Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

AP PGCET 2026: ఏపీ పీజీసెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు పెంపు.. ఎప్పటివరకంటే?

19 March 2026

వసంత నవరాత్రులు స్టార్ట్! ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు ఇలా చేస్తే ధనలక్ష్మి మీ ఇంట్లోనే ఉంటుంది!

19 March 2026

Dhurandhar 2: ధురంధర్ 2లో ప్రధాని మోదీ గురించి సర్‌ప్రైజింగ్ సీన్స్…

19 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Student Oxygen Cylinder To Exam,ఆక్సిజన్ సిలిండర్‌, మాస్క్‌తో పరీక్ష రాసిన పదోతరగతి విద్యార్థి.. ఎంత పెద్ద కష్టం వచ్చింది పాపం – tenth class student attended to exam with oxygen cylinder due to breathing problems in kothapatnam prakasam district
ఆంధ్రప్రదేశ్

Student Oxygen Cylinder To Exam,ఆక్సిజన్ సిలిండర్‌, మాస్క్‌తో పరీక్ష రాసిన పదోతరగతి విద్యార్థి.. ఎంత పెద్ద కష్టం వచ్చింది పాపం – tenth class student attended to exam with oxygen cylinder due to breathing problems in kothapatnam prakasam district

.By .17 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Student Oxygen Cylinder To Exam,ఆక్సిజన్ సిలిండర్‌, మాస్క్‌తో పరీక్ష రాసిన పదోతరగతి విద్యార్థి.. ఎంత పెద్ద కష్టం వచ్చింది పాపం – tenth class student attended to exam with oxygen cylinder due to breathing problems in kothapatnam prakasam district
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Kothapatnam Tenth Exam Student Oxygen Cylinder: ప్రకాశం జిల్లా కొత్తపట్నానికి చెందిన విద్యార్థి పదో తరగతి పరీక్షకు ఆక్సిజన్ సిలిండర్, మాస్క్‌తో వచ్చారు. ఆక్సిజన్ మాస్క్ ఉంచుకుని మరి పరీక్ష రాశారు. కౌశిక్ కొంతకాలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నాడు. డాక్టర్లు ఊపిరితిత్తులు మార్పిడి చేయాలని సూచించారు. అయితే రూ.50 లక్షల ఖర్చవుతుందని చెప్పారు. అయితే విద్యార్థి కుటుంబానికి అంత ఆర్థిక స్థోమత లేదు. పరీక్షలు రాయాలనే సంకల్పంతో సిలిండర్‌తో వచ్చి పరీక్ష రాశారు.

హైలైట్:

  • ఏపీలో ప్రారంభమైన పదోతరగతి పరీక్షలు
  • ఆక్సిజన్ సిలిండర్, మాస్క్‌తో వచ్చిన విద్యార్థి
  • ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నాడు
Kothapatnam Tenth Exam Hall Oxygen Cylinder
కొత్తపట్నం ఆక్సిజన్ సిలిండర్‌తో పరీక్షకు(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఓ విద్యార్థి ఆక్సిజన్ సిలిండర్‌తో వచ్చి మాస్క్ పెట్టుకుని పరీక్ష రాశాడు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం పాదర్తికి చెందిన కట్టా కౌశిక్‌చంద్‌.. కొత్తపట్నం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రంలో సోమవారం పదో తరగతి తెలుగు పరీక్షకు హాజరయ్యాడు. ఆక్సిజన్‌ సిలిండర్‌తో మాస్క్ ముక్కుకు తగిలించుకుని ఆక్సిజన్‌ తీసుకుంటూ పరీక్ష రాశాడు. కౌశిక్‌కు ఊపిరితిత్తుల సమస్యతో ఇబ్బందిపడుతున్నాడు. కౌశిక్‌ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి ఊపిరితిత్తులు మార్చిడి చేయాలని డాక్టర్లు సూచించారు. అయితే కిడ్నీల మార్పిడికి రూ.50 లక్షలకుపైగా ఖర్చవుతుందని చెప్పడంతో.. కౌశిక్ తల్లిదండ్రులకు అంత ఖర్చు భరించే స్థోమత లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఇంటి దగ్గర తాత్కాలికంగా వైద్యం చేయిస్తున్నారు. స్థానిక ప్రైవేట్‌ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు.. అయితే పబ్లిక్‌ పరీక్షలు రాయాలని బాలుడు నిర్ణయించుకున్నాడు. ఎంత కష్టమైనా సరే పరీక్షలు రాయాలని భావించాడు. వెంటనే అధికారుల అనుమతి తీసుకుని ఆక్సిజన్‌ సిలిండర్‌ను పరీక్ష హాలులోకి తీసుకు వచ్చి మరీ పరీక్షలు రాస్తున్నాడు.

మరోవైపు కర్నూలులో పదో తరగతి పబ్లిక్‌ పరీక్ష కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. నిడ్జూరు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు షేక్‌ అన్వర్‌బాషా గుండెపోటుతో పరీక్ష కేంద్రంలోనే కుప్పకూలి చనిపోయారు. మాధవనగర్‌లోని ఓ స్కూల్‌‌లో పదో తరగతి పరీక్షా కేంద్రానికి ఆయన్ను చీఫ్‌ సూపరింటెండెంట్‌గా నియమించారు. ఆయన సోమవారం ఉదయం డ్యూటీలో ఉన్న సమయంలో గుండెనొప్పి రావడంతో కుప్పకూలారు. వెంటనే ఆయనను దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. కానీ అక్కడ చికిత్సపొందుతూ చనిపోయాడు. హెడ్‌మాస్టర్ అన్వర్‌ బాషా కర్నూలులోని అబ్బా్‌సనగర్‌లో నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య హతియాబేగం, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్య హతియాబేగం కూడా టీచర్ కాగా.. ఆమె స్టాం టన్‌పురం ప్రాథమిక ఉర్దూ పాఠశాలలో ఎస్‌జీటీగా పని చేస్తున్నారు. అన్వర్ బాషా మరణంతో విషాదచాయలు అలముకున్నాయి.. ఆయన మరణంపై తోటి టీచర్లు సంతాపాన్ని తెలిపారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి