • గతేడాది తిరుమల పరకామణిలో దొంగతనం
  • భారీగా బంగారం చోరీ జరిగిందని ప్రచారం
  • స్పందించిన టీటీడీ.. కీలక ప్రకటన జారీ
Tirumala Srivari Temple Parakamani
తిరుమల పరకామణిలో బంగారం చోరీ(ఫోటోలు– Samayam Telugu)
తిరుమల శ్రీవారి పరకామణిలో భారీగా బంగారం చోరీ జరిగిందంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందంటోంది టీటీడీ. పరకామణిలో చోరీ అంటూ ఓ న్యూస్ పేపర్‌లో ప్రచురించిన కథనం పూర్తిగా అసత్యమని తెలిపింది. వాస్తవాలను వక్రీకరించారంటూ టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది. తిరుమల పరకామణిలో ABREPOSE సంస్థకు చెందిన ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది పెంచలయ్య విధులు నిర్వహిస్తున్నారన్నారు. ఆయన 2025 జనవరి 11న 100 గ్రాముల బంగారు బిస్కెట్‌ను అపహరించేందుకు ప్రయత్నించినట్లు తెలిపింది. ఆ సమయంలో టీటీడీ విజిలెన్స్‌, సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని.. వెంటనే స్పందించి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు వివరించింది.పరికామణిలో చోరీ ఘటన సీసీటీవీ కెమెరాల్లో నమోదైంది అని టీటీడీ తెలిపింది. ఈ మేరకు అన్ని ఆధారాలతో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్‌ చేశారన్నారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు విచారణలో ఉందని.. అయితే పరకామణిలో జరిగిన ఈ సంఘటనను వక్రీకరించి పరకామణిలో కోట్ల విలువైన బంగారం మాయమైందన్నట్లు ప్రచారం చేయడం సరికాదన్నారు. పరకామణి ప్రక్రియలో బహుళ భద్రతా వ్యవస్థ, కఠిన నియంత్రణ విధానాలు, సీసీటీవీ పర్యవేక్షణ అమలులో ఉన్నాయని టీటీడీ తెలిపింది.

ఈ ఘటన తర్వాత పోలీసులు దర్యాప్తు చేపట్టారని.. నిందితుడి ఇంటి దగ్గర, ఇతర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారన్నారు. ఈ క్రమంలో మరో 555.5 గ్రాముల బంగారు ఆభరణాలు, 157 గ్రాముల వెండి వస్తువుల్ని గుర్తించామన్నారు. వెంటనే పోలీసులు స్వాధీనం చేసుకున్నారన్నారు. ప్రకటనలో తెలిపింది. అలాగే జ్యువెలరీ షాపుల్లో బంగారం మార్పిడి చేసిన ఇన్వాయిస్‌లను స్వాధీనం చేసుకున్నారట. అయితే ఈ కేసు దర్యాప్తు చేస్తుంటే 12 మంది సాక్షులను ప్రశ్నించామని.. అన్ని ఆధారాలతో పోలీసులు ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారన్నారు. ఏప్రిల్ 13న కోర్టులో విచారణ జరుగుతుందంటున్నారు. ఈ విషయాలు మీడియాలో కూడా ప్రసారమయ్యాయని.. కానీ పరకామణిలో భారీగా బంగారం చోరీ జరిగినట్లు ప్రచారం చేయడం సరికాదని టీటీడీ తెలియజేసింది. ఈ మేరకు టీటీడీ పరకామణిలో చోరీ జరిగిందనే ప్రచారంలో నిజం లేదని తెలిపింది.

తిరుమల శ్రీవారికి విరాళం

తిరుమల శ్రీవారికిమరో విరాళం అందింది. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ బాలాజీ వర ప్రసాదిని స్కీంకు రూ.10 లక్షల విరాళం అందింది. హైదరాబాద్ కు చెందిన కియోరా ఇన్‌ఫ్రా కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఎండీ డా. కోడెల శివరామకృష్ణ తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ విరాళాన్ని అందించారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్‌లో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రకు దాత విరాళం డీడీని మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా డా. కోడెల శివరామకృష్ణను టిటిడి ఈవో అభినందించారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి