Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Song Controversy : ఛీ ఛీ.. ఇదేం సాంగ్.. మరీ ఇంత నీచంగా తీస్తారా.. ? నోరా ఫతేహి పాటపై విమర్శలు..

17 March 2026

Business Idea: యూట్యూబ్‌లో చూసి డైరీ ఫారం పెడుతున్నారా? ముందు ఇవి తెలుసుకోండి.. ఫీజులు ఎగిరిపోతాయ్‌!

17 March 2026

భూమి కొనాలా? స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేయాలా? నిపుణుల సూచన ఇదే!

17 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra Pradesh Property Tax 50% Discount,ఏపీ ప్రజలకు అద్భుత అవకాశం.. ఆస్తిపన్ను కడితే వడ్డీలో 50శాతం డిస్కౌంట్ – andhra pradesh government announced 50 precent interest subsidy on property tax dues 2026
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh Property Tax 50% Discount,ఏపీ ప్రజలకు అద్భుత అవకాశం.. ఆస్తిపన్ను కడితే వడ్డీలో 50శాతం డిస్కౌంట్ – andhra pradesh government announced 50 precent interest subsidy on property tax dues 2026

.By .17 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra Pradesh Property Tax 50% Discount,ఏపీ ప్రజలకు అద్భుత అవకాశం.. ఆస్తిపన్ను కడితే వడ్డీలో 50శాతం డిస్కౌంట్ – andhra pradesh government announced 50 precent interest subsidy on property tax dues 2026
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


AP Property Tax Interest 50% Waiver Scheme: ఏపీ ప్రభుత్వం ప్రజలకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఇంటి పన్ను చెల్లింపై భారీగా రాయితీని ప్రకటించింది. ఆస్తిపన్ను బకాయిలపై వడ్డీలో 50 శాతం రాయితీ ఇస్తోంది. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం ప్రతి ఏటా 50శాతం రాయితీని ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా ఆ అవకాశాన్ని కల్పించింది.

హైలైట్:

  • ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
  • ఆస్తి పన్ను వడ్డీలో 50శాతం రాయితీ
  • ఈ నెలాఖరులోపు చెల్లించేవారికి
AP Govt House Tax 50% Discount
ఏపీలో ఆస్తి పన్నుపై 50శాతం రాయితీ(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు బంపరాఫర్ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో ఆస్తిపన్ను బకాయిలపై వడ్డీలో 50 శాతం రాయితీ ఇస్తోంది. ఈ నెలాఖరులోగా ఆస్తిపన్ను బకాయిలను కనుక చెల్లిస్తే.. ఆ బకాయిలపై విధించే వడ్డీలో ఏకంగా 50 శాతం రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొన్నటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లు ఈ బకాయిలను వడ్డీతో వసూలు చేసేవి. అయితే ఆర్థిక సంవత్సరం ముగియనుండటంతో ప్రతి ఏటా ఇచ్చినట్లుగానే ఈసారి కూడా వడ్డీలో 50శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు.. ఈ మేరకు వడ్డీ తగ్గింపు ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో ఆస్తి పన్నులు పేరుకుపోయాయి.. ఆ బకాయిలను వసూలు చేసేందుకు వడ్డీని మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ జీవో నంబర్ 58ను 16-03-2026 తేదీన విడుదల చేసింది. ఈ పథకం ద్వారా వేలాది మంది పన్ను చెల్లింపుదారులకు ఊరట లభించనుంది. గతేడాది మార్చిలో కూడా ఏపీ ప్రభుత్వం ఆస్తిపన్నుపై వడ్డీలో 50 శాతం రాయితీ ప్రకటించింది. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో ఈ ఏడాది కూడా 50శాతం రాయితీ ప్రకటించారు.

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 86 మున్సిపల్, కార్పొరేషన్లలో పాలకవర్గాల పదవీకాలం నేటితో ముగుస్తోంది. బుధవారం నుంచి ప్రత్యేక అధికారుల పాలన పూర్తిస్థాయిలో ప్రారంభమవుతుంది. గత ప్రభుత్వ హయాంలో 2021 మార్చిలో ఎన్నికలు నిర్వహించారు.. అప్పటి ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో పాలకవర్గాలు కొలువుదీరాయి. వీరి పదవీకాలంలో నేటితో ముగుస్తోంది.. ప్రభుత్వం ఈ మేరకు వారం క్రితమే ప్రత్యేక అధికారులను నియమించిన సంగతి తెలిసిందే. ఇవాళ, బుధవారాల్లో అధికారులు బాధ్యతలు చేపట్టనున్నారు. కార్పొరేషన్‌లలో ప్రత్యేక అధికారులుగా కలెక్టర్లు, మున్సిపాలిటీల్లో జాయింట్‌ కలెక్టర్లు, ఆర్డీవోలను ప్రత్యేక అధికారుల్ని నియమించింది. ఏలూరు కార్పొరేషన్ పాలకవర్గం పదవీ కాలం మాత్రం ఈ ఏడాది జులై 29తో ముగుస్తుంది. మరికొన్ని మున్సిపాలిటీలు,నగర పంచాయతీల్లో పాలకవర్గాల పదవీ కాలం ఈ ఏడాది నవంబరు 21తో ముగియనుంది.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి