
టీవీ9 క్రాస్ ఫైర్ ఇంటర్వ్యూలో వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఏపీ రాజకీయాల్లో తన ఫేవరెట్ రాజకీయ నాయకుడి ఎవరనేది తెలిపారు.ఈ ఇంటర్వ్యూలో అంబటి రాంబాబు తమ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పట్ల ఉన్న గౌరవాన్ని తెలిజయేశారు. గత ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ, తమ పార్టీ తీసుకొచ్చిన నవరత్నాలు పథకాలు ప్రజలకు చేరాయని, వాటిని బ్రాండెడ్ కమిట్మెంట్గా తాము దరించే షర్ట్పై వేసుకోవడం తన లక్షణమని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే నిష్పక్షపాతంగా ఏపీ రాజకీయాల్లో తనకు బాగా నచ్చిన రాజకీయ నాయకుడు ఎవరు అన్న ప్రశ్నకు సమాధానంగా, ఆయన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పేరును వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఉండవల్లి అరుణ్ కుమార్ చాలాసార్లు విమర్శించినప్పటికీ, ఆయన నిబద్ధత, నిజాయితీ, సింప్లిసిటీ తనకు ఎంతో ఇష్టమని అంబటి రాంబాబు తెలిపారు. రెండుసార్లు ఎంపీగా పనిచేసి, సోనియా గాంధీకి సన్నిహితంగా ఉన్నప్పటికీ, ఆయన సరళమైన జీవనశైలిని అంబటి రాంబాబు ప్రశంసించారు. ప్రస్తుత రాజకీయాల్లో అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

