Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

IPL 2026 : ఐపీఎల్ మొదలవ్వకముందే వికెట్ డౌన్.. ఢిల్లీ జట్టును వీడిన ఇంగ్లాండ్ దిగ్గజం

14 March 2026

Child Hair Care: వారానికి 2 సార్లు ఈ నూనెతో మసాజ్ చేస్తే చాలు.. పిల్లల జుట్టు పెరుగుదలకు తిరుగుండదు!

14 March 2026

కర్ణాటకలో ఎగ్జిబిటర్స్‌ కీలక సమావేశం. ఓటీటీ రిలీజ్‌కు 8 వారాల గడువు ఉండాల్సిందే

14 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Tirumala Asthanams,తిరుమల: శ్రీవారి ఆలయంలో ఒకే నెలలో మూడు ఆస్థానాలు – three asthanams in march month in tirumala temple due to ugadi and sri rama navami
ఆంధ్రప్రదేశ్

Tirumala Asthanams,తిరుమల: శ్రీవారి ఆలయంలో ఒకే నెలలో మూడు ఆస్థానాలు – three asthanams in march month in tirumala temple due to ugadi and sri rama navami

.By .14 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Tirumala Asthanams,తిరుమల: శ్రీవారి ఆలయంలో ఒకే నెలలో మూడు ఆస్థానాలు – three asthanams in march month in tirumala temple due to ugadi and sri rama navami
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడుసార్లు ఆస్థానాలు నిర్వహించనున్నారు. ఉగాది, శ్రీరామనవమిని పురస్కరించుకుని మూడుసార్లు ఆస్థానాలు జరగనున్నాయి. మార్చి 19న ఉగాది ఆస్థానం, మార్చి 27న శ్రీరామనవమి ఆస్థానం, మార్చి 28న పట్టాభిషేక ఆస్థానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించనుంది. మరోవైపు అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలోని పట్టాభిరామస్వామి ఆలయంలో మార్చి 24 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 17న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది.

Tirumala asthanams
శ్రీవారి ఆలయంలో ఆస్థానాలు(ఫోటోలు– Samayam Telugu)
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. మార్చి నెలలో తిరుమలలో మూడు ఆస్థానాలు నిర్వహించనున్నారు. ఉగాది , శ్రీరామనవమి పండుగల సందర్భంగా మార్చి నెలలో మూడుసార్లు ఆస్థానాలు నిర్వహించనుంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఆలయంలో సంప్రదాయబద్ధంగా నిర్వహించే ఆలయ దర్బారునే ఆస్థానం అని పిలుస్తారు. తిరుమలలో ప్రత్యేక పర్వదినాలలోఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ. మరోవైపు మార్చి 19వ తేదీ ఉగాది పర్వదినం. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఆరోజున మూలవిరాట్, ఉత్సవమూర్తులకు కొత్త వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం వేదపండితులు పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఉగాది ఆస్థానంజరుగుతుంది.

మరోవైపు మార్చి 27వ తేదీన శ్రీరామనవమి పండుగ సందర్భంగా గరుడాళ్వార్ సన్నిధిలో ఆస్థానం నిర్వహిస్తారు. రాత్రి 9 నుంచి 10 గంటల వరకు ఆస్థానం జరగనుంది. శ్రీరామనవమి పండుగ పూర్తైన తర్వాతి రోజు అంటే మార్చి 28వ తేదీ రాత్రి 8 నుంచి 9 గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో పట్టాభిషేక ఆస్థానం జరుగుతుంది. ఈ సందర్భంగా వేదపండితులు శ్రీరామచంద్రుని పట్టాభిషేక ఘట్టాన్ని పఠిస్తారు.

పట్టాభిరామస్వామి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

అన్నమయ్య జిల్లాలోని వాల్మీకిపురంలో కొలువైన పట్టాభిరామస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. మార్చి 24వ తేదీ నుంచి ఏప్రిల్ రెండో తేదీ వరకూ పట్టాభిరామస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మార్చి17వ తేదీ ఉదయం పట్టాభిరామస్వామి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామిని మేలుకొలుపుతారు. అనంతరం తోమాలసేవ, సహస్రనామార్చన వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తారు.

పట్టాభిరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు మార్చి 23ను అంకురార్పణ జరగనుంది. ఆ రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి 9 గంటల వరకూ అంకురార్పణ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సేనాధిపతి ఉత్సవం, మేదిని పూజ, మృత్సంగ్రహణం వంటి కార్యక్రమాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి