Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

కాకి ఒక్క కన్నుతోనే చూస్తుందా..? శ్రీరాముడు కాకిపై బ్రహ్మాస్త్రం ఎందుకు ప్రయోగించాడు? అసలు కథ ఏమిటి!

16 March 2026

Gambhir: టీమిండియాలో అతడే యమా డేంజర్.. 6 ఓవర్లు ఉంటే వార్ వన్ సైడే.!

16 March 2026

Ap 10th Class Exams,10th class exams: పదో తరగతి పరీక్షా కేంద్రంలోకి పాము.. బయటకు పరుగులు తీసిన విద్యార్థులు – snake enter into 10th class public exam hall in b koduru in kadapa district

16 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»58 Feet Bronze Potti Sriramulu Statue,అమరావతిలో పొట్టి శ్రీరాములు భారీ కాంస్య విగ్రహం.. స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్.. ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు – statue of sacrifice 58 feet bronze potti sriramulu statue unveiled in amaravati by cm chandrababu 125th jayanti
ఆంధ్రప్రదేశ్

58 Feet Bronze Potti Sriramulu Statue,అమరావతిలో పొట్టి శ్రీరాములు భారీ కాంస్య విగ్రహం.. స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్.. ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు – statue of sacrifice 58 feet bronze potti sriramulu statue unveiled in amaravati by cm chandrababu 125th jayanti

.By .16 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
58 Feet Bronze Potti Sriramulu Statue,అమరావతిలో పొట్టి శ్రీరాములు భారీ కాంస్య విగ్రహం.. స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్.. ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు – statue of sacrifice 58 feet bronze potti sriramulu statue unveiled in amaravati by cm chandrababu 125th jayanti
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం ఆవిష్కృతం అయింది. 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని తాజాగా సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఇక ఈ విగ్రహానికి స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ అని పేరు పెట్టారు. కేవలం ఆరు నెలల్లోనే ఈ విగ్రహాన్ని నిర్మించారు. మ్యూజియం, ఆడిటోరియం, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను కూడా అక్కడ నిర్మించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Potti Sriramulu statue
అమరావతిలో స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించడం కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి.. ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు ప్రారంభోత్సవాలు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరులో పొట్టి శ్రీరాములు 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇవాళ ఆవిష్కరించారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం పొట్టి శ్రీరాములు 58 రోజులు నిరాహార దీక్ష చేపట్టగా.. అందుకు గుర్తుగా.. 58 అడుగుల విగ్రహాన్ని తయారు చేయించారు. తొలి దశ పనులు పూర్తి కాగా.. రెండో దశలో మరిన్ని పనులు చేపట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ విగ్రహానికి స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్‌గా నామకరణం చేశారు.

పొట్టి శ్రీరాములు మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో తుళ్లూరు సమీపంలోని శాఖమూరులో 6.8 ఎకరాల్లో నిర్మించిన ఈ స్మృతివనంలో పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవాలను భారీ స్థాయిలో నిర్వహించేందుకు ఆర్యవైశ్య సంఘాలు, ట్రస్ట్‌ ఆధ్వర్యంలో విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. ఇక ఈ 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం కోసం 26 టన్నుల కాంస్యం.. 42 టన్నుల ఐరన్ స్ట్రక్చర్‌ను ఉపయోగించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని.. కేవలం 6 నెలల్లోనే మొదటి దశ పనులను పూర్తి చేయడం గమనార్హం.

ఇక తొలి విడతలో పొట్టి శ్రీరాములు స్మృతివనం అభివృద్ధి చేసి కేవలం విగ్రహాన్ని నిర్మించడం మాత్రమే కాకుండా.. రెండో దశలో ఇంకొన్న వసతులు కల్పించనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఇందులో భాగంగానే.. ఈ పొట్టి శ్రీరాములు స్మృతివనంలో అత్యాధునిక మ్యూజియంతోపాటు.. ఆడిటోరియం, యువత కోసం స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రాన్ని సాధించడం కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాన్ని స్మరించుకుంటూ.. రాబోయే తరాలకు కూడా ఆయన ఆశయాలను చాటిచెప్పేలా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు.

పొట్టి శ్రీరాములు ఆత్మబలిదానం వల్లే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని.. సీఎం చంద్రబాబు కొనియాడారు. పొట్టి శ్రీరాములు గౌరవార్థం రాజధాని ఈ భారీ కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టించడం ఏపీ ప్రజలందరికీ గర్వకారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్‌, నారాయణ, నాదెండ్ల మనోహర్, టీజీ భరత్, సవితలతో పాటు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారు. బీజేపీ నేత మాధవ్, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ హాజరయ్యారు.

శివరామచారి తాటికొండ

రచయిత గురించిశివరామచారి తాటికొండశివరామచారి తాటికొండ సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ట్రెండింగ్ టాపిక్స్ సహా వివిధ అంశాలపై ప్రత్యేక కథనాలు రాస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయం, అంతర్జాతీయం, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తాజా వార్తలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు, విశ్లేషణలను శివరామచారి అందిస్తుంటారు. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వార్తలపై ఫ్యాక్ట్‌చెక్‌ వార్తలు రాసిన అనుభవం ఉంది. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ETV సంస్థలో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. లోక్‌సభతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్‌ (EJS) నుంచి జర్నలిజంలో పీజీ డిప్లొమా పూర్తి చేశారు.… ఇంకా చదవండి