Kothapatnam Tenth Exam Student Oxygen Cylinder: ప్రకాశం జిల్లా కొత్తపట్నానికి చెందిన విద్యార్థి పదో తరగతి పరీక్షకు ఆక్సిజన్ సిలిండర్, మాస్క్తో వచ్చారు. ఆక్సిజన్ మాస్క్ ఉంచుకుని మరి పరీక్ష రాశారు. కౌశిక్ కొంతకాలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నాడు. డాక్టర్లు ఊపిరితిత్తులు మార్పిడి చేయాలని సూచించారు. అయితే రూ.50 లక్షల ఖర్చవుతుందని చెప్పారు. అయితే విద్యార్థి కుటుంబానికి అంత ఆర్థిక స్థోమత లేదు. పరీక్షలు రాయాలనే సంకల్పంతో సిలిండర్తో వచ్చి పరీక్ష రాశారు.
హైలైట్:
- ఏపీలో ప్రారంభమైన పదోతరగతి పరీక్షలు
- ఆక్సిజన్ సిలిండర్, మాస్క్తో వచ్చిన విద్యార్థి
- ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నాడు

మరోవైపు కర్నూలులో పదో తరగతి పబ్లిక్ పరీక్ష కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. నిడ్జూరు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు షేక్ అన్వర్బాషా గుండెపోటుతో పరీక్ష కేంద్రంలోనే కుప్పకూలి చనిపోయారు. మాధవనగర్లోని ఓ స్కూల్లో పదో తరగతి పరీక్షా కేంద్రానికి ఆయన్ను చీఫ్ సూపరింటెండెంట్గా నియమించారు. ఆయన సోమవారం ఉదయం డ్యూటీలో ఉన్న సమయంలో గుండెనొప్పి రావడంతో కుప్పకూలారు. వెంటనే ఆయనను దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. కానీ అక్కడ చికిత్సపొందుతూ చనిపోయాడు. హెడ్మాస్టర్ అన్వర్ బాషా కర్నూలులోని అబ్బా్సనగర్లో నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య హతియాబేగం, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్య హతియాబేగం కూడా టీచర్ కాగా.. ఆమె స్టాం టన్పురం ప్రాథమిక ఉర్దూ పాఠశాలలో ఎస్జీటీగా పని చేస్తున్నారు. అన్వర్ బాషా మరణంతో విషాదచాయలు అలముకున్నాయి.. ఆయన మరణంపై తోటి టీచర్లు సంతాపాన్ని తెలిపారు.


