Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

OTT Movie: ఓటీటీని షేక్ చేస్తోన్న చిన్న సినిమా.. యూత్ మళ్లీ మళ్లీ చూసేస్తున్నారు.. ఐఎమ్‌డీబీలోనూ టాప్ రేటింగ్

13 March 2026

Allu Arjun: బన్నీ సినిమా నుంచి అవాక్కయ్యే లాంటి అప్డేట్

13 March 2026

Andhra News: చూసి అమాయకుడు అనుకునేరు.. ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

13 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Bits Pilani Amaravati Campus,Amaravati BITS Campus: అమరావతిలో బిట్స్ పిలానీ.. 2 దశల్లో 7 వేలమంది విద్యార్థులకు అవకాశం.. – minister nara lokesh reviews amaravati bits pilani campus construction plans
ఆంధ్రప్రదేశ్

Bits Pilani Amaravati Campus,Amaravati BITS Campus: అమరావతిలో బిట్స్ పిలానీ.. 2 దశల్లో 7 వేలమంది విద్యార్థులకు అవకాశం.. – minister nara lokesh reviews amaravati bits pilani campus construction plans

.By .13 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Bits Pilani Amaravati Campus,Amaravati BITS Campus: అమరావతిలో బిట్స్ పిలానీ.. 2 దశల్లో 7 వేలమంది విద్యార్థులకు అవకాశం.. – minister nara lokesh reviews amaravati bits pilani campus construction plans
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Amaravati Bits Pilani campus plans: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో బిట్స్ పిలానీ క్యాంపస్ ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ బిట్స్ పిలానీ క్యాంపస్ నిర్మాణ ప్లాన్లు పరిశీలించారు. ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్‌ ఎదుట నిర్మాణ ప్లాన్లు ప్రదర్శించారు బిట్స్ ప్రతినిధులు. ఈ నేపథ్యంలో నిర్మాణ ప్లాన్లపై సంతృప్తి వ్యక్తం చేశారు నారా లోకేష్. వీలైనంత త్వరగా నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

Amaravati Bits Pilani campus
అమరావతి బిట్స్ పిలానీ క్యాంపస్(ఫోటోలు– Samayam Telugu)
ఏపీ రాజధాని అమరావతిలో మరో ప్రతిష్టాత్మక నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. అమరావతిలో చేపడుతున్న బిట్స్‌పిలానీ ఏఐ ప్లస్ క్యాంపస్ నిర్మాణ ప్రణాళికలను ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శుక్రవారం పరిశీలించారు. ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్‌ను కలిసిన బిట్స్‌పిలానీ ప్రతినిధులు.. బిట్స్ ఏఐ క్యాంపస్ ప్లాన్‌లను చూపించారు. డిజైన్ల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, రోబోటిక్స్, కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ వంటి కోర్సులు అమరావతి బిట్స్ పిలానీ క్యాంపస్‌లో ఉంటాయని బిట్స్ పిలానీ సంస్థ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్‌కు వివరించారు.

అమరావతి క్యాంపస్ ద్వారా రెండు దశలలో ఏడువేల మంది విద్యార్థులకు అవకాశం కల్పించేలా నిర్మాణాలు చేపడుతున్నట్లు బిట్స్ పిలానీ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. వచ్చే ఐదేళ్లలో అమరావతి బిట్స్‌పిలానీ క్యాంపస్ మీద రూ.1000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు వివరించారు. నెక్ట్స్ జెన్ టెక్నాలజీలతో క్యాంపస్ నిర్మిస్తున్నామని.. ఇప్పటికే పనులు ప్రారంభమైనట్లు నారా లోకేష్‌కు వివరించారు. గ్రీన్ బిల్డింగ్, రెన్యువబుల్ ఎనర్జీ వంటి పర్యావరణహిత విధానాలను క్యాంపస్ నిర్మాణంలో అనుసరిస్తున్నట్లు తెలిపారు. అమరావతి బిట్స్‌పిలానీ క్యాంపస్ దేశంలోనే మొదటి ఏఐ క్యాంపస్‌గా ఉంటుందని వెల్లడించారు.

అగ్రికల్చర్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, వాతావరణం, ఆరోగ్య సంరక్షణ వంటి కోర్సులు అమరావతి బిట్స్‌ క్యాంపస్‌లో ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి నారా లోకేష్‌కు బిట్స్ పిలానీ ప్రతినిధులు వివరించారు. నిర్మాణ ప్లాన్లపై సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి నారా లోకేష్.. సాధ్యమైనంత త్వరగా అమరావతి క్యాంపస్ ప్రారంభమయ్యేలా చూడాలని కోరారు.

అమరావతిలో అగ్నిమాపక కేంద్ర నిర్మాణానికి భూమిపూజ

మరోవైపు అమరావతిలో అగ్నిమాపక కేంద్రం నిర్మాణానికి శుక్రవారం భూమిపూజ నిర్వహించారు.అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌లోని నేలపాడులో 50 సెంట్ల స్థలంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. దీని నిర్మాణానికి శుక్రవారం రోజు ఉదయం ఫైర్ సర్వీసెస్ డీ.జీ. పీ.వీ.రమణ చేతుల మీదుగా భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు.

రూ.1.28 కోట్ల అంచనా వ్యయంతో ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అమరావతిలో అగ్నిమాపక కేంద్రం నిర్మించనుంది. నేలపాడులో ఏర్పాటు కానున్న ఈ అగ్నిమాపక కేంద్రాన్ని ఈ ఏడాది నవంబర్ నాటికి పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి