Nellore Trust Rs 5 Crore For Govt Schools,ఈ భార్యాభర్తలది ఎంత గొప్ప మనసు.. ప్రభుత్వ స్కూల్స్, కాలేజీలకు ఏకంగా రూ.కోట్లలో విరాళాలు – amara bacchu charitable trust donates 5 crores for government schools development in nellore district
Amara Bacchu Trust Rs 5 Crore For Govt Schools In Nellore District: నెల్లూరు జిల్లాకు చెందిన భార్యాభర్తలు ప్రభుత్వ స్కూల్స్, కాలేజీల అభివృద్ధికి సాయం అందిస్తోంది. ఈ మేరకు అమరా బచ్చు చారిటబుల్ ట్రస్టు ఏకంగా రూ.5కోట్ల విరాళం ప్రకటించింది. నెల్లూరు జిల్లా బోగోలు మండలంలోని స్కూల్స్, కాలేజీలకు ఈ నిధులు వినియోగించనున్నట్లు ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీలు బచ్చు కృష్ణకుమార్ దంపతులు తెలిపారు. మంత్రి లోకేష్ను కలిసి అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ఆహ్వానించారు.
హైలైట్:
నెల్లూరు జిల్లా దంపతుల పెద్ద మనసు
స్కూల్స్, కాలేజీలకు రూ.5 కోట్లు సాయం
అభినందించిన మంత్రి నారా లోకేష్
నెల్లూరులో ప్రభుత్వ స్కూళ్లకు రూ.5కోట్లు(ఫోటోలు– Samayam Telugu)
ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న.. సరిగ్గా ఇదే మాటను ఆచరణలో పెట్టారు ఆ భార్యాభర్తలు. పెద్ద మనసుతో ప్రభుత్వ స్కూల్స్, కాలేజీలకు భారీగా విరాళాలు అందజేసి తమవంతుగా సాయం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా బోగోలుకు చెందిన బచ్చు కృష్ణకుమార్ దంపతులు అమరా బచ్చు ఛారీటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ముందుకు వచ్చారు. ఏకంగా కోట్లాది రూపాయల్ని స్కూల్స్, కాలేజీల కోసం ఖర్చు చేస్తున్నారు.బచ్చు కృష్ణకుమార్ దంపతులు మంత్రి నారా లోకేష్ను కలిశారు. బోగోలు మండలంలోని ప్రభుత్వ స్కూల్స్, ఇంటర్ కాలేజీల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రూ.5 కోట్లు ఇస్తామని ప్రకటించారు. స్కూల్స్, కాలేజీల్లో త్వరలో చేపట్టనున్న ఆయా అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి హాజరవ్వాలని మంత్రి లోకేష్ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా బచ్చు కృష్ణకుమార్ దంపతుల్ని మంత్రి లోకేష్ అభినందించారు. అంతేకాదు అమరా బచ్చు ట్రస్ట్ ఆధ్వర్యంలో.. బోగోలు మండలం కొవ్వూరుపల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధికి రూ.5 కోట్లు ప్రకటించారు. అలాగే కొండబిట్రగుంటలోని శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధికి మరో రూ.5 కోట్ల సాయాన్ని అందించనున్నారు.
‘నెల్లూరు జిల్లా బోగోలుకు చెందిన అమరా ఛారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ బచ్చు కృష్ణ కుమార్ దంపతులను ఉండవల్లి నివాసంలో కలిశాను. బోగోలు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో విద్య, మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.5 కోట్ల సాయం అందించినందుకు అభినందనలు తెలిపాను’ అంటూ మంత్రి లోకేష్ కూడా ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన బడి-మన భవిష్యత్తు కార్యక్రమం కింద ప్రభుత్వ స్కూల్స్ అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐలను, ఆయా స్కూల్స్లో చదివిన పూర్వ విద్యార్థులను భాగస్వామ్యం చేస్తోంది. సాయం చేసిన దాతల పేర్లు సైతం ఆయా స్కూల్స్కు పెట్టుకునే అవకాశం కల్పించింది. ఏపీ ప్రభుత్వం త్వరలో మన బడి-మన భవిష్యత్తు వెబ్సైట్ను ప్రారంభించనుంది.
రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి