Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

గ్యాస్‌ ఎఫెక్ట్‌.. అయోధ్యలో భక్తులకు భోజన కష్టాలు

13 March 2026

మీ ఇంట్లో ఇవి ఉంటే దోమలకు చుక్కలే.. అటు వైపు చూడాలన్నా భయపడతాయ్..

13 March 2026

Former DGP HJ Dora Passed Away,HJ Dora: ఏపీ పోలీస్‌కు బ్రాండ్ క్రియేట్ చేశారు.. హెచ్‌జే దొర మృతిపై చంద్రబాబు దిగ్భ్రాంతి.. – combined andhra pradesh former dgp hj dora passed away

13 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Sakhi Niwas For Working Women In Ap,వర్కింగ్ ఉమెన్స్‌కు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. కొత్తగా సఖీ నివాస్.. కేబినెట్ భేటీలో నిర్ణయం.. – ap government to set up sakhi niwas hostels for working women and cabinet decisions
ఆంధ్రప్రదేశ్

Sakhi Niwas For Working Women In Ap,వర్కింగ్ ఉమెన్స్‌కు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. కొత్తగా సఖీ నివాస్.. కేబినెట్ భేటీలో నిర్ణయం.. – ap government to set up sakhi niwas hostels for working women and cabinet decisions

.By .13 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Sakhi Niwas For Working Women In Ap,వర్కింగ్ ఉమెన్స్‌కు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. కొత్తగా సఖీ నివాస్.. కేబినెట్ భేటీలో నిర్ణయం.. – ap government to set up sakhi niwas hostels for working women and cabinet decisions
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


AP Cabinet Decisions Today: ఏపీ కేబినెట్ భేటీలో వర్కింగ్ ఉమెన్స్‌కు శుభవార్త వినిపించారు. పనిచేసే మహిళల కోసం సఖీ నివాస్ పేరుతో హాస్టళ్లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. మిషన్ శక్తి కింద ఈ హాస్టళ్లు ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు అమరావతిలో భూకేటాయింపులు, సూక్ష్మ పరిశ్రమలకు ఆర్థిక ప్రోత్సాహం, సీఆర్డీఏ నిర్ణయాలకు ఆమోదం వంటి నిర్ణయాలను ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో తీసుకున్నారు.

AP Cabinet sakhi hostels
పనిచేసే మహిళలకు సఖీ నివాస్ హాస్టళ్లు(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేసే వర్కింగ్ ఉమెన్స్‌కు శుభవార్త వినిపించింది. పనిచేసే మహిళల కోసం సఖీ నివాస్ పేరుతో హాస్టళ్లు ఏర్పాటు చేయనుంది. మిషన్ శక్తి కింద క్రెచ్ సౌకర్యాలతో ఈ హాస్టళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఏపీ కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ శుక్రవారం జరిగింది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సచివాలయం, హెచ్‌ఓడీ టవర్ల నిర్మాణాలకు ఆమోదం తెలిపింది. వివిధ రకాల పనుల కోసం2,316 కోట్ల రూపాయలతో పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. 119 కోట్ల రూపాయల వ్యయంతో తెలుగు కల్చరల్ సెంటర్‌ నిర్మించే ప్రతిపాదనకు ఏపీ కేబినెట్ పచ్చజెండా ఊపింది.

రాజధాని అమరావతిలో పలు సంస్థలకు భూకేటాయింపుల విషయంలో మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 3,500 సూక్ష్మ పరిశ్రమలకు ఆర్థిక వనరులు కల్పించే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఈ సంస్థలకు రూ.300 కోట్లు ఆర్థిక వనరులు కల్పించనున్నారు. ఎఫ్‌ఆర్‌ఏ పట్టాదారులకు రాయితీలు, 300 హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్టులను రిజర్వ్‌ ఎస్ఐ పోస్టులుగా అప్‌గ్రేడ్ చేయటం వంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే మిషన్ శక్తి కార్యక్రమం కింద పనిచేసే మహిళల కోసం సఖీ నివాస్ పేరుతో హాస్టళ్లు ఏర్పాటుచేయాలనే ప్రతిపాదనకు మంత్రిమండలిలో ఆమోదం తెలిపారు.

మరోవైపు నగరాలకు వచ్చే యువతులు వసతి కోసం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సఖీ నివాస్ పేరుతో వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్ల ఏర్పాటు చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు వీటిలో ప్రాధాన్యం ఇస్తారు. ఈ క్రమంలోనే ఏపీలోనూ వీటిని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి యువతులు ఉద్యోగ, ఉపాధి, చదువుల కోసం నగరాలకు వస్తుంటారు.

ఇలాంటివారికి ఆర్థికంగా కాస్త ఉపయోగపడేలా , అలాగే భద్రత కల్పించేలా ఈ సఖీ నివాస్ హాస్టళ్లు ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఏపీలో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి ప్రాంతాలకు సమీప గ్రామీణ ప్రాంతాల నుంచి యువతులు వస్తుంటారు. అలాంటి వారికి ఈ హాస్టళ్లు ఉపయోగకరంగా ఉండనున్నాయి.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి