Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Gold Price: బంగారం కొనేవారికి కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈ ఒక్క నిర్ణయంతో భారీగా తగ్గనున్న ధరలు..!

15 March 2026

LPG సిలిండర్లను ఇంట్లో నిల్వ చేసుకుంటున్నారా? జైలు శిక్ష తప్పదు! రూల్స్‌ తెలుసుకోండి!

15 March 2026

ఆ హీరోకు ఐ లవ్యూ చెప్పగానే బ్లాక్ చేశాడు.. అయినా అతనంటే నాకు పిచ్చి అంటున్న బ్యూటీ

15 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Vijayawada Olx Case Ajith Kumar One Sim Rs 1500,రూ.50 విలువైన సిమ్ రూ.1500 కోనుగోలు చేసి.. ఒకసారి వాడిన నంబర్ మరోసారి వాడడు, మనోడి తెలివికి – ajith kumar buy one sim for rs 1500 in olx and other cheating cases reports
ఆంధ్రప్రదేశ్

Vijayawada Olx Case Ajith Kumar One Sim Rs 1500,రూ.50 విలువైన సిమ్ రూ.1500 కోనుగోలు చేసి.. ఒకసారి వాడిన నంబర్ మరోసారి వాడడు, మనోడి తెలివికి – ajith kumar buy one sim for rs 1500 in olx and other cheating cases reports

.By .13 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Vijayawada Olx Case Ajith Kumar One Sim Rs 1500,రూ.50 విలువైన సిమ్ రూ.1500 కోనుగోలు చేసి.. ఒకసారి వాడిన నంబర్ మరోసారి వాడడు, మనోడి తెలివికి – ajith kumar buy one sim for rs 1500 in olx and other cheating cases reports
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Vijayawada Olx Case Ajith Kumar Sims Update: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పోలీసులు ఇటీవల అజిత్‌కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అతడు ఓఎల్‌‌ఎక్స్, గ్రానైట్ వ్యాపారం పేరుతో మోసాలకు పాల్పడ్డాడు. అతడిపై ఏకంగా 32 కేసులు ఉన్నాయి. అయితే నిందితుడు అజిత్ కుమార్ మోసాలకు పాల్పడేందుకు సిమ్‌లను భారీగా కొనుగోలు చేశారు. ఒక్కో సిమ్‌ను ఏకంగా రూ.1500 పెట్టి మరీ కొనుగోలు చేసినట్లు తేలింది.

హైలైట్:

  • విజయవాడలో అజిత్‌కుమార్ అరెస్ట్
  • ఓఎల్‌ఎక్స్, గ్రానైట్ పేరుతో మోసాలు
  • ఒక్కో సిమ్ రూ.1500తో కొనుగోలు
Vijayawada Olx Case Ajith Sims Cheating
విజయవాడ ఓఎల్ఎక్స్ కేసు అజిత్‌కుమార్(ఫోటోలు– Samayam Telugu)
ఏపీలో సంచలనం రేపిన ఓఎల్ఎక్స్ మోసాల కేసులో కీలక విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ కేసులో అరెస్టైన నిందితుడు ఏలూరు జిల్లాకు చెందిన అజిత్‌కుమార్ రూ.50 విలువ చేసే ఒక్కో సిమ్‌ను ఏకంగా రూ.1500 కొనుగోలు చేసి నేరాలకు పాల్పడేవాడు. ఏకంగా నాలుగు రాష్ట్రాల్లో ఓఎల్‌ఎక్స్, గ్రానైట్ వ్యాపారం పేరుతో మోసాలకు పాల్పడ్డాడు. భారీగా సిమ్‌లను కొనుగోలు చేసిన అజిత్ కుమార్.. ఒక్కో సిమ్‌ను ఒక్కో నేరానికి ఉపయోగించేవాడు.. ఆ తర్వాత పక్కన పడేస్తాడు. ఒకసారి సిమ్‌ను వాడాడంటే.. మరోసారి ఆ సిమ్ ఉపయోగించేవాడు కాదు. అజిత్‌ కుమార్‌పై ఆంధ్ర, తెలంగాణతో పాటుగా తమిళనాడు, కర్ణాటకలో మోసాలకు పాల్పడ్డాడు. అతడిపై ఏకంగా 32 కేసులు ఉన్నాయి.. మోసం చేసిన ప్రతిసారి కొత్త సిమ్ ఉపయోగించేవాడు. అజిత్‌కుమార్ క్యాబ్‌లో ప్రయాణిస్తూ.. డ్రైవర్‌తో మాటలు కలిపేవాడు. డబ్బులు ఇస్తానని ఆశపెట్టి సిమ్, బ్యాంకు అకౌంట్ తీసుకునేవాడు. హర్యానాకు చెందిన ఓ వ్యక్తి నుంచి కూడా కొనుగోలు చేశాడు. అజిత్‌కుమార్ ఒక్కో విడతలో 30 నుంచి 40 చొప్పున సిమ్‌లు తీసుకునేవాడు. రూ.50 విలువైన సిమ్‌ను.. రూ.1,500 ఇచ్చి మరీ కొనుగోలు చేసేవాడు.. ఇలా మోసాలకు పాల్పడ్డాడు.

అజిత్‌కుమార్‌పై ఒక్క ఓఎల్‌ఎక్స్‌‌కు సంబంధించి 12 కేసులు నమోదయ్యాయి. మిగిలినవి గ్రానైట్ వ్యాపారం పేరుతో చేసిన మోసాలకు సంబంధించినవి. అజిత్‌కుమార్ ప్రకాశం జిల్లా ఒంగోలులో శ్రీసాయి గ్రానైట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ పేరుతో వ్యాపారం ప్రారంభిచానని చెప్పాడు. గ్రానైట్ వ్యాపారం చేస్తున్నట్లు చెప్పి సరుకు తీసుకునేవాడు.. కానీ ఆ తర్వాత డబ్బులు చెల్లించకుండా ఎగ్గొట్టేవాడు. కొంతమంది దగ్గర గ్రానైట్ పంపిస్తానని చెప్పి అడ్వాన్సులు తీసుకుని మోసం చేసేవాడు. అక్కడ చాలామందిని మోసం చేసి తిరిగి ఏలూరు జిల్లాలోని సొంత ఊరికి వెళ్లాడు. అతడిపై ప్రకాశం జిల్లాలో కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఓఎల్‌ఎక్స్ మోసాలకు పాల్పడ్డాడు. ఇలా మోసాలు చేసి సంపాదించిన డబ్బులతో లగ్జరీ లైఫ్ గడిపేవాడు. ఈ డబ్బుల్ని ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్, క్యాసినోలకు ఖర్చు చేశాడు.

అజిత్‌కుమార్ కార్ల డీలర్‌గా నటిస్తూ OLX ప్లాట్‌ఫారమ్‌లో కార్ల కొనుగోలు–అమ్మకాల పేరుతో మోసం చేశాడు. అతడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు మ్యూల్ బ్యాంక్ ఖాతాల ద్వారా డబ్బు తీసుకుని బంగారం కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాల్లో నగదుగా మార్చుకునేవాడు. పోలీసులు నిందితుడి దగ్గర నుంచి సుమారు రూ.50 లక్షల విలువైన ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో కొనుగోలు/అమ్మకాలు చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులతో డబ్బు లావాదేవీలు చేయకూడదని పోలీసులు సూచించారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి