Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Financial Planning: EMIలో ఐఫోన్ కొంటున్నారా?.. మీరు చెల్లిస్తున్న మొత్తం ఎంతో తెలిస్తే మైండ్ బ్లాకే..

11 March 2026

Tollywood: దాసరి తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరు? తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్స్ వైరల్

11 March 2026

AP Government Inquiry On Velagapudi Fire Accident,అమరావతిలో అగ్నిప్రమాదం వెనుక కుట్ర? హోం మంత్రి ఆదేశాలు – ap government orders inquiry into velagapudi fire incident in amaravati

11 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Mumbai Devotees Donates 20 Lakh To Ttd,టీటీడీకి మరో భారీ విరాళం.. ముంబై భక్తుల పెద్ద మనసు.. – mumbai devotees donates 20 lakh to ttd sv gosamrakshana trust and svims hospital
ఆంధ్రప్రదేశ్

Mumbai Devotees Donates 20 Lakh To Ttd,టీటీడీకి మరో భారీ విరాళం.. ముంబై భక్తుల పెద్ద మనసు.. – mumbai devotees donates 20 lakh to ttd sv gosamrakshana trust and svims hospital

.By .11 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Mumbai Devotees Donates 20 Lakh To Ttd,టీటీడీకి మరో భారీ విరాళం.. ముంబై భక్తుల పెద్ద మనసు.. – mumbai devotees donates 20 lakh to ttd sv gosamrakshana trust and svims hospital
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


టీటీడీకి మరో భారీ విరాళం అందింది. ముంబైకు చెందిన భక్తులు టీటీడీ ట్రస్టులకు రూ.20 లక్షలు విరాళంగా అందించారు. ముంబైకి చెందిన రాజేంద్ర జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్లు టీటీడీ ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు, స్విమ్స్ ఆస్పత్రికి రూ.10 లక్షలు చొప్పున విరాళం అందించారు. టీటీడీ ఈవో రవిచంద్రను కలిసి విరాళానికి సంబంధించిన డీడీని అందించారు. ఈ సందర్భంగా దాతలను టీటీడీ ఈవో అభినందించారు.

tirumala
ముంబై భక్తులు టీటీడీకి విరాళం(ఫోటోలు– Samayam Telugu)
తిరుమల శ్రీవారికి మరో భారీ విరాళం అందింది. టీటీడీ ట్రస్టులకు ముంబైకు చెందిన భక్తులు రూ.20 లక్షలు విరాళం అందించారు. ముంబయికి చెందిన రాజేంద్ర జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన డైరెక్టర్లు బేరూలాల్ జైన్, మీనేష్ జైన్ ఈ విరాళం అందించారు. ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్ కు రూ.10 లక్షలు, శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్)కు రూ.10 లక్షలు చొప్పున విరాళం అందించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో ఈవో ముద్దాడ రవిచంద్రకు విరాళానికి సంబంధించిన డీడీలు అందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాతలను టీటీడీ ఈవో రవిచంద్ర అభినందించారు.

మరోవైపు టీటీడీ ఆధ్వర్యంలో అనేక ట్రస్టులు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఎస్వీ ప్రాణదానం ట్రస్టు, ఎస్వీ అన్నదానం ట్రస్టు, విద్యాదానం ట్రస్టు ఇలాంటి అనేక ట్రస్టులను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తోంది. ఈ ట్రస్టుల ద్వారా సేవలు అందిస్తోంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే ప్రముఖులు.. టీటీడీ సామాజిక సేవా కార్యక్రమాలకు తమ వంతు సాయంగా ఉండేందుకు విరాళాలు సమర్పిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే టీటీడీకి నిత్యం పలువురు దాతలు విరాళాలు సమర్పిస్తూ ఉంటారు.

టీటీడీ విద్యాసంస్థలకు రూ.118 కోట్లు

మరోవైపు 2026–27 ఆర్థిక సంవత్సరానికి గానూ టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థల సమగ్ర అభివృద్ధికి రూ.118.89 కోట్ల నిధులు కేటాయించారు. అత్యాధునిక సాంకేతికత, విద్యార్థుల సామర్థ్యాల పెంపు, విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ తదితర అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ విద్యా శాఖలో సమగ్ర మార్పులు తీసుకురావాలని తిరుమల తిరుపతి దేవస్థానం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా 2026–27 ఆర్థిక సంవత్సరానికి శ్రీ ఎస్వీ విద్యాదాన ట్రస్ట్, టిటిడి కలిపి విద్యాసంస్థలను ఆధునీకరించి.. విద్యార్థుల మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రూ.118.89 కోట్లు కేటాయించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో టీటీడీ విద్యా సంస్థల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం ఈ నిధులను కేటాయించారు. వీటితో అదనపు తరగతి గదులు, అదనపు వసతి గదుల నిర్మాణం వంటి పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఇతర మౌలిక వసతులు కల్పించనున్నారు.

శ్రీకాళహస్తిని దర్శించుకున్న శృంగేరి పీఠాధిపతి

మరోవైపు జగద్గురు శ్రీ విధుశేఖర భారతి మహాస్వామిజీ, జగద్గురు మహా సంస్థానం శృంగేరి పీఠం స్వామీజీ శ్రీకాళహస్తిని సందర్శించారు. ఆలయ మొదటి గోపురమైన భిక్షాల గోపురం దగ్గర శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయిప్రసాద్, ఆలయ ఈవో వెంకటేశులు వారిని సాదరంగా ఆహ్వానించారు. అనంతరం స్వామివారి అభిషేకము, దర్శనం ఏర్పాటు చేయించారు. ఆ తర్వాత వేద పండితుల ఆశీర్వచనం అందించి, తీర్థ ప్రసాదాలు స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి