Rayanapadu Railway Station To Be Inaugurated Soon,రాయనపాడు రైల్వే స్టేషన్ లుక్ అదిరింది.. ఎయిర్పోర్ట్ రేంజ్లో, త్వరలో ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం – rayanapadu railway station upgraded under the amrit bharat station scheme to be inaugurated soon
Rayanapadu Amrit Bharat Railway Station Ready To Inaugurate Soon: విజయవాడ సమీపంలో రాయనపాడు రైల్వేస్టేషన్ ఉంది. అమృత్ భారత్ పథకం కింద ఈ రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేశారు. విజయవాడ రైల్వేస్టేషన్లో రద్దీని తగ్గించేందుకు ఈ స్టేషన్ను తీర్చిదిద్దారు. ప్రయాణికులకు సౌకర్యాలత పాటుగా అధునాతన హంగులతో లుక్ అదిరింది. త్వలోనే రాయనపాడు రైల్వే స్టేషన్ను ప్రారంభించనన్నారు. ఈ రైల్వే స్టేషన్లో పలు ఎక్స్ప్రెకస్ రైళ్లు కూడా ఆగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో ‘అమృత్ భారత్’ పథకం కింద రైల్వేశాఖ రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేస్తోంది. విజయవాడ రైల్వేస్టేషన్లో రద్దీని తగ్గించేందుకు ప్రత్యామ్నాయంగా ఇక్కడ మౌలిక వసతులతో పాటుగా హైటెక్ హంగులతో తీర్చిదిద్దుతున్నారు. విజయవాడకు సమీపంలో ఉన్న రాయనపాడు రైల్వేస్టేషన్ కొత్త లుక్లో అదిరిపోయింది. ఎయిర్పోర్ట్ లుక్లో సాంస్కృతిక, వారసత్వ సంపదను తెలియజేసేలా కొండపల్లి బొమ్మల పెయింట్స్తో ఆకట్టుకుంటోంది. ఈ రాయనపాడు రైల్వే స్టేషన్ను ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా త్వరలోనే ప్రారంభించనున్నారు.రాయనపాడు రైల్వే స్టేషన్ను అమృత్భారత్ కింద రూ.19.90 కోట్లతో అభివృద్ధి చేశారు. స్టేషన్లో కొత్త ప్లాట్ఫాంల నిర్మాణం, ప్రయాణికులు వెయిటింగ్ హాల్స్, టికెట్ కౌంటర్, ప్రయాణికులకు తాగునీటి సౌకర్యం, స్టేషన్ మాష్టర్ రూమ్, ప్లాట్ఫాంపై షెడ్ల నిర్మాణం చేశారు. అలాగే రైల్వే స్టేషన్ ప్రాంగణంలో మొక్కలతో గ్రీనరీ కూడా ఉంది. రైల్వే స్టేషన్లో చుట్టూ ప్రహరీ గోడ కూడా నిర్మించారు. ఈ రైల్వే స్టేషన్ మీదుగా ప్రతి రోజూ 12 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయని అధికారులు తెలిపారు. వీటిలో కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు కూడా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ రాయనపాడు రైల్వే స్టేషన్ కీలకంగా మారుతుంది అంటున్నారు.. ప్రయాణికుల సంఖ్య కూడా పెరుగుతుందని భావిస్తున్నారు.
రాబోయే రోజుల్లో మరికొన్ని రైళ్లు రాయనపాడు రైల్వేస్టేషన్లో ఆగేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు అధికారులు. విజయవాడ రైల్వేస్టేషన్లో రద్దీ, ఒత్తిడి తగ్గించేందుకు ఇలా ప్లాన్ చేస్తున్నారట. విశాఖపట్నం వైపు వెళ్లే రైళ్లు, అటు నుంచి వచ్చే రైళ్లు విజయవాడ స్టేషన్కు వెళ్లకుండానే రాయనపాడు రైల్వేస్టేషన్కు వచ్చేలా ట్రాక్లు ఉన్నాయి. అంతేకాదు రాయనపాడులో రైలు దిగిన ప్రయాణికులు విజయవాడకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సుల్ని ఏర్పాటు చేయనున్నారు. అయితే రాత్రి వేళల్లో కూడా బస్సులు నడిపేలా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు. రాయనపాడు రైల్వే స్టేషన్ హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారికి సమీపంలో ఉండటం కూడా కలిసొస్తుంది. మొత్తం మీద రాయనపాడు రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనుల్ని వేగంగా పూర్తి చేసి ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు రైల్వే అధికారులు.
రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి