Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

HDFC: హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు బిగ్‌ అలర్ట్‌.. మార్చి 14న ఈ సేవలు అందుబాటులో ఉండవు.. టైమింగ్‌ ఇదే!

12 March 2026

అందానికి నిజమైన నిర్వచనం అదేనంటూ సీక్రెట్ రివీల్ చేసిన బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్

12 March 2026

Ap Govt Smart Family Card,ఏపీ ప్రజల కోసం స్మార్ట్ కార్డు.. ఎన్నో ప్రయోజనాలు, జస్ట్ స్కాన్ చేస్తే చాలు – andhra pradesh government plans family card discussed in collectors conference

12 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra Pradesh Highest Temperaturs In March,ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ ఎండల తీవ్రత.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మళ్లీ 38 డిగ్రీలు – highest temperatures recorded in andhra pradesh
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh Highest Temperaturs In March,ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ ఎండల తీవ్రత.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మళ్లీ 38 డిగ్రీలు – highest temperatures recorded in andhra pradesh

.By .12 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra Pradesh Highest Temperaturs In March,ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ ఎండల తీవ్రత.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మళ్లీ 38 డిగ్రీలు – highest temperatures recorded in andhra pradesh
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Andhra Pradesh Highest Temperatures Recorded: ఏపీలో మరోసారి సూర్యుడి భగభగలు మొదలయ్యాయి. కొద్దిరోజుల పాటూ గ్యాప్ ఇచ్చినా.. మళ్లీ ఎండల తీవ్రత పెరిగింది. బుధవారం 37.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు మరోసారి 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. వేడిగాలుల తీవ్రత కూడా పెరుగుతంది అంటున్నారు,. ఇదిలా ఉంటే ఈ నెల 16, 17 తేదీల్లో వానలు కురిసే అవకాశం ఉంది అంటున్నారు.

హైలైట్:

  • ఏపీలో మరోసారి పెరిగిన ఎండల తీవ్రత
  • కర్నూలులో 37.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
  • ఈ నెల 16,17న తేలికపాటి వానలకు ఛాన్స్
AP Highest Temperatures
ఏపీలో పెరిగిన ఉష్ణోగ్రతలు(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత మళ్లీ పెరుగుతోంది.. కొద్ది రోజులుగా ప్రభాం కాస్త తగ్గినా, మళ్లీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. బుధవారం కర్నూలులో 37.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.. ఇది రాష్ట్రంలోనే అత్యధిక గరిష్ఠ ఉష్ణోగ్రత అని వాతావరణశాఖ తెలిపింది. కాకినాడ జిల్లా తుని, పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, కృష్ణా జిల్లా మచిలీపట్నం, ఎన్టీఆర్ జిల్లా నందిగామ, కృష్ణా జిల్లా గన్నవరం, అమరావతి, అనంతపురం, నంద్యాల, కడపలో ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలు దాటిపోయింది. పలు జిల్లాల్లో సాధారణం కంటే 2 నుంచి 2.9 డిగ్రీలు పెరిగిందని చెబుతున్నారు. ఈ నెల 14 తర్వాత ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని.. మూడు రోజుల పాటు కొనసాగుతుంది అంటున్నారు. అయితే ఈ నెల 16, 17న రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మొన్నటి వరకు వాతావరణంలో కాస్త మార్పులు కనిపించాయి. ఉపరితల ద్రోణి కారణంగా కొన్నిచోట్లు తేలికపాటి వానలు పడ్డాయి. దీంతో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యింది. అయితే మళ్లీ ఎండల తీవ్రత పెరగడంతో జనాలు ఆందోళనలో ఉన్నారు.

రాష్ట్రంలో ఎండలు, వడగాల్పుల తీవ్రత పెరిగే అవకాశం ఉందనే అంచనాలతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఏపీ రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత కీలక సమీక్ష నిర్వహించారు. హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ 2026 పేరుతో కొన్ని మార్గదర్శకాలను రూపొందించారు. ఈ ఏడాది సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఎండల తీవ్రత విపరీతంగా ఉండబోతోందని ఏపీఎస్‌డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ అన్నారు. సాధారణం కంటే చాలా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. వేడిగాలుల తీవ్రత పెరుగుతుందన్నారు.

అన్నిశాఖలు సమన్వంతో పనిచేయాలని మంత్రి అనిత అధికారులకు సూచించారు. ఒకవేళ ఎవరైనా వడదెబ్బ బారిన పడితే వారికి వెంటనే మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఆస్పత్రుల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని.. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అవసరమైన మందులను అందుబాటులోకి ఉంచుకోవాలన్నారు. అలాగే అంబులెన్సులను ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, దినసరి కూలీలు, భవన నిర్మాణ కార్మికులు జాగ్రత్తగా ఉండాలన్నారు. రాష్ట్రంలో బస్టాండ్లు, ప్రధాన కూడళ్లు, జనసంచారం ఎక్కువగా ఉండేచోట చలివేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. సామాజిక సేవా సంస్థల సాయంతో ఉచితంగా మంచినీరు, మజ్జిగ పంపిణీ చేసేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. మొత్తానికి ఈ ఏడాది ఎండల తీవ్రత కాస్త గట్టిగానే ఉండే అవకాశం ఉందంటున్నారు.. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి