Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఓరీ దేవుడు.. ఈ వీడియో చూశారంటే.. ఈ జన్మలో బయట పాప్‌కార్న్‌ తినరు..! షాకింగ్‌ వీడియో వైరల్‌

12 March 2026

Vijay Thalapathy : తండ్రికి మరోసారి షాకిచ్చిన జాసన్ సంజయ్.. విజయ్‏కు ఇంట్లోనే దెబ్బ మీద దెబ్బ..

12 March 2026

భాగ్యనగరంలో హోటళ్లకు కట్టెల పొయ్యిలే దిక్కా!

12 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Tirumala Rare Green Snake,తిరుమలలో అరుదైన నాగుపాము.. ఈ కలర్‌లో కూడా ఉంటాయా! – rare green color cobra spotted in tirumala
ఆంధ్రప్రదేశ్

Tirumala Rare Green Snake,తిరుమలలో అరుదైన నాగుపాము.. ఈ కలర్‌లో కూడా ఉంటాయా! – rare green color cobra spotted in tirumala

.By .12 March 2026No Comments1 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Tirumala Rare Green Snake,తిరుమలలో అరుదైన నాగుపాము.. ఈ కలర్‌లో కూడా ఉంటాయా! – rare green color cobra spotted in tirumala
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Tirumala Rare Green Cobra: తిరుమలలో అరుదుగా ఉండే పచ్చ నాగుపాము కనిపించింది. మనం బూడిద రంగులో ఉండే నాగుపాముల్ని చూస్తుంటాం. కానీ తిరుమలలో మాత్రంపచ్చ రంగులో ఉన్న నాగుపాము ప్రత్యక్షమైంది. ఈ పామును చూసి అందరూ ఆశ్చర్యపోయారు. సమాచారం అందుకున్న టీటీీడ స్నేక్ క్యాచర్ భాస్కరనాయుడు అక్కడికి చేరుకున్నారు. ఆ పామును జాగ్రత్తగా పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఇలాంటి పచ్చరంగు నాగుపాములు చాలా అరుదుగా ఉంటాయని చెబుతున్నారు.

హైలైట్:

  • తిరుమలలో అరుదైన పచ్చ నాగుపాము
  • ఆదిశేషు అతిథి గృహం దగ్గర ప్రత్యక్షం
  • జాగ్రత్తగా పట్టుకుని అడవిలో వదిలేశారు
Tirumala Rare Green Snake
తిరుమలలో పచ్చ నాగుపాము(ఫోటోలు– Samayam Telugu)
తిరుమలలో అరుదుగా కనిపించే నాగుపాము ప్రత్యక్షమైంది. పచ్చ రంగులో ఉండే ఈ నాగుపామును అందరూ ఆశ్చర్యపోయారు. కొండపై ఆదిశేషు అతిథి గృహం దగ్గర ఓ చెట్టులో దాదాపు మూడున్నర అడుగుల పొడవు గల ఈ నాగుపాము కనింపించింది. అక్కడి సిబ్బంది గమనించి వెంటనే టీటీడీ స్నేక్‌ క్యాచర్‌ భాస్కర్‌ నాయుడుకు సమాచారం ఇచ్చారు. ఆయన వెంటనే అక్కడికి చేరుకుని నాగుపామును జాగ్రత్తగా పట్టుకొని.. అక్కడి నుంచి తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలేశారు. ఈ పచ్చ నాగపాములు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి.. ఇవి ఆకుపచ్చ, లేత పసుపు రంగులో కనిపిస్తుంటాయి. ఈ నాగుపాములు ఎక్కువగా చెట్లు, పొదల్లో కనిపిస్తుంటాయి. ఈ పాములు కీటకాలు, చిన్న సాలె పురుగుల్ని తిని జీవిస్తుంటాయి. ఈ పాములు మృదువుగా, సన్నగా ఉంటాయని చెబుతున్నారు. ఈ పచ్చగా ఉండటం వల్ల చెట్లపై ఉన్నప్పుడు.. ఆకులలో దాక్కుని ఉన్నప్పుడు గుర్తించడం చాలా కష్టమని చెబుతున్నారు. ఈ నాగుపాములు ఎక్కువగా తేమ ఉండే అడవులు, తోటలు, పొలాలు, చెట్లపై ఉంటాయని.. విషపూరితమైనదనట. తిరుమలలో కనిపించడంతో అందరూ ఆశ్చర్యంగా చూశారు. కొంతమంది వీడియోలు తీయడంతో వైరల్ అయ్యింది.

అన్నమాచార్య వర్థంతి ఉత్సవాలు

తిరుమలలో టీటీడీ ఆధ్వర్యంలో మార్చి 15న పదకవితా పితామహుడు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యల 523వ వర్థంతి మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఆ రోజు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఊరేగింపుగా బయల్దేరి సాయంత్రం 6 గంటలకు నారాయణగిరి ఉద్యానవనాలకు చేరుకుంటారు. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సప్తగిరి సంకీర్తనా గోష్ఠిగానం నిర్వహించనున్నారు. అటు తరువాత స్వామివారు ఉభయదేవేరులతో కలిసి ఆలయానికి వేంచేపు చేస్తారు.

శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వర్ధంతి ఉత్సవాలను మార్చి 14 నుండి 21వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలు అన్నమయ్య జన్మస్థలమైన తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద, తిరుమల నారాయణగిరి ఉద్యానవనం, తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం మరియు మహతి కళాక్షేత్రంలో జరుగనున్నాయి. మార్చి 14వ తేదీ ఉదయం 6 గంటలకు తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లోత్సవం నిర్వహిస్తారు. మార్చి 15 నుండి 21వ తేదీ వరకు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ప్రతి రోజు ఉదయం 10.30 గంటలకు సాహితీ సదస్సులు, సాయంత్రం భక్తి సంగీత కార్యక్రమాలు జరుగనున్నాయి. తాళ్లపాకలోని ధ్యానమందిరం మరియు 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద సాయంత్రం వేళ ఆధ్యాత్మిక మరియు భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మార్చి 16 నుండి 18వ తేదీ వరకు తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8.30 గంటల వరకు ప్రముఖ కళాకారులతో సంగీత సభలు నిర్వహించనున్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి