Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

అసలు కలలు ఎందుకు వస్తాయి.. మెదడులో ఏం జరుగుతుందో తెలిస్తే మైండ్ బ్లాంకే..

19 March 2026

మండే వేసవిలో పవర్‌ఫుల్ రొమాన్స్ పండు.. తిన్నారంటే ఈ సమస్యలన్నీ ఫసక్..

19 March 2026

Viral: కట్టె పుల్లలు అనుకుంటివా అప్ప.. అవన్నీ పాములప్ప.. ధైర్యం ఉంటేనే వీడియో చూడండి..

19 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ap Junior Colleges To Reopen From April 1st,ఏపీలో ఇంటర్ విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటన.. కాకపోతే ఏప్రిల్‌ 1 నుంచి కాలేజీ రీ ఓపెన్, క్లాస్‌లు – andhra pradesh intermediate board released academic calendar for 2026 2027 and summer holidays for students
ఆంధ్రప్రదేశ్

Ap Junior Colleges To Reopen From April 1st,ఏపీలో ఇంటర్ విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటన.. కాకపోతే ఏప్రిల్‌ 1 నుంచి కాలేజీ రీ ఓపెన్, క్లాస్‌లు – andhra pradesh intermediate board released academic calendar for 2026 2027 and summer holidays for students

.By .19 March 2026No Comments1 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ap Junior Colleges To Reopen From April 1st,ఏపీలో ఇంటర్ విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటన.. కాకపోతే ఏప్రిల్‌ 1 నుంచి కాలేజీ రీ ఓపెన్, క్లాస్‌లు – andhra pradesh intermediate board released academic calendar for 2026 2027 and summer holidays for students
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Andhra Pradesh Junior Colleges To Reopen From 1st April: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్ బోర్డు 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. , కాలేజీలు అనుసరించాల్సిన ముఖ్యమైన తేదీలను ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి సెకండియర్ విద్యార్థులకు క్లాసులు నిర్వహిస్తారు. ఏప్రిల్ 23 వరకు తరగతులు కొనసాగుతాయి. ఆ తర్వాత ఏప్రిల్ 24 నుంచి మే 31 వరకు విద్యార్థులకు వేసవి సెలవులు ఇస్తారు.

హైలైట్:

  • ఏపీ ఇంటర్ బోర్డ్ అకడమిక్ క్యాలెండర్ విడుదల
  • ఏప్రిల్ 1నుంచి సెకండియర్ క్లాసులు ప్రారంభం
  • ఏప్రిల్ 24 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు
AP Junior Colleges To Reopen
ఏపీలో 1 నుంచి జూనియర్‌ కళాశాలల పునఃప్రారంభం(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్‌ కాలేజీలకు సంబంధించి వేసవి సెలవులపై క్లారిటీ వచ్చింది. ఇంటర్మీడియట్‌ ఫస్టియర్ పరీక్షలు రాసి సెకండియర్‌లోకి అడుగుపెట్టే విద్యార్థులకు ముఖ్య గమనిక. ఏప్రిల్‌ ఒకటో తేదీన జూనియర్ కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియట్‌ విద్యా మండలి 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి అకడమిక్‌ కేలండర్‌ను విడుదల చేసింది. జూనియర్ కాలేజీల్లో ఏప్రిల్‌ ఒకటి నుంచి 23 వరకు క్లాస్‌లు నిర్వహిస్తారు. ఏప్రిల్ 24 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ప్రకటించారు.2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి మొత్తం 232 రోజులు జూనియర్ కాలేజీలు పని చేయనున్నాయి. ప్రైవేట్ జూనియర్ కాలేజీలు విద్యార్థుల ప్రవేశాలకు సంబంధించి కొన్ని నిబంధనలు పాటించాలని.. పబ్లిక్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత, ర్యాంకుల గ్యారెంటీపై ప్రచారం చేయకూడదని ఇంటర్ బోర్డు హెచ్చరించింది. ఇలా చేయడం చట్ట విరుద్ధమని, కాలేజీల మధ్య అనారోగ్యకరమైన పోటీని సృష్టించేలా ఉండాలన్నారు. ముఖ్యంగా జూనియర్ కాలేజీలు ఎలక్ట్రానిక్, ప్రింట్‌ మీడియాలో ప్రకటనలు, హోర్డింగ్‌లు, కరపత్రాల పంపిణీ, గోడలపై రాతలు వంటివి చేయకూడదన్నారు. ఏపీలో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి.. ఇంటర్మీడియట్‌లో ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌ను ప్రవేశపెట్టి, సీబీఎస్‌ఈ విధానాన్ని తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ఇంటర్ ఫస్టియర్ పబ్లిక్‌ పరీక్షల తర్వాత ఏప్రిల్‌లో తరగతులు నిర్వహించి, ఆ తర్వాత వేసవి సెలవులు ఇచ్చేలా విద్యా ఇంటర్ బోర్డు ప్లాన్ చేసింది.

2026-27 విద్యా సంవత్సరంలో అకడమిక్‌ కేలండర్‌ వివరాలు ఇలా ఉన్నాయి. జూనియర్‌ కాలేజీలు వేసవి సెలవుల అనంతరం జూన్‌ 1న పునఃప్రారంభం అవుతాయి. అక్టోబరు 5 నుంచి 9 వరకు క్వార్టర్లీ పరీక్షలు నిర్వహిస్తారు. దసరా సెలవులు అక్టోబరు 10 నుంచి 20 వరకు ఉంటయి. హాఫ్ ఇయర్లీ పరీక్షలు నవంబరు 25 నుంచి 30 వరకు జరుగుతాయి. జనవరి 9 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయి. జవనిరి 19 నుంచి 23 వరకు ప్రీఫైనల్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఫిబ్రవరిలో ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు ప్రాక్టికల్‌ పరీక్షలుఉంటాయి. ఫిబ్రవరి లేదా మార్చిలో థియరీ పబ్లిక్‌ పరీక్షలు ఉంటాయి. 2026-27 విద్యా సంవత్సరంలో చివరి వర్కింగ్‌ డే మార్చి 18గా నిర్ణయించారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి