Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Actress : మగాళ్ల నుంచి నన్ను నేను కాపాడుకోలేకపోయాను.. టాలీవుడ్ నటి కామెంట్స్ వైరల్..

12 March 2026

Hyderabad: హైదరాబాద్ వాసులకు జీహెచ్ఎంసీ బంపర్ ఆఫర్.. ఇప్పుడు కడితే 90శాతం డిస్కౌంట్..

12 March 2026

Tollywood : సరైనోడు సినిమాలో ఆ రోల్ నేను చేయాల్సింది.. కానీ.. షూటింగ్ కు పిలిచి అవమానించారు.. టాలీవుడ్ నటి..

12 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Chandrababu On Ap Ministers Ratings,మంత్రులకు సీఎం చంద్రబాబు రేటింగ్.. చివరి స్థానంలో అనిత, అగ్రస్థానంలో ఎవరున్నారంటే? – cm chandrababu ranks ministers on file clearance atchannaidu at top vangalapudi anitha last andhra pradesh ministers ratings
ఆంధ్రప్రదేశ్

Chandrababu On Ap Ministers Ratings,మంత్రులకు సీఎం చంద్రబాబు రేటింగ్.. చివరి స్థానంలో అనిత, అగ్రస్థానంలో ఎవరున్నారంటే? – cm chandrababu ranks ministers on file clearance atchannaidu at top vangalapudi anitha last andhra pradesh ministers ratings

.By .12 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Chandrababu On Ap Ministers Ratings,మంత్రులకు సీఎం చంద్రబాబు రేటింగ్.. చివరి స్థానంలో అనిత, అగ్రస్థానంలో ఎవరున్నారంటే? – cm chandrababu ranks ministers on file clearance atchannaidu at top vangalapudi anitha last andhra pradesh ministers ratings
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఏపీ మంత్రులకు సంబంధించి తాజాగా సీఎం చంద్రబాబు రేటింగ్స్ ఇచ్చారు. ఈ రేటింగ్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడు తొలి స్థానంలో నిలిచారు. ఇక మరో మంత్రి అనిత చివరి స్థానంలో ఉండటం గమనార్హం. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాలుగో స్థానంలో ఉన్నారు. మంత్రుల పనితీరు ఆధారంగా సీఎం చంద్రబాబు ఈ రేటింగ్స్ విడుదల చేశారు. ఆయా శాఖల్లో ఫైళ్లను ఎంత వేగంగా క్లియర్ చేస్తున్నారు అనే దానిపై ఆధారపడి ఈ రేటింగ్స్ ఇచ్చారు.

AP Ministers
మంత్రులకు సీఎం చంద్రబాబు రేటింగ్(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం.. ఎప్పటికప్పుడు ప్రజలకు అందించాల్సిన సేవలకు సంబంధించి బేరీజు వేసుకుంటోంది. ఈ క్రమంలోనే ప్రజాప్రతినిధుల వద్ద ఫైళ్లు పెండింగ్‌లో ఉండకుండా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే తన మంత్రివర్గంలో ఉన్న అమాత్యులు ఎవరెవరు ఫైళ్లను తొందరగా క్లియర్ చేస్తున్నారు.. ఇంకా ఎవరెవరు పెండింగ్‌లో పెడుతున్నారు అనే దానిపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సంబంధిత శాఖలో ఫైళ్ల క్లియరెన్స్‌ను ఆధారంగా చేసుకుని.. మంత్రులకు రేటింగ్‌లు ఇస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల సమావేశం తొలి రోజున మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆయా శాఖల్లో ఫైళ్ల క్లియరెన్స్ ఎంత వేగంగా జరుగుతోందనే అంశంపై సీఎం చంద్రబాబు అందరు మంత్రులకు రేటింగ్స్ ప్రకటించారు. సీఎం చంద్రబాబు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఫైళ్ల క్లియరెన్స్ అంశంలో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అగ్ర స్థానంలో నిలిచారు. అచ్చెన్నాయుడు తర్వాతి స్థానాల్లో వరుసగా నిమ్మల రామానాయుడు, కొండపల్లి శ్రీనివాస్ ఉన్నారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాలుగో స్థానంలో ఉండడం గమనార్హం.

ఇక ఈ మంత్రుల పనితీరుకు సంబంధించిన రేటింగ్స్‌లో హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత చిట్టచివరి స్థానంలో ఉన్నట్లు చంద్రబాబు లెక్కల ప్రకారం తెలిసింది. ఈ సందర్భంగా తమ శాఖలోని ఫైళ్లను క్లియర్ చేసేందుకు మంత్రులు ఎంత సమయం తీసుకుంటున్నారో వివరంగా వెల్లడించిన సీఎం చంద్రబాబు.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పనులు, తీసుకున్న నిర్ణయాలు వేగంగా పూర్తి అయ్యేలా త్వరగా ఫైళ్లను క్లియరెన్స్ చేయాలని ఈ సందర్భంగా మంత్రులకు సూచించారు. పాలనలో వేగం పెంచడం ద్వారా.. రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన వెల్లడించారు.

మరోవైపు.. సచివాలయంలో కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమావేశం రెండో రోజు కూడా జరగనుంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చలు జరపనున్నారు. ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖపై ప్రత్యేక ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. అలాగే ఆదాయార్జనకు సంబంధించిన శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్ర విద్యా రంగం, రాష్ట్రంలో ఉపాధి అవకాశాలపై కూడా ఈ కలెక్టర్ల సమావేశంలో చర్చించనున్నారు. కోర్టు్ల్లో ఉన్న కేసులు, న్యాయ శాఖ పరిధిలో ఉన్న అంశాలపైనా అధికారులు సీఎంకు వివరాలు అందించనున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించి కూడా సీఎం చంద్రబాబు ప్రత్యేక సమీక్ష చేయనున్నారు. ఈ సమీక్ష కలెక్టర్లు, ఎస్పీలతో కలిసి జరగనుండగా.. ఏపీలో చట్టాన్ని మరింత బలోపేతం చేసే విషయాలపై చర్చ జరపనున్నారు.

శివరామచారి తాటికొండ

రచయిత గురించిశివరామచారి తాటికొండశివరామచారి తాటికొండ సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ట్రెండింగ్ టాపిక్స్ సహా వివిధ అంశాలపై ప్రత్యేక కథనాలు రాస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయం, అంతర్జాతీయం, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తాజా వార్తలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు, విశ్లేషణలను శివరామచారి అందిస్తుంటారు. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వార్తలపై ఫ్యాక్ట్‌చెక్‌ వార్తలు రాసిన అనుభవం ఉంది. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ETV సంస్థలో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. లోక్‌సభతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్‌ (EJS) నుంచి జర్నలిజంలో పీజీ డిప్లొమా పూర్తి చేశారు.… ఇంకా చదవండి