Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Money9: రెండేళ్లలో వాళ్లే నిజమైన హీరోలు.. టీవీ9 ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సమ్మిట్‌లో బరుణ్ దాస్ కీలక వ్యాఖ్యలు

12 March 2026

Air Cooler: మీ ఇంట్లో కూలర్ నుంచి నీచు కంపు వస్తోందా? ఈ సింపుల్ టిప్స్‌తో చెక్‌ పెట్టొచ్చు!

12 March 2026

India: దేశంలో మరో సంక్షోభం.. వంట గ్యాస్ బాటలో వీటి ధరలు.. త్వరలోనే పెరిగే అవకాశం..

12 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»కలెక్టర్ల సదస్సులో రైతులకు శుభవార్త చెప్పిన చంద్రబాబు.. రేపే అన్నదాత సుఖీభవ నిధులు జమ – ap cm chandrababu naidu announced at collectors conference annadata sukhibhava 3rd installment on friday of march 13th
ఆంధ్రప్రదేశ్

కలెక్టర్ల సదస్సులో రైతులకు శుభవార్త చెప్పిన చంద్రబాబు.. రేపే అన్నదాత సుఖీభవ నిధులు జమ – ap cm chandrababu naidu announced at collectors conference annadata sukhibhava 3rd installment on friday of march 13th

.By .12 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
కలెక్టర్ల సదస్సులో రైతులకు శుభవార్త చెప్పిన చంద్రబాబు.. రేపే అన్నదాత సుఖీభవ నిధులు జమ – ap cm chandrababu naidu announced at collectors conference annadata sukhibhava 3rd installment on friday of march 13th
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రెండు రోజుల పాటు జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహించిన ఆరో సదస్సు ఇది. ఇందులో రాష్ట్ర మంత్రులు, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు సహా కీలక అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా చివర రోజున సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. అధికారులకు కీలక సూచనలు చేశారు.

హైలైట్:

  • అమరావతిలో ఆరో కలెక్టర్ల సదస్సు నిర్వహించిన ప్రభుత్వం
  • సంక్షేమ క్యాలెండర్ విడుదల చేయనున్నట్టు సీఎం ప్రకటన
  • అన్నదాత సుఖీభవ నిధులు, 2.5 లక్షల గృహప్రవేశాలు
AP CM Chandrababu Naidu
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(ఫోటోలు– Samayam Telugu)
అమరావతిలో జరుగుతున్న రెండో రోజు కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్, సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించారు. సంక్షేమ పథకాల అమలుతో పాటు విద్య, వైద్యం, ఆదాయార్జన, నైపుణ్యాభివృద్ధి, పెట్టుబడుల అంశాలపై కూడా సీఎం చర్చించారు. ఈ సందర్భంగా సంపద సృష్టితో పాటు పౌరులకు మెరుగైన జీవన ప్రమాణాలు అందేలా చూడాలని అధికారులకు సీఎం దిశనిర్దేశనం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన క్యాలెండర్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్టు సీఎం తెలిపారు. ప్రభుత్వ పథకాల లబ్దిదారులకు ప్రజా ప్రతినిధుల ద్వారా సంక్షేమ కార్డులను అందజేయాలని సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా రైతులకు అన్నదాత సుఖీభవ నిధుల విడుదలపై స్పష్టత ఇచ్చారు.పథకాల అమలులో పారదర్శకత, ఓనర్‌షిప్ తీసుకునేందుకు సంక్షేమ కార్డులను ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. పెట్టుబడులే కాకుండా పేదల గురించి కూడా ఆలోచించాలని ఆయన సూచించారు. మూడో విడత అన్నదాత సుఖీభవ నిధులు రేపు (మార్చి 13న శుక్రవారం) విడుదల చేస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. ఇప్పటి వరకూ అన్నాక్యాంటీన్ల ద్వారా పేదలకు 7.5 కోట్ల భోజనాలను అందించామని, అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలకు గ్రాట్యూటీ అమలు చేస్తున్నామని చెప్పారు. రూ. 1,000 కోట్లతో రహదారులు మరమ్మతులు చేపట్టినట్టు గుర్తుచేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పల్లె పండుగ కింద రూ.4 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పుకొచ్చారు.

పేదలందరికీ సంక్షేమ పథకాలను అందించడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్లకు సూచించారు. సంక్షేమం, అభివృద్ధి రెండు సమాంతరంగా సాగేలా జిల్లా కలెక్టర్లు పనిచేయాలని సీఎం ఉద్ఘాటించారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇంటిస్థలం లేదా ఇల్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఉగాది పండుగ రోజున సామూహిక గృహప్రవేశాల కార్యక్రమాన్ని నిర్వహించి, 2.50 లక్షల మందికి ఇళ్లను అందజేయనున్నట్టు తెలిపారు. జల జీవన్ మిషన్ కింద ప్రతీ ఇంటికీ తాగునీటి కుళాయి కనెక్షన్, ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అందేలా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు.

దీపం 2.0 పథకానికి డిజిటల్ ఓచర్ అంశాన్ని పరిశీలించాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ప్రారంభించిన మహిళలకు ఉచిత బస్సు ‘స్త్రీ శక్తి’ పథకం కింద మార్చి 9 వరకు ఆర్టీసీలో రా 50.45 కోట్ల ప్రయాణాలు చేశారని.. ఇందుకు గానూ రూ.1,775 కోట్లను ప్రభుత్వం రీయింబర్స్ చేసిందని సీఎం వివరించారు. డ్వాక్రా, మెప్మా సంఘాల సహకారంతో పీ4 సహా పేదరిక నిర్మూలన కార్యక్రమాన్ని సమర్థవంతంగా చేపట్టాలని కలెక్టర్లకు సీఎం దిశ నిర్దేశనం చేశారు.

అప్పారావు జివిఎన్

రచయిత గురించిఅప్పారావు జివిఎన్జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన జాతీయ, అంతర్జాతీయ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కథనాలు, రాజకీయాలతో పాటు ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 15 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.గతంలో ప్రముఖ మీడియా సంస్థలో ఎడ్యుకేషన్ డెస్క్‌లో పనిచేశారు. ముఖ్యమైన సందర్భాల్లో లైవ్ బ్లాగ్, లైవ్ పేజీల ద్వారా పాఠకులకు నిరంతరాయంగా సమాచారం అందించిన అనుభవం ఆయనకు ఉంది. లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు టర్మ్‌లు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేశారు. గతంలో రాశి ఫలాలు, ఆధ్యాత్యిక వార్తలు, పండుగలకు సంబంధించిన ప్రత్యేక కథనాలను ఆయన అందించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి జీవీఎన్ అప్పారావు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు.… ఇంకా చదవండి